Friday 29 January 2016

Menopause - ముట్లు ఆగిపోవడము

imagesSymptoms_of_menopause_(raster)

మెనోపాజ్‌ సహజం-- మెనోపాజ్ సమయములో దానికి ముందు ఈస్ట్రోజన్‌తో సహా స్త్రీ సెక్ష్ హార్మోనులు స్థాయి తగ్గిపోతుంటుంది. మేల్ హార్మోన్‌ యాండ్రోజన్‌ అలాగే ఉంటుంది.

  • గర్భధారణ వయసు పదిహేనేళ్ల నుంచి నలభై తొమ్మిదేళ్లు వరకు ఉంటుంది. నలభై ఐదేళ్ల నుంచి అండాలు క్రమంగా తగ్గుతాయి. ఒక దశకొచ్చే సరికి అండాలు మాయమవుతాయి. దీంతో మెదడు నుంచి సంకేతాలు పంపినా ప్రయోజనం ఉండదు. అండాలు తగ్గి, పరిపక్వమవడానికి అవకాశం ఎప్పుడు ఉండదో అప్పుడు మెనోపాజ్‌ దశ (రుతుక్రమం నిలిచిపోవడం) వస్తుంది. ఇవన్నీ మహిళల జీవితంలో పెనవేసుకున్న మార్పులు. పుట్టినప్పటి నుంచి రుతుక్రమం మొదలయ్యే దాక ఒక దశ, రుతుక్రమం నుంచి రుతుక్రమం నిలిచేదాక ఒక దశ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మెనోపాజ్‌ దశ రావడం సహజం.


మెనోపాజ్‌ ఆడవారి జీవితాన్ని చికాకుగా తయారు చేస్తుంది. పెరుగుతున్న వయసులో వచ్చే 'మెనోపాజ్‌' ఓ గ్రీకు పదం. మెనో అంటే 'నెల' అని, పాజ్‌ అంటే 'ఆగి' పోవటమని అర్థం. అంటే నెల నెల వచ్చే ఋతుక్రమం ఆగిపోవడమన్నమాట.

45--50 సంవత్సరాల వయసు మహిళల్లో పీరియడ్స్‌ సరైన సమయంలో రావు. అండాశయం నుండి అండాలు వెలువడటం ఆగిపోతుంది. కొన్ని నెలల పాటు పీరియడ్స్‌ ఆగిపోతాయి. స్త్రీలోని సెక్స్‌ హోర్మోన్స్‌ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది.

ఇది ఆడవారి జీవితంలో అందరూ పొందే సామాన్య స్థితే. దీనివల్ల ఓవరీస్‌ నుండి వెలువడే అండోత్పత్తి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి క్రమంగా ఈస్ట్రోజెస్‌ (స్త్రీ సెక్స్‌ హోర్మోన్స్‌) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది.

స్థితి మూడు దశల్లో ఉంటుంది.


ప్రీ మెనోపాజ్‌ : ఈ స్థితిలో ఓవరీస్‌ నెమ్మదిగా పని చేస్తాయి. ఋతుక్రమం మామూలుగానే వస్తుంది. కానీ కొన్ని లక్షణాలు బయటపడతాయి.

మెనోపాజ్‌ రెండవదశ : ఈ దశలో ఋతుక్రమం తప్పుతుంది. దీని లక్షణాలు బాధాకరంగా ఉంటాయి.

మూడవ దశ (పోస్ట్‌ మెనోపాజ్‌) : ఒక్కోసారి పీరియడ్స్‌ సంవత్సరం వరకూ పూర్తిగా ఆగిపోతాయి. దీనిని పోస్ట్‌ మెనోపాజ్‌ అంటారు.

మెనోపాజ్‌ లక్షణాలు ఇలా కూడా వుండే అవకాశం వుంది.



  • రాత్రి నిద్ర పట్టకపోవటం,

  • చెమట పట్టటం,

  • ఆకస్మికంగా గుండె,

  • మెడ, ముఖం మీద ఎరుపుదనం రావటం,

  • వేడిగా అనిపించటంలాంటి ముఖ్య లక్షణాలు మెనోపాజ్‌లో కనిపిస్తాయి.

  • ఈ సమయంలో యోని ద్వారం ఎండిపోయినట్టుగా ఉంటుంది.

