Monday 15 February 2016

worms in the Stomach and intestine - కడుపు-పేగుల లో పురుగులు,చిన్న పిల్లలకి కడుపులో పురుగులు




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - worms in the Stomach and intestine, కడుపు-పేగుల లో పురుగులు,చిన్న పిల్లలకి కడుపులో పురుగులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కడుపులోకి పురుగులు ఎలా చేరతాయి...:

పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారం. సరిగ్గా ఉడికించని మాంసం తినడం, ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు  సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల చాలా సూక్ష్మక్రిములు కడుపులోకి చేరతాయి. కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరగడం వల్ల హుక్ వార్మ్‌వంటి పురుగులు వ్యాప్తి చెందుతాయి . కడుపులో పురుగులున్నాయంటే అవి ప్రోటోజోవా, హెల్మింథస్‌ (ప్లాట్‌, నిమటోడ్‌) వర్గానికి చెందిన పరాన్న జీవులు అయ్యి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి... ఆస్కారిస్‌ వార్మ్స్‌, పిన్‌ వార్మ్స్‌, హుక్‌ వార్మ్స్‌, ఫ్లాట్‌ వార్మ్స్‌ (నులి పురుగులు, నట్టలు, నులిపాములు, ఏలిక పాములు) లాంటివి. పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణములు. చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గోక్కుని వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.

వివరణ-- కడుపులో చేరే అనేక క్రిముల వల్ల నీళ్ల విరేచనాలు, డయేరియా వంటి సమస్యలు కనిపిస్తాయి.సాధారణంగా కడుపులో, పేగుల్లోకి చేరడానికి అవకాశం ఉన్న సూక్ష్మజీవులివి.

 బద్దెపురుగులు :
 ఇవి సరిగా ఉడికించని పోర్క్ వంటి ఆహారం వల్ల కడుపులో చేరే పరాన్న జీవులు. ఈ తరహా జీవులు ప్రధానంగా ఫ్లాటీహెల్మింథిస్, నిమాటీ హెల్మింథిస్ జాతికి చెందినవై ఉంటాయి. ఇందులో నులి పురుగు లేదా ఆస్కారిస్ వార్మ్స్ ఉంటాయి. అవి ప్రధానంగా చిన్న పేగుల్లో ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీరు, సరిగా వండని ఆహారంతో ఈ క్రిములు వాపిస్తాయి.బద్దె పురుగులు-వీటిలో చాలా విభజనలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణ వ్వవస్ధలో చొచ్చుకుని పోతాయి. అక్కడ నుండి ఇవి ఆతిధేయులు (HOST) నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి(పీల్చుకుంటాయి).

పిన్ వార్మ్ లేదా త్రెడ్ వార్మ్ లేదా సీట్ వార్మ్: 
ఇవి నిమటొడా వర్గానికి చెందిన జీవులు. మలద్వారం దగ్గరలో ఉండి దురదను పుట్టిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టిలో తమ మర్మావయవాల వద్ద గోకి మళ్లీ వేళ్లు నోట్లో పెట్టుకోవడం వల్ల ఇవి వ్యాపిస్తాయి. 

హుక్ వార్మ్ (ఎన్‌కైలోస్టోమా):

ఇవి కూడా నిమటోడా వర్గానికి చెందినవే. ఇది చర్మం ద్వారా శరీరంలోకి పొడుచుకుని వెళ్ళి, రక్తనాళాల ద్వారా కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలో వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంది. 

ఎంటమీబా ,జియార్డియా :
 ఇది ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జియార్డియా వంటి ఏకకణ జీవులు పొట్టలోకి, రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతటా దురదలు పుట్టిస్తాయి. 

వుకరేరియా బ్రాంకప్టై :
 ఫైలేరియాసిస్ (బోదకాలు) చాలా రకాల పరాన్న జీవుల చర్మాన్ని లిఫ్ గ్రంధులో చొచ్చు కొని పోయి ఆయా భాగాల్లో వాపును కలిగిస్తాయి.


    పరాన్నజీవులు ఆతిధేయులు ( Host ) శరీరంలో లోపల లేక వెలుపల కణాలలో కానీ శరీర భాగాలలో గానీ చొచ్చుకొని పోయి వాటి నుంచి ఆహార పదార్థాలను పీల్చుకుంటాయి. కొన్ని పరాన్నజీవులు ముఖ్యంగా ఏలిక పాముల వ్యాధి గ్రస్థులను చేసేస్తాయి. ఏలిక పాములు సన్నగా, పొడవుగా, ఎముకలు గానీ, ఏవిధమైన చర్మం గానీ లేకుండా పిల్లలను గుడ్ల నుంచి లార్వాల వరకు పొదిగి, పెరిగిన పాములు చర్మం, కండరాలు, ఊపిరితిత్తులు మరియు పేగులో స్థిరపడేటట్లు వదులుతూ వుంటాయి.

లక్షణాలు:


    ఏ లక్షణాలు వుండవు, బహు కొద్ది లక్షణాలు వుండవచ్చును.
    కొన్నిమార్లు లక్షణాలు వెంటనే కలుగుతాయి. కొన్నిమార్లు 20 సం,, వరకు పడుతాయి.
    కొన్నిసార్లు ఈ పరాన్న జీవులు మొత్తంగా లేదా కొన్ని కొన్ని భాగాలుగా మల విసర్జన నుంచి బయట పడతాయి.
    అన్నవాహిక, జీర్ణ వ్యవస్థ, (అన్నాశయము, పేగులు, కాలేయము, పెద్దపేగు, గుదము).పై బాగాలలో వున్న ఏలిక పాములు కడుపులో నొప్పి కలిగిస్తాయి.
    బలహినత, విరేచనాలు, ఆకలి లేక పోవడం బరువు తగ్గిపోవడం, వాంతులు, రక్తహీనత, పౌష్ఠికాహార లోపం, విటమిన్లు, ధాతువులలోపం, కొవ్వు పదార్ధాల, ప్రోటీన్ల లోపం వంట లక్షణాలు కలుగ చేస్తాయి.
గుద ద్వారము వద్ద దురద, మానము  వద్ద దురద, నిద్రలేమి, ప్రక్కలో మూత్రం పోయడం,కడుపులో నొప్పి వంటి లక్షణాలు నులి పురుగులు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లు కనబడుతాయి.
    చర్మం – వాపులు, నోటితో లేదా ద్రవంతో కూడిన తిత్తులు, బొబ్బలు, మొఖం వాపు, ముఖ్యంగా కండ్ల చుట్టూ కనబడుతుంది.
    అలర్జీ లక్షణాలు – చర్మం మీద దద్దుర్లు, చర్మంలో దురద, గుదద్వారం చుట్టూ దురద,
    అవర ప్లూక్సీ – కాలేయం వాపు, పెద్దగా పెరగడం,జ్వరం,కడుపు నొప్పి, విరేచనాలు, చర్మం పసుపు రంగులో మారడం.
    లింఫ్ గ్రంధులు ఏనుగు కాళ్ళు, (శోషరసనాళ గ్రంధులు) పురుష బీజాశయాలలో వాపు,
 ఇంకా->
నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆహారం తీసుకుంటున్నా బరువు తగ్గిపోతూ ఉండటం, విరేచనాలలో రక్తం, పురుగులు కనిపించడం, మర్మావయవాల వద్ద దురద, శ్వాసలో దుర్గంధం, కళ్ళ చుట్టూ నల్లటి చారలు, చిన్న పిల్లల్లో ముఖంపై తెల్ల మచ్చలు రావడం అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావడం, దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రంలో రక్తం పోవడం,  అనీమియాకు గురికావడం, నిద్రలో ఉన్నప్పుడు పళ్ళు కొరకడం. కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

కారణాలు:

    కణజాలాల్లో ఉండే ఏలిక పాములు మరియు బద్దె పురుగులు.    ప్రేగులలో ఉండే        ఏలిక పాములు – మలవిసర్జనం లో  ఏలిక పాములు గుడ్లు వుంటాయి. వీటితో  కలుషితం అయిన ఆహారం కానీ,నీరు కానీ యాధృచ్చికంగా మనుషులు తీసుకొనడం సంభవింవచ్చు.అప్పుడు అవి వారి శరీరంలోని ప్రేగులలో పెరిగి, రక్త ప్రసరణ ద్వారా శరీరం లోని ఇతర భాగాలకు ముఖ్యంగా ఊపిరితిత్తులకు చేరుతాయి. ఇవి 40cm వరకూ పెరుగుతాయి.

హాని కలిగించే కారణాలు:


    మల విసర్జనలో కలుషితం అయిన నీరు
    అపరిశుభ్ర వాతావరణం (పరిసరాలు)
    పచ్చి లేక పూర్తిగా ఉడకని, కూరగాయలు,చేపలు,మాసం తినడం,
    జంతువుల (గొర్రెలు, కోళ్ళు, బర్రెలు) ను అపరి శుభ్ర పరిసరాలలు,మానవాసాలకు దగ్గరగా ఉంచుకోవడం.
    ఎలుకలు క్రిమికీటకాలతో ఇన్ఫెక్షన్లు,
    పౌష్ఠికాహార లోపం మరియు ఇతర జబ్బులు వున్న వ్యక్తులు,
    దోమలు ఇతర కీటకాలు అధికంగా ఉన్న పరిసరాలు.
    ఆటస్ధలాలో పిల్లలు మట్టిలో ఆడడం మూలాన వాటిలో ఉన్న పరాన్న జీవులు చేతులకు అంటవచ్చును.

నివారణోపాయాలు:

    ద్రవపదార్ధాలు
    విశ్రాంతి
    కుటుంబంలో అందరికి పరీ్క్షలు చేయించి వైద్యం చేయించడం.
    వైద్యం పూర్తయ్యే వరకు లోపలి బట్టలు, దుప్పట్లు, బట్టలు, వేడి నీటిలో ఉడక పెట్టడం,
    చేతులు తరచుగా పరిశుభ్రం చేసుకోవడం, పచ్చి కూరలు, పూర్తిగా ఉడకని ఆహారం తీసుకోకూడదు.
    నీటిని మరిగించి తాగాలి.
    పండ్లు,కూరగాయలు శుభ్రంగా కడిగి వాడుకోవాలి.