  • యోని చర్మం పల్చగా ఉంటుంది. ఈ కారణాల వల్ల యోని మూత్ర విసర్జన నాళంలో అంటు రోగాలు వ్యాపించే అవకాశముంటుంది.


సెక్స్‌ హోర్మోన్స్‌ తక్కువ కావటం వల్ల 'కలయిక' పట్ల ఆసక్తి తగ్గు ముఖం పడుతుంది. అయితే బాధలు తగ్గి, ఋతుక్రమం ఆగిపోయిన తరువాత ఆసక్తి మామూలు స్థితికి చేరుకుంటుంది. నెలనెలా వచ్చే పీరియడ్స్‌ సక్రమంగా రాక క్రమంగా ఆగిపోతాయి. కొంతమందిలో ఎక్కువ సమయం తీసుకుంటాయి.

ఈ లక్షణాలే కాకుండా మెనోపాజ్‌ స్థితిలో స్త్రీ మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. విసుక్కోవటం, చిరాకు పడటం జరుగుతుంది. అదే సమయంలో రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, ఆస్టియోపొరోసిస్‌, మూత్ర విసర్జనలో బాధ లాంటివి కూడా వచ్చే అవకాశం వుంది.

అలా అని సమస్య మరీ తీవ్రంగా వుంటుందని అనుకోవలసిన అవసరం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరంలో మెనోపాజ్‌ దశ ఒక వ్యాధి లక్షణం కాదు. ఇది ఒక సామాన్య స్థితి మాత్రమే.

మెనోపాజ్‌ దశకు చేరుకొన్న వారిలో రాత్రిపూట నిద్రాభంగం సహజం. కనీసం 3--4 సార్లు మెలకువ వస్తుంది. మళ్లీ నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. నిద్రలేకపోవడంతో పాటు అలసట, నీరసం కలుగుతాయి. దాంతో మరుసటి రోజు చిరాకు, కోపం, విసుగువస్తాయి.

తల తిరగడం, ఒళ్లు తూలడం, దురదలు, తిమ్మిర్లు, మంటలు కనబడతాయి. కొందరిలో తలనొప్పి విపరీతంగా ఉంటుంది. దేనిమీద శ్రద్ధ పెట్టలేకపోతారు. మతి మరుపు ఎక్కువ అవుతుంది. డిప్రెషన్‌ లక్షణాలు కలుగుతాయి.

మెనోపాజ్‌ బాధలు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు హోర్మోను రీప్లేస్‌మెంట్‌ థెరఫీ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు చేయించుకోవడం అవసరం. హిస్ట్రక్టమి ఆపరేషను చేయించుకున్న స్త్రీలకి కేవలం ఈస్ట్రోజను హోర్మోను ఇస్తే సరిపోతుంది. హిస్ట్రక్టమి ఆపరేషను అవని వాళ్లకి ఈస్ట్రోజను హోర్మోనుతోపాటు ప్రొజిస్టరోన్‌ హార్మోను కూడా ఇవ్వడం అవసరం.

మెనోపాజ్‌ వచ్చిన స్త్రీలు మానసికంగా కృంగిపోక హోర్మోను రీప్లేస్‌మెంట్‌ థెరఫీ పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చేస్తే సంసార సుఖం, మానసిక ఆనందం అలాగే నిలచి ఉంటాయి.

జీవితంలో మలిదశ.. మెనోపాజ్‌... అత్యంత కీలకం. ఇది ఆనందంగా సాగాలంటే.. శారీరకంగా చోటు చేసుకునే ప్రతి మార్పునీ గుర్తించగలగాలి.అవగాహన ఉంటేనే ఆ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండగలం. ఇంతకీ మెనోపాజ్‌ అంటే ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా కొనసాగిన రుతుక్రమం ఒక వయసొచ్చాక ఆగిపోవడం. ఈ దశకు ముందు, తరవాతా చోటు చేసుకునే రకరకాల మార్పులు స్త్రీని ఎంతో ప్రభావితం చేస్తాయి.

ఒక వయసు వచ్చాక నెలసరి ఎందుకు నిలిచిపోతుందో తెలియాలంటే.. అసలు రుతుక్రమం విధానం.. దానిని నియంత్రించే అంశాలపై అవగాహన అవసరం.

తల్లి గర్భంలో ఉన్నప్పుడే అమ్మాయిలో అండాశయాలు లేక ఓవరీల్లోని అండాలు (ఓవ ఎగ్స్‌) తయారవుతాయి. అవి ఇరవై వారాల గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు 70 లక్షల అండాల పూర్వదశ ఉండి, క్రమంగా తగ్గి పాప జన్మించేటప్పటికి 20 లక్షలు, రజస్వల సమయానికి మూడు లక్షలు మాత్రమే మిగులుతాయి. వీటిలో పునరుత్పత్తి వయసులో నాలుగైదు వందల అండాలు మాత్రమే విడుదలవుతాయి. మిగిలినవి వాటికవే అట్రీషియా అనే ప్రక్రియతో నశించిపోతాయి.

ఇలా అండాల సంఖ్య క్షీణించడంతో హార్మోన్ల విడుదల స్థాయీ తగ్గుతూ వస్తుంది. చివరకు అండాశయాల్లోని ఊసైట్స్‌ బాగా తగ్గిపోయినప్పుడు పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే గోనాడోట్రోపిన్‌ హార్మోన్లు కూడా ఇతర హార్మోన్ల, అండాల విడుదలకు ప్రేరేపించవు. ఈ మార్పులు మెనోపాజ్‌కి దాదాపు పదేళ్ల ముందే చోటు చేసుకుంటాయి. నెలసరి పూర్తిగా ఆగిపోవడమనేది చివరి మెట్టు. అందువల్లే హార్మోన్ల స్థాయి తగ్గుముఖం పట్టినప్పటి నుంచీ కొందరు స్త్రీలకు మెనోపాజ్‌ సంబంధ సమస్యలు మొదలవుతాయి.

అండాశయాలు పూర్తిగా ముడుచుకుపోయి పని చేయడం ఆగిపోయే దశలో శరీరంలో అనేక మార్పులు తప్పవు. మెదడు నుంచి చర్మం దాకా, గోళ్ల నుంచి శిరోజాల వరకు, జ్ఞాపకశక్తి మొదలుకొని లైంగిక సంపర్కం.. ఇలా స్త్రీ శరీర ధర్మాలన్నింటిపై హార్మోన్ల లేమి ప్రభావం ఉంటుంది.

చెప్పాలంటే.. ఈ దశ 45-55 ఏళ్ల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. విదేశాలలో ఈ సగటు వయసు 51 ఏళ్లయితే, మన దేశంలో 48. ఇది ఎప్పుడు ఆగిపోతుందో గుర్తించలేం కానీ.. తల్లి మెనోపాజ్‌ వయసును తెలుసుకోగలిగితే... కొంతవరకు అంచనా వేయవచ్చు.

కొందరికి అసాధారణంగా నలభయ్యేళ్ల కంటే ముందే ఆగిపోతుంది. దీన్ని 'ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌', అరవయ్యేళ్ల దాకా కొనసాగుతుంటే... 'డిలేయిడ్‌ మెనోపాజ్‌'గా పేర్కొంటాం. ఇవి రెండూ అసహజమైనవే. ఇతర సమస్యలు తెచ్చిపెట్టేవే.

సహజమైన మెనోపాజ్‌ అయితే.. వయసు వల్ల అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లు విడుదల ఆగిపోవడమే కారణం. అయితే అండాశయాలను నిర్వీర్యం చేసే ఇతర కారణాలూ మెనోపాజ్‌ సంభవించేలా చేస్తాయి.

సర్జికల్‌ మెనోపాజ్‌: ఏ కారణం వల్లనైనా అండాశయాలను తొలగించడమే సర్జికల్‌ మెనోపాజ్‌. సహజ మెనోపాజ్‌ అయితే.. హార్మోన్లు క్రమేపీ తగ్గుతాయి కాబట్టి శరీరం అలవాటు పడుతుంది. కానీ ముందురోజు వరకూ మామూలుగానే ఉన్న హార్మోన్లు మర్నాటికల్లా మాయం కావడంతో మెనోపాజ్‌ లక్షణాలన్నీ ఒక్కసారి విజృంభించి వేధిస్తాయి.

రేడియేషన్‌, కీమోథెరపీ: జనేంద్రియాల క్యాన్సర్ల చికిత్సలో భాగంగా ఇచ్చే ఈ థెరపీలు అండాశయాలపై ప్రభావం చూపి మెనోపాజ్‌కు దారితీస్తాయి.

ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ (పీఓఎఫ్‌): నలభయ్యేళ్లు నిండకుండానే మెనోపాజ్‌ రావడాన్ని పీఓఎఫ్‌ అంటారు. జన్యు సమస్యల వల్ల అండాశయాలు లోపభూయిష్టంగా ఉండటం.. లేదా శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ గాడితప్పడమే ముఖ్యకారణం.

హిస్టెరెక్టమీ లేదా గర్భాశయాన్ని తొలగించిన తరవాత మామూలుగా కన్నా నాలుగేళ్లు ముందుగానే మెనోపాజ్‌ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే పౌష్టికాహారలోపం ఉన్నవారికి ఇది రెండేళ్లు ముందుగానే వస్తుంది.

మెనోపాజ్‌ దశలో వయసు పైబడటం వల్లా మధుమేహం, కీళ్లనొప్పులు వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు కమ్ముకొని పీడిస్తాయి. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే శారీరక, మానసిక దృఢత్వం అవసరం. వృద్ధాప్యం వచ్చాక కాక ముందునుంచీ ఆరోగ్య నియమాలు పాటించడం తప్పనిసరి.

మహిళల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే దశ (మెనోపాజ్) ఎప్పటినుంచి మొదలవుతుందో ముందుగానే పసిగట్టవచ్చునని అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. మెనోపాజ్ దశను ముందుగా గుర్తించే ఓ వినూత్న పరీక్షా విధానాన్ని వీరు కనుగొన్నారు.

మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ పరిశోధన గురించి వివరాలందించారు. ఈ పరిశోధన ప్రకారం... రక్తంలోని హార్మోన్ల స్థాయిని బట్టి, ప్రత్యుత్పత్తి దశ ఇంకెంత కాలం ఉంటుందో అంచనా వేయవచ్చు. మెనోపాజ్ దశ వచ్చేందుకు ఇంకా ఎంత కాలం పడుతుందో తెలుసుకోవడం వల్ల గర్భం పొందే ఆలోచన ఉన్న నడివయసు మహిళలు ముందుగా, సంసిద్ధంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

పై పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మేరీ ఫ్రాన్ సోవర్స్ "డైలీ మెయిల్" పత్రికకు అందించిన వివరాల ప్రకారం... తమ పరిశోధనలకుగానూ సుదీర్ఘ కాలం పాటు 600 మంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులను అధ్యయనం చేసినట్లు తెలిపారు.

యాంటీ మల్లెరియన్ హార్మోన్, ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ లాంటి హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పులను పసిగట్టడం వల్ల మెనోపాజ్‌ను ముందుగానే గుర్తించవచ్చని సోవర్స్ వెల్లడించారు. ఈ రకంగా మెనోపాజ్‌ను దశను ముందుగానే గుర్తించటం, దానికి మహిళలు సంసిద్ధంగా ఉండటం వల్ల... వారు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే వీలుంటుందని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెనోపాజ్‌ దశలో స్త్రీలు పడే ఇబ్బందులు , Symptoms of Menopause :


అతి కోపం.. చిరాకు.. విపరీతమైన ఆందోళన..జ్ఞాపకశక్తి క్షీణించడం.. ఇలా చెప్పుకొంటూ పోతే.. మెనోపాజ్‌ దశలో స్త్రీలు రకరకాల భావోద్వేగాలకు లోనవుతారనే భావన ఎప్పట్నుంచో ఉంది. అలాంటి పరిస్థితులకు దారితీసే అంశాలు, తద్వారా ఎదురయ్యే ఇతర సమస్యలపైన దృష్టి సారిద్దాం.

మలిదశలో స్త్రీలకు ఎదురయ్యే మానసిక సమస్యలకు ఎన్నో కారణాలున్నాముఖ్యమైనవి .... ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోవడం వల్ల నాడీ వ్యవస్థ బలహీనపడటం. వేడి, చెమటలతో నిద్ర పట్టకపోవడం. ఆ వయసులో తరచూ ఎదురయ్యే ఒత్తిళ్లు... ప్రధానమైనవి.