 కడుపులో పురుగుల నివారణకు ఆహారనియమాలు:
తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పళ్లు, క్యారట్ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా తేనె, పుప్పొడి పండ్ల విత్తనాలు శరీరంలో పురుగులను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే బవెల్(Bowel) కదలికలు సరిగ్గా ఉండాలి. అప్పుడే విరేచనాల ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి ఇందుకు దోహదపడే విధంగా మంచినీరు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలముద్వారా అవి బయటపడిపోతాయి. 
ఆహారం జీర్ణం అవ్వడంలో తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్-సి, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కలుషితమైన నీళ్లను తాగకూడదు. 

Health with behaviour - ప్రవర్తనతో ఆరోగ్యం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Health with behaviour, ప్రవర్తనతో ఆరోగ్యం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నలుగురితో సఖ్యంగా ఉంటూ, సభ్యతగా వ్యవహరించే వారే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారనే ఒక కొత్త నిజమొకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. బార్ట్స్‌లోని హైజిన్ కౌన్సెల్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ జాన్ ఆక్స్‌ఫర్డ్ ఈ విషయాన్ని వివరిస్తూ సభ్యత, సంస్కారంతో వ్యవహరించే వారే ఆరోగ్య విషయాల్లో ఎక్కువ శ్రద్ధగా ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడయినట్లు చెప్పారు.

ఇతరులకు బాధ కలిగించే రీతిలో వ్యవహరించే వారు తెలియకుండానే తమ ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీసుకుంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయన్నారు. అలా కాకుండా సభ్యతగా వ్యవహరించే వారు తరుచూ జలుబు, దగ్గు, డయేరియా వంటి సమస్యల బారిన పడ టం ఉండదని ఆయన చెప్పారు.

సఖ్యంగా వ్యవహరించే వారిలో ఆరోగ్యం బాగుంటుందని, దానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండటమేనని ఆయన వివరించారు. ఆరోగ్యం కోసమైనా ఇతరులతో సఖ్యంగా వ్యవహరించడబం అలవర్చుకోవాలని ఆయన హితపు పలికారు. సరియైన ప్రపర్తన అన్నది కేవలం మనుషులతో కలిసిపోవడానికే కాద ని, అది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంగానో తోడ్పడుతుందని గ్రహించాలన్నారు.

శరీర వ్యవస్థను మార్చుకోవడం అటుంచితే, ఎవరికైనా తమ ప్రవర్తనను మార్చుకోవడం ఏమంత కష్టం కాదని, ఒకవేళ కొంత క ష్టమే అయినా, ఆరోగ్యం ముఖ్యమైనప్పుడు అందుకు సిద్ధం కావలసిందేనన్నారు ప్రొఫెసర్ జాన్ ఆక్స్‌ఫర్డ్. ఆరోగ్యం మీద ఇంత ప్రభావం చూపుతుందని తెలిసిపోయిన తరువాతైనా మన ప్రవర్తన మీద ఒక ప్రత్యేక దృష్టి సారించవలసిందేగా!

Mental ability dicreases with defective hearing - వినికిడిలోపంతో మేధోక్షీణత?


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Mental ability dicreases with defective hearing, వినికిడిలోపంతో మేధోక్షీణత?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వినికిడిలోపం వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యే కావొచ్చు. కానీ దీంతో ఆలోచన, జాపకశక్తి సామర్థ్యాలూ తగ్గే అవకాశముందా? వినికిడి మామూలుగా ఉన్నవారితో పోలిస్తే వినికిడిలోపం గలవారిలో ఆలోచన సామర్థ్యం 30-40% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అరవై ఏళ్లు పైబడినవారిలో సుమారు మూడింట ఒక వంతు మంది, డెబ్బై ఏళ్లు పైబడినవారిలో మూడింట రెండొంతుల మంది వినికిడిలోపంతో బాధపడుతున్నట్టు అంచనా. అయినప్పటికీ ఇది వృద్ధాప్యంలో వచ్చే మామూలు సమస్యగానే భావిస్తూ చాలామంది చికిత్స తీసుకోవటం లేదు. వినికిడిలోపంతో ఇతరత్రా రకరకాల సమ్యలు వచ్చే అవకాశముందని గుర్తించటం అవసరం. వినికిడిలోపం గలవారికి మతిమరుపు (డిమెన్షియా) ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ బయటపడింది. ఆలోచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాలు తగ్గుతున్నట్టు తాజాగా తేలటమూ దీనినే నొక్కి చెబుతోంది. అదృష్టవశాత్తు వినికిడిలోపం గల చాలామందికి డిమెన్షియా రావటం లేదు గానీ కొంతకాలానికి ఎంతోకొంత విషయగ్రహణ లోపం ఏర్పడుతోందని అధ్యయన కర్త డాక్టర్‌ ఫ్రాంక్‌ లిన్‌ అంటున్నారు. తాజా అధ్యయనంలో ఈ విషయం మీదనే దృష్టి కేంద్రీకరించారు. వినికిడిలోపం గలవారిలో చాలావేగంగా మేధస్సు క్షీణిస్తున్నట్టు గుర్తించారు. వినికిడిలోపం తీవ్రత పెరుగుతున్నకొద్దీ ఆలోచన, జ్ఞాపకశక్తి మరింత వేగంగా తగ్గుతున్నట్టూ తేలటం గమనార్హం. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్చని లిన్‌ చెబుతున్నారు. మన అంతర్‌ చెవిలోని కాక్లియా సంక్లిష్ట శబ్దాలను విద్యుత్‌ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే సంకేతాలు కూడా అస్తవ్యస్తమవుతాయి. అందువల్ల మెదడు వినటానికి, అర్థం చేసుకోవటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందని.. ఆ ప్రయత్నంలో ఆలోచన, జ్ఞాపకశక్తి వంటి వాటిపై దృష్టి పెట్టటం తగ్గిపోతుందనేది ఒక భావన.

వినికిడి లోపంతో బాధపడేవారు నలుగురితో అంతగా కలవలేక ఒంటరిగా ఉండిపోవటం కూడా రకరకాల అనారోగ్య సమస్యలతో పాటు మేధో క్షీణతకూ దోహదం చేస్తుండొచ్చనేది మరొక సిద్ధాంతం. మెదడులోని ఏదో ఒక ప్రక్రియ వినికిడి, మెదడు పనితీరు రెండింటినీ ప్రభావితం చేస్తుండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా వినికిడిలోపంతో ఇతరత్రా సమస్యలూ పొంచి ఉంటాయన్నది మాత్రం తథ్యం. అందువల్ల దీనికి చికిత్స తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

చాలాకాలం నుంచే..:

నిజానికి వినికిడి సమస్య తీవ్రం కావటానికి 5-15 ఏళ్ల ముందు నుంచే రకరకాల ప్రభావాలు ఆరంభమవుతాయి. సాధారణంగా మన లోపలి చెవిలో సూక్ష్మమైన కేశాలు శబ్దాలకు కంపించి, మెదడుకు సంకేతాలు పంపిస్తాయి. ఒకవేళ ఈ కేశాలు దెబ్బతింటే ఆ భాగంలో ఖాళీలు ఏర్పడతాయి. దీంతో మెదడుకు సంకేతాలు సరిగా అందవు. ఫలితంగా కొన్ని స్థాయుల్లోని శబ్దాలు సరిగా వినవబడవు. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఆయా స్థాయుల్లోని శబ్దాల స్పందనలను అర్థం చేసుకోవటాన్ని మెదడు మరచిపోతుంది. దెబ్బతిన్న కేశ కణాలు తిరిగి కోలువకోవటమంటూ జరగదు. పెద్ద శబ్దాలతో వాటిని ప్రేరేపించినప్పటికీ మెదడు వాటిని అర్థం చేసుకోలేకపోవచ్చు.

రకరకాల ఇబ్బందులు:
వినికిడిలోపం రోజువారీ పనుల్లోనూ చిక్కులు తెచ్చిపెడుతుంది. మాట్లాడటం కష్టంగా ఉండటం వల్ల ఒత్తిడి, చికాకు, నిరాశ వంటివి తలెత్తొచ్చు. ఇతరులు తమను చూసి గేలిచేస్తారనే భయం కలగొచ్చు. త్వరగా వృద్ధులమయ్యామని, వైకల్యం వచ్చిందనే భావనలో పడేయొచ్చు. నలుగురితో కలవలేక పోవటం వల్ల ఒంటరితనం.. వినటానికి ఎక్కువగా కష్టపడటం వల్ల శారీరకంగా అలసిపోవటం వంటివీ కనబడొచ్చు. వినికిడిలోపం గలవారికే కాదు వారితో సన్నిహితంగా మెలిగేవారికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వినికిడిలోపాన్ని తోసేసుకు తిరగకుండా తగు చికిత్స తీసుకోవటం మంచిది. వినికిడిలోపాన్ని గుర్తించేందుకు ఇప్పుడు అధునాతన పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. దీన్ని గుర్తించి అవసరమైతే వినికిడి యంత్రాలను వాడటం వల్ల ఇబ్బందులు దరిజేరకుండా చూసుకునే అవకాశం ఉది.

Hormonal influenced Allergies - హర్మోన్ల ప్రభావంతో వచ్చే అలర్జీలు.

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hormonal influenced Allergies,హర్మోన్ల ప్రభావంతో వచ్చే అలర్జీలు.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  


బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రకృతి పరంగా జరగాల్సిన శారీరక, మానసిక మార్పులకు తోడ్పడుతూ రకరకాల జీవక్రియలను, అవయవాలను సంకేతాల ద్వారా శరీరంలోని హార్మోన్లు క్రమబద్ధీకరిస్తాయి. అయితే శారీరక, మానసిక అవలంబనలో ఒడిదుడుకుల వల్ల హార్మోన్లు అసమతుల్యతకు గురవుతుంటాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థతో సంయోగంతో నడిచే హార్మోన్లు ఎటువంటి అసమతుల్యత గురైనా ప్రతిస్పందన చర్యలతో రోగనిరోధక వ్యవస్థను కూడా ఇబ్బందులకు గురిచేస్తాయి. దాని పర్యవసానంగా ఏర్పడేవే అలర్జీలు.