నిరాశ : పురుషులతో పోలిస్తే.. మహిళల్లో నిరాశ పాళ్లు ఎక్కువని ఇప్పటికే అధ్యయనాలు వెల్లడించాయి. రుతుక్రమం మొదలైనప్పుడు, ఆగిపోయేప్పుడు.. నెలసరికి ముందు, కాన్పుల తరవాతా డిప్రెషన్‌ ఎక్కువగా ఉంటుందని తేల్చిచెప్పాయి. అయితే ఇది కచ్చితంగా మెనోపాజ్‌ వల్లే వస్తుందనడానికి కచ్చితమైన ఆధారాల్లేవు. ఈ సమయంలో బాధించే డిప్రెషన్‌కు పరిష్కారంగా యాంటీ డిప్రెసెంట్‌ మందుల్నే మొదటి చికిత్సా విధానంగా పరిగణిస్తారు.

ఒత్తిడి : అకారణంగా ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, అర్థంలేని భయాలు దీని లక్షణాలు. ఇవి ఎక్కువైతే 'ప్యానిక్‌ ఎటాక్స్‌' కనిపిస్తాయి. కొందరు స్త్రీలలో మెనోపాజ్‌ దశలో హాట్‌ ఫ్లషెస్‌ వచ్చేముందు ఇవి కనిపించవచ్చు.

జ్ఞాపకశక్తి: ఏకాగ్రత లేదని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇది మెనోపాజ్‌ లేని స్త్రీలలోనూ కనిపిస్తుంది. దీనికి మెనోపాజ్‌ కారణాలకన్నా... వయసుతో పాటూ కలిగే ఒత్తిడి, డిప్రెషన్‌, పని భారం, ఆరోగ్యం క్షీణించడం వంటివి ప్రధానంగా దోహదం చేస్తాయి.

నిద్ర: వయసు మీరినకొద్దీ నిద్ర పట్టడంలేదని, చీమ చిటుక్కుమన్నా మెలకువ వస్తోందనీ వయసు మళ్లిన స్త్రీలు చెబుతుంటారు. శారీరక శ్రమ తగ్గడం, వయసు పెరగడంతోపాటు ఒత్తిడి, హార్మోన్లు తగ్గిపోవడం కూడా దీనికి కారణాలు కావచ్చు.

సాధారణంగా మెనోపాజ్‌ సమయంలో వేధించే హాట్‌ఫ్లషెస్‌, మానసిక సమస్యలతో పాటు శరీరంలోని ఇతర వ్యవస్థలలోనూ కొన్ని మార్పులుకనిపిస్తాయి. చర్మం, జుట్టు, కండరాలు... ఇలా శరీరంలో దాదాపుగా మార్పులుంటాయి. వీటిలో చాలావరకూ వయసుతో వచ్చే మార్పులయితే కొన్ని మాత్రం ప్రత్యేకంగా ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోవడం వల్ల చోటుచేసుకుంటాయి.

చర్మం: దీనిపై ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ప్రభావం చాలానే ఉంటుంది. ఈస్ట్రోజెన్‌ రిసెప్టార్స్‌తో కలిసి చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. మెనోపాజ్‌ తరవాత ఈస్ట్రోజెన్‌ లభించనప్పుడు చర్మం పొడిబారుతుంది. కొలాజిన్‌ తగ్గిపోవడం వల్ల ముడతలు కనిపిస్తాయి. చర్మం పల్చబడి నరాలు తేలి కనిపిస్తాయి. గోళ్లూ నిగారింపు కోల్పోయి పెళుసుగా మారి.. తరచూ విరిగిపోతూ ఉంటాయి.

అవాంఛిత రోమాలు: మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ తగ్గడంతో ఆండ్రోజెన్‌ లేక పురుష హార్మోను నిష్పత్తి ఎక్కువవుతుంది. దాంతో పురుషుల నుదురులా పెద్దదైపోవడం... పై పెదవి, చుబుకంపై అవాంఛిత రోమాలు పెరిగే ఆస్కారమూ ఉంటుంది.

కీళ్లూ, కండరాలు: నడివయసులో తరచూ ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు బాధిస్తున్నాయంటారు చాలామంది. వయసు కారణంగా కీళ్లు అరిగిపోవడం సహజమే. మెనోపాజ్‌తో ఎముకల్లోని కొలాజిన్‌ తగ్గిపోవడంతో ఆ ఇబ్బందులు మరింత వేధిస్తాయి. మెనోపాజ్‌ మొదటి అయిదేళ్లలోనే ముప్ఫై శాతం కొలాజిన్‌ తగ్గిపోతుందని అంచనా.