ముఖ్య లక్షణాలు:
బాల్యంలో: పుట్టిన పిల్లల్లో తల్లికి చెందిన ఈస్ట్రోజెన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా దద్దుర్లు, జలుబు, దగ్గు, రకరకాల చర్మ సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాకుండా రొమ్మ పరిమాణం పెరగటం, యోని భాగం ఇన్‌ఫెక్షన్ల బారిన పడటం జరగవచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ సరైన చికిత్స లేకపోవటం వల్ల తరచు జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం మొదలైన ఇన్‌ఫెక్షన్లతో సతమతమవుతారు. తామర, గజ్జి, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

యవ్వనంలో: చాలామంది పిల్లల్లో యవ్వన దశలో జరిగే హార్మోన్ల అసమతుల్యత కారణంగా మగపిల్లల్లో రొమ్ము పరిమాణం పెరగటం, మీసాలు, గడ్డాలు, జనన అవయవాలు త్వరగా అభివృద్ధి చెందటం, ఆడపిల్లల్లో నెలసరి త్వరగా మొదలవటం లేదా ఆలస్యంగా మొదలవటం, నెలసరి సమస్యలు, తెల్లబట్ట వంటివి కనిపించవచ్చు. జుట్టు రాలటం, సైనసైటిస్, టాన్సిల్స్, ఆడినాయిడ్‌ల ఇన్‌ఫెక్షన్, చర్మ సమస్యలు ముఖ్య సంకేతాలుగా పరిగణించవచ్చు. అవగాహన లేక సరైన చికిత్స తీసుకోకపోవటం వల్ల యవ్వనంలో థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, ఒబేసిటి, సొరియాసిస్ వంటి వ్యాధులకు గురికావచ్చు. జ్ఞాపక శక్తి తగ్గటం, ఏకాగ్రత లోపాలు, ఆందోళన, సున్నితమైన మనస్తత్వం కనిపించవచ్చు.

మధ్య వయస్కులలో: 
అలర్జీల ప్రభావం వల్ల సైనస్ తలనొప్పి, దీర్ఘకాలిక సైనస్ ఇన్‌ఫెక్షన్, ఆస్తమా లేదా బ్రాంకైటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, తినే ఆహారం జీర్ణం కాకపోవడం, విరేచన సమస్యలు, ఎగ్జిమా, అర్టికేరియా వంటి చర్మ సమస్యలు మొదలు కావచ్చు. దీర్ఘకాలిక అలర్జీల ప్రభావంతో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తలెత్తవచ్చు. స్త్రీలలో పిసిఓడి, ఫైబ్రాయిడ్ సమస్యలు, పురుషులలో వీర్య కణాల సమస్యలు, తర్వాత సంతానలేమి సమస్యలు ఎదురుకావచ్చు. 

వృద్ధాప్యంలో: స్త్రీలలో నెలసరి ఆగిపోయే సమయంలో పిగ్‌మెంటేషన్ మొదలైన చర్మ సమస్యలు, ఎముకలు మెత్తబడి ఆస్టియోపొరోసిస్ లాంటివి మొదలు కావటం ఈస్ట్రోజెన్ హార్మోన్ అసమతుల్యత ప్రభావంగా పేర్కొనవచ్చు. పురుషులలో ప్రొస్టేట్ సమస్యలు, కీళ్ల నొప్పులు మొదలైనవి హార్మోన్, అలర్జీల సంయోగ ప్రభావం వల్ల మొదలవుతున్నట్లు శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడయింది.

ప్రేరేపకాలు:
చిన్న పిల్లల్లో రకరకాల మందుల దుష్ప్రభావాలు, పిల్లలను వారి పేరెంట్స్ అతిగా నియంత్రించడం, పదిమందిలో తిట్టడం, దీంతో పిల్లల్లో ఆందోళన ఏర్పడటం వల్ల కూడా రకరకాల అలర్జీల రూపంలో బయటపడవచ్చు. అంతేగాక మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు, కృత్రిమ ఆహారం, పౌష్టికాహార లోపాలు, పని ఒత్తిడి, తగినంత శారీరక పరిశ్రమ లేకపోవటం, నిద్రలేమి, సొంతవైద్యం లాంటివి కూడా ముఖ్య ప్రేరేపకాలుగా గుర్తించవచ్చు.

దుష్పరిణామాలు:

అలర్జీ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించకపోవటం లేదా సాధారణ మందులతో తాత్కాలిక ఉపశమనం పొందటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులలోకి దారితీయవచ్చు. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్, డయాబెటిక్ స్పాండిలైటిస్, ఆస్టియోపొరోసిస్, థైరాయిడ్ సమస్యలు, ఒబేసిటి మొదలైన వ్యాధులకు దారితీయవచ్చు. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినటం వల్ల టిబి, న్యుమోనియా, థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లివర్, కిడ్నీల వైఫల్యానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంది.

నిర్దారణ పరీక్షలు:
ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించటం చాలా సులభం. ఇఎస్ఆర్, సిబిపి, ఐజిఇ, ఇసినోఫిల్ కౌంట్, సిఆర్‌పి, ఆర్ వంటివి సాధారణ పరీక్షలు. వీటితోపాటు టిఎస్‌హెచ్, టి3, టి4, ఈస్ట్రోజెన్, స్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల పరీక్షల ద్వారా రెండింటికి గల సంబంధం తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక ప్రతిస్పందనల వల్ల కేన్సర్ సంబంధిత పరీక్షలు చేయించుకోవలసిన అవసరం కూడా రావచ్చు.

Stress reducing ways - ఒత్తిడిని తగ్గించే మార్గాలు

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Stress reducing ways,ఒత్తిడిని తగ్గించే మార్గాలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



* శరీరాన్ని సాధ్యమైనంతవరకూ సాగదీసేందుకు ప్రయత్నించండి. అలాగని యోగా చేయమని కాదు. ముందుగా నిటారుగా నిల్చుని ముందుకు వంగాలి. అలాగే చేతుల్ని వెనక్కి పెట్టి రెండింటినీ కలిపి భుజాలను సాధ్యమైనంత వరకూ వెనక్కి సాగదీయాలి. మెడను సవ్య, అపసవ్య దిశలో గుండ్రంగా ఐదారుసార్లు తిప్పడం లాంటివన్నీ ఒత్తిడిని తగ్గించే మార్గాలే.

* నిశ్శబ్దంగా ఉన్న గదిలో కూర్చుని కళ్లు మూసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ, దృష్టంతా దానిమీద ఉంచి హాయిగా విశ్రాంతి తీసుకోండి. ముందు ముక్కుతో గాలి తీసుకుని అది వూపిరితిత్తులకు చేరనివ్వాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి తరవాత నోటితో వదిలేయాలి. ఇలా ఐదు నిమిషాలు చేయగలిగితే, ఎంతో మార్పు కనిపిస్తుంది.

* పగటి కల కూడా ఒత్తిడిని తగ్గించేందుకు చక్కని పరిష్కారం అంటారు నిపుణులు. హాయిగా కళ్లు మూసుకుని నచ్చిన ప్రదేశాన్ని వూహించుకోవాలి. చిన్నతనాన్ని గుర్తుతెచ్చుకోవాలి. అద్భుతం సాధించినట్లు కలగనాలి. ఇలాంటి చిన్నచిన్న వూహలు ఒత్తిడిని దూరం చేసి ఉత్సాహాన్నిస్తాయి.

* ఒత్తిడి తగ్గించే వైవాహిక జీవనం :సాధారణంగా వైవాహిక జీవితాన్ని సుఖసంతోషాలతో అనుభవించే పురుషులు ఏ రకమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం లేదట. పైపెచ్చు.. రోజువారీ జీవితంలోనూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు తాజాగా అమెరికాకు చెందిన కిన్స్ ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన తాజాగా అధ్యయనంలో తేలింది.అలాగే, మహిళలకు కూడా రతిలో సరైన భావప్రాప్తి లభిస్తే శరీరానికి, మనసుకు ఆనందాన్నిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శృంగారం అంటే సక్రమమైన శృంగారంగా వుండాలని, అక్రమ మార్గాల ద్వారా పొందే శృంగారంలో ఆనందం కంటే ఆందోళన, గిల్టీ ఫీలింగ్స్‌ ఎక్కువగా ఉంటాయని వారు చెపుతున్నారు. అందుకే భర్తతో లేదా తనకు ఇష్టమైన పురుషుడితో ఏకాంతంగా శృంగారం పొందిన స్త్రీలు రోజంతా ఆనందంగా ఉంటారని వారు చెపుతున్నారు.

ఒత్తిడిని తగ్గించే చిట్కాలు:


రోజు నిద్రలేచే సమయానికి 15 నిమిషాల ముందు నిద్రలేవండి. 
వేగంగా నడవండి. ఆఫీసుకెళ్లడానికి మోటారు వాహనానికి బదులుగా సైకిల్‌ను వాడండి. 
మిమ్మల్ని అభినందించే వారితో గడపండి. కాదని చెప్పడం నేర్చుకోండి. 
బిగ్గరగా నవ్వడం సాధన చేయండి. 
దీర్ఘశ్వాస తీసుకుని వదలండి. 
సాయంత్రం వేళ టీవీ లేకుండా గడపండి. ఆటలకు కొంత సమయం కేటాయించండి. 
ఒక సమయంలో ఒకే పనిచేయండి. 
కాఫీ తాగడం మానండి. 
ప్రతీ రోజూ మీకు ఆహ్లాదాన్ని, నవ్వించే సాహిత్యాన్ని చదవండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు పది లేదా 100 వరకు అంకెలను లెక్కపెట్టండి. 

MTP cum Abortion awareness - అబార్షన్‌ లేదా ఎంటీపీ అవగాహన



  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -MTP cum Abortion awareness,అబార్షన్‌ లేదా ఎంటీపీ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  
    అబార్షన్‌.. కొందరు అవాంఛిత గర్భాన్ని వద్దనుకోవడానికి చేయించుకుంటే.. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి మరికొందరు. ఉన్నత చదువులూ, కెరీర్‌లో స్థిరపడాలనుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలూ... ఇలా కారణాలు ఏవయినా, అనుకోకుండా వచ్చే గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు  సమస్యల్నీ అంచనా వేసుకోవాలి. అవి ఇన్‌ఫెక్షన్ల నుంచి శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని కోల్పోయే దాకా ఉండొచ్చు.

కావాలనుకున్నప్పుడే తల్లయ్యేలా నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉన్నా.. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవాలనుకునే స్త్రీలు.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి సమక్షంలో, ఏ పద్ధతిలో అబార్షన్‌ చేయించుకోవాలనేదీ ఎంటీపీ చట్టం తెలియజేస్తుంది. ఎందుకంటే.. సరైన పద్ధతుల్లో అబార్షన్‌ చేయించుకోని వాళ్లలో చాలామంది ఎన్నో సమస్యల్ని  ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు మరణిస్తున్నారు కూడా. అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు నాలుగు కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయి. అలా  చేయించుకునే వారిలో కొందరు జీవితకాలం ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఏటా దాదాపు అరవై ఏడు వేలమంది కేవలం అబార్షన్ల వల్లే చనిపోతున్నారు. మన  దేశాన్ని మాత్రమే తీసుకుంటే ఏడాదికి ఒకటిన్నర కోట్ల అబార్షన్లు జరుగుతుంటే.. కోటి మంది ప్రమాదకర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకుంటున్నారు. దాంతో  అత్యధికంగా దాదాపు ఎనభై లక్షల మంది అబార్షన్ల వల్ల వచ్చే ఇతర సమస్యలతో జీవితాంతం బాధపడుతున్నారు. పదిహేను నుంచి ఇరవైవేల మంది మరణిస్తున్నారు. 

గర్భాన్ని కొనసాగించడం వల్ల తల్లికిగానీ, బిడ్డకు గానీ సమస్యలు ఎదురవుతాయి అనుకున్నప్పుడు అబార్షన్‌ చేయించుకోవాలి తప్ప.. అసలు అవాంఛిత గర్భాన్ని రాకుండా 
చూసుకోవడమే మంచిది. ఒకవేళ వచ్చి అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నా దాన్ని కూడా సురక్షిత విధానంలోనే చేయించుకోవాలి.

సురక్షితమైన పద్ధతంటే..:
అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నప్పుడు సొంతంగా తోచిన మాత్రల్ని వేసుకోకుండా మొట్టమొదటగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి. దాన్ని కూడా అర్హత ఉన్న డాక్టర్‌ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. నెలల్ని బట్టి, ఇతర ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి ఏ పద్ధతిలో చేయించుకోవాలనేదీ డాక్టరే సూచిస్తారు. అలాగే గర్భస్రావం చేయించుకునే చోటూ, ఇతర పరిసరాలూ పరిశుభ్రంగా ఉండాలి. వాడే పనిముట్లన్నీ కూడా స్టెరిలైజేషన్‌ చేయాలి. అబార్షన్‌ చేస్తున్నప్పుడు ఆ స్త్రీకి అనుకోకుండా ఏదయినా సమస్య  ఎదురైతే మరో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లూ అందుబాటులో ఉండాలి. లాప్రోస్కోపీ, లాప్రోటమీ చేసి సమస్యను చక్కదిద్దే సౌకర్యం ఉన్న ఆస్పత్రినే ఎంచుకోవాలి.

వయసును బట్టి విధానం..:

సాధారణంగా రెండు, మూడు నెలల లోపు చేయించుకోవచ్చు. ఒకవేళ ఇరవై వారాలు గడిచాక కూడా శిశువుకు ఏదయినా సమస్య ఉండి, అది తల్లి ప్రాణాలకు హాని  చేస్తుంది అనుకుంటే అప్పుడూ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం రెండో అభిప్రాయం కోసం మరో గైనకాలజిస్టు సలహా కూడా తీసుకోవడం చాలా అవసరం. ఇలా నెలల్ని బట్టి మందులు లేక శస్త్రచికిత్స పద్ధతిలో అబార్షన్‌ చేస్తారు. తొమ్మిది వారాల్లోపు అయితే మందులు వేసుకోవచ్చు. అయితే ముందు డాక్టర్‌ పరీక్ష చేసి  హిమోగ్లోబిన్‌ శాతం, ఇతరత్రా సమస్యలూ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి గర్భం గర్భాశయంలోనే ఉందా లేదా అన్నది తేల్చుకుంటారు. తప్పనిసరిగా డాక్టర్‌ సలహాతో ఆర్‌హెచ్‌  రక్తపరీక్ష కూడా చేయించుకోవాలి. ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ అని వస్తే మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో గర్భం (ఎక్టోపిక్‌  ప్రెగ్నెన్సీ) ఉన్నప్పుడు మాత్రల్ని వాడితే తల్లి ప్రాణాలకు ముప్పు రావచ్చు. కాబట్టి ఇవన్నీ పరిగణించే మందుల్ని ఎంత మోతాదులో ఇవ్వాలనేదీ వైద్యులు నిర్ణయిస్తారు. 

వీటిని వేసుకోవడం సులువైనా కొన్ని సమస్యలు మాత్రం ఎదురవుతాయి. మాత్రల వల్ల నూటికి పది, పదిహేను శాతం మందిలో గర్భాశయంలో చిన్నచిన్న ముక్కలు  మిగిలిపోతాయి. అలాంటప్పుడు ఎక్కువ రక్తస్రావం కావడం, నొప్పి లాంటి సమస్యలూ పెరుగుతాయి. దాంతో మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.  గర్భసంచిలో చిన్నచిన్న ముక్కలు మిగిలిపోయినప్పుడు అబార్షన్‌ పూర్తి కాదు కాబట్టి కొన్ని భాగాలకు చీము పడుతుంది. ఆ ఇన్‌ఫెక్షన్‌ కటివలయానికీ కూడా వ్యాపిస్తుంది.  ఆ ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడానికి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. సమస్య ఉంటే వాక్యూమ్‌ యాస్పిరేషన్‌ పద్ధతిలో గర్భాశయాన్ని శుభ్రం చేస్తారు. 

కొన్నిసార్లు గర్భాశయంలో రక్తం నిలిచి సంచిలా తయారవుతుంది. అలాంటప్పుడు ఆ రక్తాన్ని తొలగించి గర్భసంచిని శుభ్రం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే  ... మరికొన్నిసార్లు ఫెల్లోపియన్‌ ట్యూబులు, పొట్ట, కటివలయం, అండాశయాల్లాంటి భాగాలకు కూడా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించవచ్చు. దాంతో ఆ భాగాల్లో చీము పడుతుంది.  ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఫెల్లోపియన్‌ ట్యూబులు మూసుకోవడం వల్ల ఆ తరవాత గర్భం దాల్చడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు శాశ్వతంగా పిల్లల్ని కనే అవకాశాన్నీ కోల్పోవచ్చు. ఆ ఇన్‌ఫెక్షన్‌ దీర్ఘకాలికంగా కొనసాగి (క్రానిక్‌ పీఐడీ) జీవితాంతం సమస్యలు వేధించవచ్చు. ముఖ్యంగా విపరీతమైన పొత్తికడుపు నొప్పి, వైట్‌ డిశ్ఛార్జి, కలయిక సమయంలో నొప్పి.. నెలసరి తరచుగా, ఎక్కువగా అవుతుండటం లాంటివి బాధిస్తాయి.

శస్త్రచికిత్స: దీన్ని వాక్యూమ్‌ యాస్పిరేషన్‌ పద్ధతిలో చేస్తారు. జననేంద్రియ భాగం నుంచి సన్నటి ట్యూబ్‌ లాంటిదాన్ని ప్రవేశపెట్టి నెగెటివ్‌ ప్రెషర్‌తో గర్భాన్ని తొలగిస్తారు. దీనివల్ల ఎదురయ్యే నొప్పిని నివారించేందుకు మత్తు ఇస్తారు. శస్త్రచికిత్స చేసిన రోజే  ఇంటికెళ్లిపోవచ్చు. అదే నెలలు గడిచేకొద్దీ దీన్ని చేయడం కూడా కష్టం అవుతుంది. గర్భాశయ ద్వారం తెరుచుకోవడానికి మందులు వాడి ఆ తరవాత చేయాల్సి రావచ్చు. ఇది కూడా కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెడుతుంది. అయితే అబార్షన్‌ని  సురక్షితమైన పద్ధతుల్లో చేయించుకున్నా కూడా రెండు లక్షలమందిలో ఒకరికి దానివల్ల సమస్య తప్పదు.  

ప్రమాదకరం...:

శస్త్రచికిత్స ద్వారా అబార్షన్‌ చేసేటప్పుడు అరుదుగా గర్భాశయం చిల్లులు పడి, విపరీతమైన రక్తస్రావం కావచ్చు. అలా జరిగినప్పుడు నెగెటివ్‌ ప్రెజర్‌ వల్ల గర్భసంచికీ, పేగులకీ, మూత్రాశయానికీ చిల్లులు పడే ప్రమాదం కూడా ఉంది. అలాంటివి నిర్థరించడానికి మళ్లీ లాపరోస్కోపీ చేయాల్సి ఉంటుంది. చిల్లులు పడిన చోట మళ్లీ కుట్లు వేయాలి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. నలభై ఏళ్ల క్రితం సెప్టిక్‌ అబార్షన్లు ఎక్కువగా ఉండేవి. అంటే సరైన సదుపాయాల్లేని చోట్ల ఎవరితో పడితే వాళ్లతో గర్భస్రావం చేయించుకోవడం అన్నమాట. దాంతో సెప్టిక్‌ షాక్‌ సిండ్రోమ్‌ సమస్యతో తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే వాళ్లు. మరీ అంతటి సమస్యలు రావు కానీ సొంతంగా  మాత్రలు వేసుకోవడం, రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల అధికరక్తస్రావం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ తప్పవు. వాటి బారిన పడకుండా ఉండాలంటే, గర్భనిరోధక  సాధనాలు వాడుతూ అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్తపడాలి. నిర్లక్ష్యంగా ఉంటూ, అబార్షన్‌ అవకాశం ఉంది కదా అనుకోకూడదు.

Thalassemia disease - తలసీమియా వ్యాధి

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Thalassemia disease,తలసీమియా వ్యాధి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


   తలసీమియా వ్యాధి - మే 8న ప్రపంచ తలసీమియా దినం.
రక్తం కావాలి. అదీ ఒకసారో రెండుసార్లో కాదు. ఏడాదో రెండేళ్లో కాదు - జీవితాంతం! 
తలసీమియా - జన్యు సంబంధమైన వ్యాధి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి ... దురదృష్టం ఏమిటంటే, ప్రాణంపోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసీమియా జన్యు వాహకులైన తల్లిదండ్రులకు (తలసీమియా మైనర్‌) జన్మించే బిడ్డల్లో పాతికశాతం మంది పుట్టుకతోనే వ్యాధిగ్రస్థులయ్యే (తలసీమియా మేజర్‌) అవకాశం ఉంది. మిగతా పాతికశాతం మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. మరో యాభైశాతం కేవలం వాహకులుగానే (తలసీమియా మైనర్‌) మిగిలిపోవచ్చు. వీరికి పెద్దగా సమస్యలు ఉండవు కానీ, మరో వాహకుడి ద్వారానో వాహకురాలి ద్వారానో కలిగే సంతానానికి మాత్రం తలసీమియా వచ్చే అవకాశం ఉంది. మనదేశంలో ఆరు కోట్లమంది తలసీమియా వాహకులు ఉన్నారు.

తలసీమియా ప్రభావం రక్తంపై పడుతుంది. నేరుగా హిమోగ్లోబిన్‌ మీద ఉంటుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువును, రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అందించే బాధ్యత హిమోగ్లోబిన్‌దే. తలసీమియా రోగుల్లో...శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. తయారైనా, ఎక్కువకాలం మనలేదు. ఫలితంగా, హిమోగ్లోబిన్‌ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ, కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే...ప్రాణాంతకమే! ఏటా దేశంలో పన్నెండువేల మంది చిన్నారులు తలసీమియాతో పుడుతున్నారనీ అందులో వేయిమంది మన రాష్ట్రంలోనే పుడుతున్నారనీ ఒక అంచనా. ఈ లెక్కలూ అర్ధసత్యాలే. కనీస వైద్యం కూడా కరవైన మారుమూల ప్రాంతాల్లో...ఎవరు రోగనిర్ధారణ చేస్తారు? వైద్యులకే అవగాహనలేని పరిస్థితుల్లో...ఎవరు చికిత్స అందిస్తారు? జ్వరమనో, విరేచనాలనో, పోషక విలువల లోపమనో... ఆ సమస్యకు ముద్రవేస్తారు. ఏడాది తర్వాతో, రెండేళ్ల తర్వాతో బిడ్డ ప్రాణాలు పోతే, భూమ్మీద నూకలు చెల్లాయని నిర్వేదంగా ఓ నిట్టూర్పు విడుస్తారు. అదేగా జరుగుతున్నది. మాయదారి జబ్బు ఎంతమంది చిన్నారుల్ని బలితీసుకుంటోందో! రక్తం అందక ఎంతమంది పసిమొగ్గలు మాడిమసైపోతున్నారో! ఎన్ని కుటుంబాల్లో కడుపుకోత మిగుల్తోందో! కచ్చితమైన లెక్కలు తీస్తేకానీ తలసీమియా ఉగ్రరూపమేమిటో తెలియదు.


 తలసీమియా రోగులకు జీవితాంతం రక్తం ఎక్కించాలి. మరో దార్లేదు. తలసీమియా రోగులకు తప్పనిసరైన 'సెలైన్‌ వాష్డ్‌ రక్తం' హైదరాబాద్‌లోనే ఉచితంగా దొరుకుతుంది మరి ఉన్నవారి సంగతి సరే. నిరుపేదల పరిస్థితేమిటి? పనులు వదులుకుని పట్టణాల చుట్టూ తిరగడం ఎలా సాధ్యం? రక్తం వరకూ హైదరాబాద్‌లోని తలసీమియా సొసైటీ సమకూరుస్తుందని ధైర్యంగా ఉన్నా, నెలనెలా ఖరీదైన మందులు కొనాలి. రక్తం ఎక్కించిన ప్రతిసారీ ల్యూకో డిప్లీషన్‌ ఫిల్టర్స్‌ వాడాలి. క్రమం తప్పకుండా దంత పరీక్షలూ గుండె పరీక్షలూ మూత్రపిండాల పరీక్షలూ కాల్షియం, ఫాస్పరస్‌ స్థాయిలను తెలిపే పరీక్షలూ చేయిస్తూ ఉండాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే, ఏదో ఓ మాయదారి రోగం ముసురుకుంటుంది. తలసీమియా పిల్లలకు వ్యాధి నిరోధకత తక్కువ. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నెలకు ఐదు నుంచి పదివేల దాకా మందులకే ఖర్చవుతుంది. 'ఒకవైపు ఇద్దరు పిల్లల చదువులు, ఇంకోవైపు వీడి వైద్యం - నెలనెలా ఎంతోకొంత అప్పు చేయక తప్పడం లేదు' అని బాధపడతాడు ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా పనిచేస్తున్న రాజు. అలా అని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకునే అవకాశమూ లేదు. ఎవరో ఒకరు తలసీమియా చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాలి. సాధారణంగా బిడ్డ బాధ్యత అమ్మలే తీసుకుంటారు. ఆర్థిక భారాన్ని నాన్నలు నెత్తినేసుకుంటారు. ఆడుతూపాడుతూ బడికెళ్లాల్సిన వయసులో ఆసుపత్రుల చుట్టూ తిరగడమేమిటంటూ...బంధువుల నుంచీ ఇరుగుపొరుగు నుంచీ ఒత్తిళ్లు. ఏవేవో గుసగుసలు. ఆ మాటల తూటాలు ముందుగా తాకేది కన్నతల్లినే. జన్యు సమస్య భార్యాభర్తలు ఇద్దర్లోనూ ఉన్నా...మగవాడిని వేలెత్తిచూపే సాహసం ఎవరికుంది? లోపమంతా ఆమెదే అన్నట్టు మాట్లాడతారు. అయినా, మౌనంగా భరించాల్సిందే. కొడుక్కి రెండోపెళ్లి చేస్తామంటూ ఇల్లాలిపై ఒత్తిడి తెచ్చే అత్తమామలూ ఉన్నారు. బిడ్డ పరిస్థితికి బాధపడాలో, బంధువుల అజ్ఞానానికి సిగ్గుపడాలో - తోచని దుస్థితి. అర్థంచేసుకునే భర్త ఉంటే, కొంతలో కొంత నయం. లేదంటే నరకమే. అలాంటి పరిస్థితుల్లోనూ కుమిలిపోతూ కూర్చోడానికి వీల్లేదు. పసివాడి వైద్యం కోసం పరుగులు తీయాల్సిందే. ఎన్ని అవరోధాలు ఎదురైనా, రక్తం పంచుకు పుట్టినవాడికి రక్తాన్ని సమకూర్చాల్సిందే. ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు, మొదటి బిడ్డో రెండో బిడ్డో పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయినప్పుడు...సమీప బంధువులు తలసీమియా పసివాడి పట్ల వివక్ష చూపుతున్న దాఖలాలూ లేకపోలేదు. కన్నవారికి ఆ ఆలోచన లేకపోయినా, తాతయ్యలూ నానమ్మలూ మేనత్తలూ బాబాయిలూ తదితర బంధుగణం మాత్రం - ఆ పసివాడితోనో పసిదానితోనో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఉదంతాలూ అనేకం. నేడో రేపో మరణం ఖాయమన్నట్టు మాట్లాడుతున్న సంఘటనలూ అనేకం. ఆడపిల్లల విషయంలో అయితే ఈ వివక్ష మరీ ఎక్కువ. ఇలాంటి వాతావరణంలో అమ్మ పాత్రే కీలకం. పసివాళ్లకు ఆ తేడా అర్థం కాకుండా జాగ్రత్తపడాలి. గుండెల్లో ధైర్యం నింపాలి. జీవితంమీద ప్రేమ కల్పించాలి.

ఎదిగేకొద్దీ...:

తలసీమియా - అంటే గ్రీకుభాషలో సముద్రం. నిజంగానే సముద్రంలా అంతులేని సమస్య ఇది. సముద్రంలా ఆటుపోట్లతో కూడిన వ్యాధి ఇది. తలసీమియా పిల్లల జీవితాలు పౌర్ణమి-అమావాస్యల్ని తలపిస్తాయి. ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడు...బిడ్డ పున్నమి చంద్రుడే. కళకళలాడుతుంటాడు. హుషారుగా కనిపిస్తాడు. రక్తం తగ్గిపోయేకొద్దీ... అమాస చంద్రుడిలా నీరసించిపోతాడు. నిన్నమొన్నటిదాకా అవలీలగా మోసుకెళ్లిన పుస్తకాల సంచి కూడా కొండలా బరువెక్కినట్టు అనిపిస్తుంది. అడుగేస్తే ఆయాసం. అంతులేని నీరసం. జీర్ణశక్తి మందగిస్తుంది. పొట్ట లావెక్కుతుంది. ఎముకల్లో పటుత్వం సన్నగిల్లుతుంది. తనలో ఏదో లోపం ఉందన్న సంగతి మెల్లమెల్లగా అర్థమవుతుంది. 'చెల్లికెందుకు నాలా రక్తం ఎక్కించరు?', 'తమ్ముడెందుకు మాత్రలు వేసుకోడు?' ... ఇలా రకరకాల సందేహాలు. భోజనం విషయంలోనూ పరిమితులు. అందర్లా అన్నీ పెట్టకూడదు. ప్రొటీన్లూ కేలరీలూ పుష్కలంగా ఉండాలి. ఐరన్‌ అతి తక్కువగా ఉండాలి. 'అదెందుకు తినకూడదు, ఇదెందుకు తినకూడదు...' అన్న ప్రశ్నలొకటి. సమాధానాలు చెప్పలేక కన్నతల్లి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వైద్య పరీక్షల కోసం, రక్తం కోసం తరచూ ఏ హైదరాబాద్‌కో వెళ్లాల్సి రావడంతో...బడికి గైరు హాజరు తప్పదు. చదువుల్లో వెనుకబాటూ తప్పదు. మిగతా పిల్లలతో పోలిస్తే శారీరక ఎదుగుదల కూడా తక్కువే. దీంతో ఎక్కడలేని ఆత్మన్యూనతాభావం. సమూహాలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఏ కంప్యూటర్‌ ముందో కాలక్షేపం చేస్తుంటారు. పెద్దయ్యేకొద్దీ అంతర్ముఖులుగా మారతారు. 
తలసీమియా ఒంటరిగా రాదు. వస్తూవస్తూ అచ్చంగా తనలాంటి రాకాసి మూకనే వెంటబెట్టుకుని వస్తుంది. రక్తంతోపాటు శరీరంలోకి వెళ్లే ఇనుము - మూత్రపిండాలు, కాలేయం, మెదడు...ఇలా ఏదో ఓచోట పోగుపడిపోతుంది. దీంతో ఆ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. తరచూ ఎక్కించే రక్తంలో...ఏ హెచ్‌ఐవీ క్రిములో ఉంటే...మరో గండం! మధుమేహ పీడితులూ అధిక రక్తపోటు బాధితులూ ఇచ్చిన రక్తమైతే ఇంకేవో సమస్యలు. దాత రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉంటే మరో ఇబ్బంది. ఉన్న రుగ్మతకు తోడు కొత్త రోగాలు. నిజానికి, పక్షానికోసారి జీవన్మరణ పోరాటమే! ఇన్ని గండాల్ని దాటేస్తూ... కౌమారానికి వచ్చేసరికి తలసీమియా పిల్లల్లో ఓరకమైన నైరాశ్యం కమ్మేస్తుంది. లోపాలు శాపాల్లా అనిపిస్తాయి. ఒకరిద్దరు ఆత్మహత్య దిశగానూ ఆలోచిస్తారు. పరిమితుల్ని అర్థంచేసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఆశావాదంతో జీవించేవారూ ఉన్నారు. పెద్దచదువులు చదువుకుంటున్నవారూ ఉద్యోగాలు చేసుకుంటున్నవారూ తక్కువేం కాదు. ఈ పిల్లలు ఎంతకాలం జీవిస్తారనడానికి...కచ్చితమైన కొలమానమేం లేదు. శరీర వ్యవస్థ సహకరించినంత కాలం, రక్తమూ మందులూ అందుతున్నంతకాలం, వైద్య పర్యవేక్షణ కొనసాగుతున్నంత కాలం... సవాళ్లను అధిగమిస్తూ బతుకుబండి నడిపిస్తారు.

'మా పిల్లలకు మేం, ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకు నిలబడే ధైర్యాన్ని నూరిపోస్తాం' అంటారు హైదరాబాద్‌లోని తలసీమియా సొసైటీ ప్రతినిధి రత్నావళి. దాదాపు ఇరవై ఏళ్లు తలసీమియాతో పోరాటం సాగించి... ఒకానొకరోజు అమ్మ ఒడిలో ప్రశాంతంగా కన్నుమూసిన రోహిత్‌ అనే కుర్రాడి తల్లి ఆమె. అప్పటికి, తలసీమియా అన్న మాటను ఎలా ఉచ్చరించాలో కూడా తెలియని అజ్ఞానం. చాలామంది డాక్టర్లకు అదో వ్యాధిపేరో మందుపేరో కూడా తెలియని రోజులవి. గడపగడపకూ వెళ్లి 'అమ్మా! నా బిడ్డకు రక్తదానం చేయండి...' అంటూ కొంగుచాచి అభ్యర్థించిన సందర్భాలెన్నో. ఆ కష్టం మరొకరికి రాకూడదన్న ఉద్దేశంతో తనలాంటి మాతృమూర్తుల్ని కలుపుకుని తలసీమియా సొసైటీని స్థాపించారు రత్నావళి. ఆ ఉద్యమంలో తొలి కార్యకర్త రోహిత్‌. అవగాహన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 'ఏం ఫర్వాలేదు. మీ పిల్లలకేం కాదు. నాకూ తలసీమియా ఉంది. అయినా చురుగ్గాలేనూ' అంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేవాడు. స్నేహితుల్ని ప్రోత్సహించి రక్తదానం చేయించేవాడు. సొసైటీ వెబ్‌సైట్‌ రూపకల్పనలోనూ పాలుపంచుకునేవాడు. మృత్యువు ఆ కుర్రాడి జీవితాన్ని చిదిమేయగలిగింది కాని, ఆశయాల్ని మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడా సంస్థ రెండువేలమంది పిల్లలకు అండగా నిలుస్తోంది. ఉచితంగా రక్తాన్ని అందిస్తోంది, వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. తగ్గింపు ధరలకు మందులు ఇస్తోంది. పిల్లల్లో తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతోంది.


బాధ్యులెవరు...:
అభంశుభం తెలియని పిల్లలకు అన్ని కష్టాలెందుకు? ఆడుతూపాడుతూ గడపాల్సిన వయసులో సూదుల గాయాలేమిటి? పాలసీసాల ప్రాయంలో రక్తం ప్యాకెట్ల అవసరమేం వచ్చింది?...తరచి చూస్తే, నిజాయతీగా ఆలోచిస్తే - ఆ పాపం మనదే. మొత్తంగా సమాజానిదే. నిశ్చితార్థానికి ముందు వధూవరులు కంప్లీట్‌ బ్లడ్‌కౌంట్‌ (సీబీసీ), హెచ్‌బిఏ2 లెవెల్‌ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ఇద్దర్లో కనీసం ఒక్కరైనా తలసీమియా వాహకులు కాదని తేలితే, నిరభ్యంతరంగా ముహూర్తం పెట్టుకోవచ్చు. ఇద్దరూ వాహకులైతే... బిడ్డకు తలసీమియా వచ్చే అవకాశాలు యాభైశాతం. పసిగుడ్డు కడుపులో ఉన్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణకు వీలుంది. కనీసం ఇప్పుడైనా, పుట్టబోయే బిడ్డ భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ఓ ప్రాణికి అసంపూర్ణమైన, అనారోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించే అధికారం ఎవరికీ లేదు - కన్నవారికైనా, చివరికి దేవుడికైనా!

నగలు కొనడానికి చెన్నై వెళ్తారు. పట్టుచీరల కోసం కంచికి ప్రయాణం అవుతారు. పెళ్లికార్డుల నుంచి విందు భోజనాల దాకా...ప్రతిదాని గురించీ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, తలసీమియా పరీక్ష విషయానికొచ్చేసరికి ... చాలా తేలిగ్గా తీసుకుంటారు. చాలామందికి అదేమిటో కూడా తెలియదు. కుటుంబ వైద్యులు కూడా చెప్పరు. రక్త సంబంధీకుల్లో తలసీమియా లక్షణాలు ఉన్నాయంటే మరింత జాగ్రత్తపడాలి. బంధుమిత్రుల్లో అవగాహన కల్పించబోతే సంధ్యకు చివాట్లే మిగుల్తున్నాయి. 'నా బిడ్డ తలసీమియా బారినపడ్డాక ...మా దగ్గరి బంధువులందరికీ చెబుతున్నా పెళ్లికి ముందు పరీక్షలు చేయించుకోమని. ఎవరూ నామాట వినడం లేదు. అందరి బిడ్డలూ నీ బిడ్డలా పుడతారని ఎందుకు అనుకుంటావ్‌. అయినా, శుభమా అని పెళ్లి జరుగుతుంటే అపశకునపు మాటలేమిటి - అంటూ మందలించినవారే ఎక్కువ' అని వాపోతారామె. కొందరు తల్లిదండ్రులైతే తొలిచూలు బిడ్డ తలసీమియాతో బాధపడుతున్నా కూడా, ఎలాంటి వైద్యపరమైన జాగ్రత్తలూ తీసుకోకుండా రెండో బిడ్డనూ కంటున్నారు. యాభైశాతం సందర్భాల్లో ఇద్దరు పిల్లలూ తలసీమియా బాధితులే అవుతున్నారు. పలాస ప్రాంతానికి చెందిన తిలోత్తమకు ఇద్దరు పిల్లలు. తొలిబిడ్డ తలసీమియా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. రెండోబిడ్డకూ అదే సమస్య. పసివాడికి రక్తం అందించడానికి ఆమె హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నిజానికి, మొదటి బిడ్డ అనారోగ్యం పాలైనప్పుడు...అది తలసీమియా అన్న సంగతి ఆమెకు తెలియదు. వైద్యులూ గుర్తించలేకపోయారు. అప్పటికే ఒక తలసీమియా బిడ్డ ఉన్నప్పుడు రెండో సంతానం విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వైద్యుల పర్యవేక్షణలోనే ఆ నిర్ణయం జరగాలి. లేదంటే, తెలిసితెలిసీ మరో అమాయక ప్రాణిని ఆ రాకాసి రోగానికి బలిచ్చినవాళ్లం అవుతాం.

ఇప్పటిదాకా తలసీమియా రోగులకు అందుబాటులో ఉన్న ఒకే ఒక శస్త్రచికిత్స... ఎముక మూలుగ మార్పిడి. అందుకు, పది నుంచి పదిహేను లక్షల దాకా ఖర్చవుతుంది. రక్తసంబంధీకుల్లోంచి మూలుగ దాత అవసరం అవుతారు. చికిత్స విజయావకాశాలు ఎనభైశాతం. బిడ్డను కాపాడుకోవాలన్న తపన ఉన్నా, సామాన్యులు ఇంత ఖర్చు భరించలేరు. 'ఆరోగ్యశ్రీ' జాబితాలో తలసీమియా పేరు ఉన్నా లేనట్టే. రకరకాల నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. వైద్యుల అవగాహనాలేమి మరో సమస్య. నిబంధనల్ని మార్చాలంటూ ఎన్ని విజ్ఞాపనలు అందినా పాలకులు స్పందించడం లేదు. కనీసం, తలసీమియా రోగులకు అవసరమైన ఔషధాల విషయంలో అయినా రాయితీలు ఇవ్వడంలేదు. సొంత గల్లాపెట్టెలోంచి తీసివ్వాల్సిన పన్లేదు. ప్రజల సొమ్మును, ప్రజల కోసం ఖర్చుపెట్టడానికి ఇన్ని అడ్డంకులా? ఈ నిర్లక్ష్యం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. ప్రతి మనిషికీ ఆరోగ్యంగా జీవించే హక్కుంది. దాన్ని కాలరాస్తే...నైతికనేరమే! మంత్రులైనా ముఖ్యమంత్రులైనా - పసివాళ్ల న్యాయస్థానంలో ప్రథమ ముద్దాయిలుగా నిలబడాల్సిందే.
మేమున్నాం..
మనసుంటే మార్గం ఉంటుంది. తలసీమియా చిన్నారులకు అండగా నిలబడటానికి ఎన్నో అవకాశాలు.

రక్తదాతలుగా...:
తలసీమియా పిల్లలకు రక్తమే పెద్ద సమస్య. ప్రతి పసివాడికీ ఏడాదికి పాతిక ఇరవైమంది రక్తదాతల సహకారం అవసరం. రక్తదానం వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు. పరిపూర్ణ ఆరోగ్యవంతులు నిరభ్యంతరంగా దానం చేయవచ్చు.

దత్తత తీసుకుని...:
ఒక్క తలసీమియా సొసైటీలోనే రెండువేలమంది పిల్లలున్నారు. చాలావరకూ పేదలే. రక్తం సమకూర్చలేకా, తగ్గింపు ధరలకు మందులు ఇవ్వలేకా...ఆ సంస్థ సతమతమవుతోంది. ప్రతి పసివాడిపై నెలకు ఐదు నుంచి పదివేల దాకా ఖర్చు అవుతోంది. వ్యక్తిగతంగానో బృందంగానో ఓ చిన్నారి బాధ్యత తీసుకోవచ్చు.

స్వచ్ఛంద సేవ:


హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ తదితర నగరాల్లో అనేక ప్రభుత్వ ప్రైవేటు సంస్థలున్నాయి. ఆయా సంస్థల సహకారంతో తలసీమియా రోగుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయించవచ్చు. పాఠశాలల్లో, కళాశాలల్లో, కాలనీ సంఘాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టవచ్చు.

జిల్లాల్లో...:

ఇప్పటికీ వివిధ జిల్లా కేంద్రాల్లో తలసీమియా చిన్నారులకు రక్తం ఎక్కించడానికి తగిన సౌకర్యాల్లేవు. సాధారణ పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. దీంతో అనేక దుష్పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికారులూ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తలసీమియా చిన్నారుల కోసం ప్రత్యేక బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేయవచ్చు.

చట్టపరంగా...:

తలసీమియా పిల్లల హక్కుల కోసం పోరాటం సాగించవచ్చు. మానవ హక్కుల కమిషన్‌, సమాచారహక్కు చట్టం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం...తదితర మార్గాలను ఎంచుకోవచ్చు. స్థానికంగా తలసీమియా సంఘాన్ని ఏర్పాటు చేసి...బాధితుల్ని ఒకే తాటిపై తీసుకురావచ్చు.

వ్యవస్థ కదలాలి:


రత్నావళి వంటి అమ్మలూ డాక్టర్‌ సుమన్‌జైన్‌ వంటి వైద్యులూ మరికొందరు సంఘసేవకులూ కలిసి 1998లో హైదరాబాద్‌లో తలసీమియా అండ్‌ సికిల్‌సెల్‌ సొసైటీని స్థాపించారు. ఐదారుగురితో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు... రెండువేలమంది పిల్లలకు అండగా నిలుస్తోంది. ప్రత్యేకంగా బ్లడ్‌బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. పాతబస్తీలో సంస్థ కార్యాలయం ఉంది. ''ఒక స్వచ్ఛంద సంస్థగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వపరంగా జరగాల్సింది చాలా ఉంది. ప్రజల్లో అవగాహన పెరగాలి. మరింత ప్రచారం జరగాలి. మండలస్థాయి వైద్యశాలల్లోనూ తలసీమియా పరీక్షా కేంద్రాలు ప్రారంభించాలి. ప్రతి ప్రభుత్వ ప్రకటన కిందా .. 'మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది..ఈరోజే తలసీమియా పరీక్ష చేయించండి' అన్న నినాదం జోడించాలి. దీనివల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది. తలసీమియాను ప్రభుత్వం శారీరక వైకల్యంగా గుర్తిస్తే... ఆ చిన్నారులకు అన్నివిధాలా ఆసరా దొరుకుతుంది'' అంటారు సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ సుమన్‌జైన్‌-- (తలసీమియా అండ్‌ సికిల్‌సెల్‌ సొసైటీ వెబ్‌సైట్‌: www.tscs.in ).

Deafness cause for decreased Mental Ability - వినికిడిలోపంతో మేధోక్షీణత?

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Deafness cause for decreased Mental Ability  - వినికిడిలోపంతో మేధోక్షీణత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వినికిడిలోపం వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యే కావొచ్చు. కానీ దీంతో ఆలోచన, జాపకశక్తి సామర్థ్యాలూ తగ్గే అవకాశముందా? వినికిడి మామూలుగా ఉన్నవారితో పోలిస్తే వినికిడిలోపం గలవారిలో ఆలోచన సామర్థ్యం 30-40% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అరవై ఏళ్లు పైబడినవారిలో సుమారు మూడింట ఒక వంతు మంది, డెబ్బై ఏళ్లు పైబడినవారిలో మూడింట రెండొంతుల మంది వినికిడిలోపంతో బాధపడుతున్నట్టు అంచనా. అయినప్పటికీ ఇది వృద్ధాప్యంలో వచ్చే మామూలు సమస్యగానే భావిస్తూ చాలామంది చికిత్స తీసుకోవటం లేదు. వినికిడిలోపంతో ఇతరత్రా రకరకాల సమ్యలు వచ్చే అవకాశముందని గుర్తించటం అవసరం. వినికిడిలోపం గలవారికి మతిమరుపు (డిమెన్షియా) ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ బయటపడింది. ఆలోచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాలు తగ్గుతున్నట్టు తాజాగా తేలటమూ దీనినే నొక్కి చెబుతోంది. అదృష్టవశాత్తు వినికిడిలోపం గల చాలామందికి డిమెన్షియా రావటం లేదు గానీ కొంతకాలానికి ఎంతోకొంత విషయగ్రహణ లోపం ఏర్పడుతోందని అధ్యయన కర్త డాక్టర్‌ ఫ్రాంక్‌ లిన్‌ అంటున్నారు. తాజా అధ్యయనంలో ఈ విషయం మీదనే దృష్టి కేంద్రీకరించారు. వినికిడిలోపం గలవారిలో చాలావేగంగా మేధస్సు క్షీణిస్తున్నట్టు గుర్తించారు. వినికిడిలోపం తీవ్రత పెరుగుతున్నకొద్దీ ఆలోచన, జ్ఞాపకశక్తి మరింత వేగంగా తగ్గుతున్నట్టూ తేలటం గమనార్హం. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్చని లిన్‌ చెబుతున్నారు. మన అంతర్‌ చెవిలోని కాక్లియా సంక్లిష్ట శబ్దాలను విద్యుత్‌ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే సంకేతాలు కూడా అస్తవ్యస్తమవుతాయి. అందువల్ల మెదడు వినటానికి, అర్థం చేసుకోవటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందని.. ఆ ప్రయత్నంలో ఆలోచన, జ్ఞాపకశక్తి వంటి వాటిపై దృష్టి పెట్టటం తగ్గిపోతుందనేది ఒక భావన.

వినికిడి లోపంతో బాధపడేవారు నలుగురితో అంతగా కలవలేక ఒంటరిగా ఉండిపోవటం కూడా రకరకాల అనారోగ్య సమస్యలతో పాటు మేధో క్షీణతకూ దోహదం చేస్తుండొచ్చనేది మరొక సిద్ధాంతం. మెదడులోని ఏదో ఒక ప్రక్రియ వినికిడి, మెదడు పనితీరు రెండింటినీ ప్రభావితం చేస్తుండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా వినికిడిలోపంతో ఇతరత్రా సమస్యలూ పొంచి ఉంటాయన్నది మాత్రం తథ్యం. అందువల్ల దీనికి చికిత్స తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

చాలాకాలం నుంచే..:
నిజానికి వినికిడి సమస్య తీవ్రం కావటానికి 5-15 ఏళ్ల ముందు నుంచే రకరకాల ప్రభావాలు ఆరంభమవుతాయి. సాధారణంగా మన లోపలి చెవిలో సూక్ష్మమైన కేశాలు శబ్దాలకు కంపించి, మెదడుకు సంకేతాలు పంపిస్తాయి. ఒకవేళ ఈ కేశాలు దెబ్బతింటే ఆ భాగంలో ఖాళీలు ఏర్పడతాయి. దీంతో మెదడుకు సంకేతాలు సరిగా అందవు. ఫలితంగా కొన్ని స్థాయుల్లోని శబ్దాలు సరిగా వినవబడవు. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఆయా స్థాయుల్లోని శబ్దాల స్పందనలను అర్థం చేసుకోవటాన్ని మెదడు మరచిపోతుంది. దెబ్బతిన్న కేశ కణాలు తిరిగి కోలువకోవటమంటూ జరగదు. పెద్ద శబ్దాలతో వాటిని ప్రేరేపించినప్పటికీ మెదడు వాటిని అర్థం చేసుకోలేకపోవచ్చు.

రకరకాల ఇబ్బందులు:
వినికిడిలోపం రోజువారీ పనుల్లోనూ చిక్కులు తెచ్చిపెడుతుంది. మాట్లాడటం కష్టంగా ఉండటం వల్ల ఒత్తిడి, చికాకు, నిరాశ వంటివి తలెత్తొచ్చు. ఇతరులు తమను చూసి గేలిచేస్తారనే భయం కలగొచ్చు. త్వరగా వృద్ధులమయ్యామని, వైకల్యం వచ్చిందనే భావనలో పడేయొచ్చు. నలుగురితో కలవలేక పోవటం వల్ల ఒంటరితనం.. వినటానికి ఎక్కువగా కష్టపడటం వల్ల శారీరకంగా అలసిపోవటం వంటివీ కనబడొచ్చు. వినికిడిలోపం గలవారికే కాదు వారితో సన్నిహితంగా మెలిగేవారికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వినికిడిలోపాన్ని తోసేసుకు తిరగకుండా తగు చికిత్స తీసుకోవటం మంచిది. వినికిడిలోపాన్ని గుర్తించేందుకు ఇప్పుడు అధునాతన పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. దీన్ని గుర్తించి అవసరమైతే వినికిడి యంత్రాలను వాడటం వల్ల ఇబ్బందులు దరిజేరకుండా చూసుకునే అవకాశం ఉది.

Cirrhosis of Liver primary awareness - సిర్రోసిస్ ఆఫ్ లివర్ ప్రాధమిక అవగాహన



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Cirrhosis of Liver primary awareness ,సిర్రోసిస్ ఆఫ్ లివర్ ప్రాధమిక అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

కాలేయం విధులు : 

అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఆహారం జీర్ణం కావడంతో పాటు రక్తశుద్ధిలో తోడ్పడుతుంది. శక్తిని దాచి ఉంచి శరీరానికి అవసరమైనప్పుడు అందించడం -- దీని విధుల్లో ప్రధానమైనది. కాలేయ విధులను పరిశీలిస్తే... ఇది అనేక జీవరసాయనిక కర్మాగారంలా తోస్తుంది. మనం తీసుకునే ఆహారాలను పేగులే జీర్ణం చేస్తాయి. కానీ దాన్ని యథాతథంగా శరీర కణాలు స్వీకరించలేవు , ఉపయోగించుకోలేవు . ప్రతి ఆహారము కాలేయములో కొన్నిమార్పులు జరిగి మన శరీరము ఉపయోగించుకునే విధముగా తయారవుతుంది.  అలా జీర్ణమైన ఆహారాన్ని శరీర కణాలు తీసుకోగలగడానికి అనువుగా మార్చే ప్రక్రియలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలేయ కణాలను హెపటోసైట్స్ అంటారు. ఇవి  శక్తి సమతౌల్యాన్ని క్రమబద్దీకరించడంతో పాటు... రోగకారక క్రిములతో పోట్లాడటం హానికర విష పదార్థాలను వేరుపరచడం జీర్ణప్రక్రియకు తోడ్పడే బైల్ (పైత్యరసాన్ని)ను  ఉత్పత్తి చేయడం రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే (క్లాటింగ్ ఫ్యాక్టర్స్) పదార్థాలను తయారు చేయడం పోషకపదార్థాలను, విటమిన్లను నిల్వ చేయడం ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, క్లిష్టమైన కార్బోహైడ్రేట్ల తయారీ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వినియోగం అన్య పదార్థాల విసర్జన వంటి కార్యకలాపాల్లో ప్రధానపాత్ర వహిస్తుంది. అందువల్లనే కాలేయం పనితీరు / కాలేయ వ్యాధులను గుర్తించడానికి ఒక్క పరీక్ష సరిపోదు. ఇందుకు చేసే వేర్వేరు పరీక్షల సముదాయాన్ని ‘లివర్ ప్రొఫైల్’ అంటారు. 

సిర్రోసిస్ ఆఫ్ లివర్:

నిర్వచనము---    కాలేయానికి (లివర్ కు) దీర్ఝకాలిక వ్యాధులు సోకిన తరువాత కాలేయ కణాలు పనిచేయకపోవడం - తద్వారా కాలేయంలో కలుగు పరిణామాలను సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటారు.

కారణాలు:

  •         దీర్ఝకాలిక లివర్ వ్యాధులు
  •         దీర్ఝకాలిక మధ్యం వాడకం
  •         హిపటైటిస్ - బి - ఇన్ ఫెక్షన్
  •         కొన్ని రకాల మందులు వాడకం
  •         వ్యాధి నిరోధక శక్తి లోపించుట
  •         పైత్యరస ప్రసరణలో అడ్డంకులు - వ్యాధులు


లక్షణాలు:

  •         కడుపులో నీరు చేరుట,
  •         కాళ్లు చేతులు వాపు,
  •         వాంతిలో రక్తం పడుట,
  •         పచ్చ కామెర్లు,
  •         రక్త నాళాలు ఉబ్బడం,వంకర్లు తిరిగి ఉండటం,
  •         బరువు తగ్గడం,
  •         వాంతి అవుతున్నట్లు ఉండటం,
  •         ఆలోచనలలో తికమక,
  •         అలసి పోవడం,
  •         కొన్ని సందర్బాలలో మొలలు నుండి రక్తం కారుట,
  •         సంభోగంలో ఉత్సుకత లేకపోవుడం,
  •         పురుషత్వం కోల్పోవడం,
  •         మూత్ర విసర్జన తగ్గిపోవడం,
  •         మలము తెల్లగా రావడం,
  •         చిగుళ్ళలో , ముక్కులో రక్తం కారుట,
  •         సాధారణ జ్వరం,
  •         పురుషులలో స్ధనములు పెద్దగా వుండడం,


    పైన ఇవ్వబడిన లక్షణాలు వ్యాధి తీవ్రతకు అనుగుణంగా వస్తుంటాయి.

పరీక్షలు:

  •         కడుపును చేతులతో పరీక్ష చేసినపుడు కాలేయము (లివర్) పెద్దదిగా గుర్తించడం,
  •         కడుపులో నీరు నిండి ఉండి ఉబ్బరంగా వుండడం,
  •         కడుపు పై రక్త నాళాలు స్పష్టంగా కనపడటం,
  •         వృషణాలు చిన్నవిగా వుండడం,


    లాబ్ పరీక్షలు:

  •         రక్త పరీక్ష - రక్త హీనతకొరకు, రక్తం గడ్డకట్టు కాలం కనుగొనుటకు,
  •         లివర్ ఎంజైములు పనితీరు కనుగొనుట,
  •         రక్తంలో బిలిరుబిన్ స్ధాయి కనుగొనుట,
  •         ‘x’రే పరీక్షలు,
  •         అల్ట్రాసౌండ్ స్కానింగ్
  •         ప్రత్యేకమైన సూది సహాయం తో లివర్ కణాలు తీసి పరీక్ష చేసిన వ్యాధి నిర్ధారించబడును.


నివారణ - తీసుకోవలసిన జాగ్రత్తలు:

  •  అధికంగా మద్యం సేవించరాదు,
  • రక్త నాళాల ద్వారా మందులు వాడకం తగ్గించాలి. హిపటైటిస్ బి మరియు హిపటైటిస్ సి నుండి రక్షణ పొందవచ్చు.
  • వ్యాధి నిరోధక టీకా ద్వారా హిపటైటిస్ బి వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
  • కొవ్వు-ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి
  • సమతుల పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
  • సాధారణ రుగ్మతలకు కూడా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, ఇతర మందులు వాడకూడదు.
  • రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూరే విధంగా జీవనశైలిని మార్చుకోవాలి.

లివర్ వ్యాధులతో దాని కణాలకు జరిగే నష్టం ఎలా ఉంటుంది?సిర్రోసిస్ : రోగ కారణంగా నష్టపడిన కాలేయ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. అయితే ఈ కణాలు సహజ ఆరోగ్య కాలేయ కణాలలా శక్తిమంతంగా పనిచేయవు. 
అంతేకాదు... కాలేయంలోకి వచ్చే రక్తప్రసరణకు కూడా ఆటంకం కలిగిస్తాయి. కొత్త కాలేయ కణజాలం (స్కార్ టిష్యూ) పెరిగిన కొద్దీ కాలేయం సమర్థంగా తన విధులను నిర్వహించలేదు. ఈ స్థితినే సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ లక్షణాలు : ప్రాథమిక స్థితిలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. నీరసం, నిస్త్రాణ, ఆకలి తగ్గడం, జీర్ణశక్తి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి.

సిర్రోసిస్ పెరిగినకొద్దీ : తేలికగా రక్తస్రావం కావడం లేదా ముక్కు నుంచి రక్తం కారడం కాళ్లవాపు మందులకు తీవ్రంగా ప్రతిస్పందించడం సిరలలోనికి అదిక రక్తప్రసరణ జరిగి, 
తద్వారా కాలేయంలోకి అధికంగా రక్తం ప్రవేశించడం ఈసోఫేగస్, జీర్ణాశయాలలోని సిరలు వ్యాకోచించడం సాధారణ లివర్ ద్వారా తొలగిపోవాల్సిన వ్యర్థ, హానికర పదార్థాలు 
రక్తం ద్వారా మిగతా అవయవాలకు చేరి, వాటి పనికి ఆటంకం కలిగించడం. అరుదుగా ఈ సమస్యతో రోగి అపస్మారక స్థితి (హెపాటిక్ కోమా)లోకి కూడా వెళ్లిపోవచ్చు. సిర్రోసిస్‌తో బాధపడే రోగుల్లోని ఐదు శాతం మందికి కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

సిర్రోసిస్ ప్రాణాంతకమా? : సిర్రోసిస్ తీవ్రమైన కొద్దీ అది ప్రాణాంతకమే. ప్రారంభంలోనే గుర్తించి సాధారణ స్థితికి పునరుద్ధరించుకోకపోతే ఆధునిక వైద్య శాస్త్రప్రకారం కాలేయ 
మార్పిడి శస్త్రచికిత్సే ఒక్కటే పరిష్కారం. అయితే కాలేయ మార్పిడి బాగా ఖర్చుతో కూడుకున్నది. దాత దొరకడం కూడా కష్టమే. అయితే అన్ని వేళలా ఇది సత్ఫలితాలను 
ఇస్తుందని కూడా చెప్పలేం.

నివారణ : 
సిర్రోసిస్ ని నివారించలేమా?...చాలా రకాల కాలేయ సంబంధిత వ్యాధులను చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. ప్రాథమిక స్థితిలోనే రోగ కారణం, రోగ స్థితిని గుర్తించి, అశ్రద్ధ చేయకుండా సకాలంలో చికిత్స తీసుకుంటే సిర్రోసిస్‌ను నివారించవచ్చు.

ఈ క్రింది వాటిని పాటించడము వలన సిర్రోసిస్ ని నివారింగలము  - రక్తంలోని ఎంజైముల పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలతో కాలేయంలో వచ్చిన మార్పులను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అప్పుడు... మద్యాన్ని పూర్తిగా మానేయాలి, కొవ్వు-ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి సమతుల పౌష్టికాహారాన్ని తీసుకోవాలి సాధారణ రుగ్మతలకు కూడా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, ఇతర మందులు వాడకూడదు. రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూరే విధంగా జీవనశైలిని మార్చుకోవాలి.