కళ్లు: ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌కీ, కళ్లకీ దగ్గరి సంబంధం ఉంది. నెలసరి సమయంలో, గర్భిణిగా ఉన్నప్పుడు.. అంతెందుకు శరీరంలో హార్మోన్లు మార్పు చెందినప్పుడల్లా కంటి తడిలో, చూపులోనూ మార్పులు వస్తాయనేది నిజం. తడి తగ్గిపోయి కళ్ల మంటలు, ఎర్రగా మారడం, నలుసులు.. వంటివి పొడిబారిన కళ్లకు లక్షణాలు. అలాగే ఈ దశలో చత్వారం రావడం కూడా సహజమే. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ శుక్లాలు లేక క్యాటరాక్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెనోపాజ్‌ తరవాత కాటరాక్ట్‌ పెరుగుదల ఎక్కువవుతుంది.

బరువు: రుతుక్రమం నెలనెలా అవుతుంటే బరువు పెరగమనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అందుకే మెనోపాజ్‌ రాగానే బరువు పెరిగాం అనుకుంటారు. సాధారణంగా ఈ వయసులో ఎక్కువ మంది రెండు నుంచి రెండున్నర కేజీల బరువు పెరుగుతారు. బరువు పెరగడానికి ముఖ్యకారణం.. ఆహారపుటలవాట్లు, జీవనశైలి, వ్యాయామం లేకపోవడమే.మెనోపాజ్‌తో కండరాల పరిమాణం, బలం తగ్గుతాయి. పెరిగే బరువులో అధికశాతం నడుము, పిరుదుల చుట్టూనే పెరుగుతుందనేది వాస్తవం. ఆహారం విషయంలో నియమాలు, తగిన వ్యాయామం చేస్తే... మునుపటిలా అందమైన ఆకృతి కొనసాగుతుంది.

Psoriasis - సోరియాసిస్



*పొలుసులు చేపలకు అవసరం, అందం కూడా! కానీ నున్నగా, మృదువుగా ఉండాల్సిన మన చర్మం ఉన్నట్టుండి పొట్టుపొట్టుగా రాలిపోతూ.. పొలుసుల్లా మెరవటం మొదలుపెడితే..? తీవ్రమైన మానసిక వేదన మొదలవుతుంది. ఆ ఇబ్బందేమిటో అర్థం కాక.. నలుగురిలోకి రాలేక.. కంటి మీద కునుకుండదు. శారీరక సమస్య కంటే కూడా మానసిక వేదన మరింతగా అతలాకుతలం చేస్తుంది. అందుకేనేమో పొలుసుల వ్యాధి.. 'సొరియాసిస్‌' పేరు వింటూనే చాలామంది బెంబేలెత్తి పోతుంటారు. చర్మం మీద ఎలాంటి మచ్చ కనబడినా సోరియాసిస్‌ మచ్చేమోనని అనుమానిస్తుంటారు. ఇది దీర్ఘకాలం వేధించే తీవ్రమైన సమస్యే కావొచ్చు. కానీ సరైన చికిత్స తీసుకుంటూ, తగు జాగ్రత్తలు పాటిస్తే చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చు. కాబట్టి దీని గురించి అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం.
సోరియాసిస్ అనేది దీర్ఘకాలపు చర్మ వ్యాధి. అంటువ్యాధి కాదు. ఎక్కువగా వంశపారపర్య కుటుంబాలలో కలిగి ఉన్నవారికి వస్తుంది.
* ఇది స్వల్పమైన వ్యాధి దీని వల్ల చర్మం ఎర్ర బారడం,పొలుసులుగా రావడం, మచ్చలు పడటం జరుగుతుంది.
* ఈ సోరియాసిస్ లక్షణాలు కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. (క్రానిక్ డిసార్డర్) దీర్ఘకాలపు చర్మ వ్యాధి.
* ఈ వ్యాధి లక్షణాలు జీవితాంతము వస్తుంటాయి పోతుంటాయి.
* ఈ వ్యాధి స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది.
* ఇది అన్ని జాతుల వారికి సంక్రమిస్తుంది.

సోరియాసిస్ కి కారణాలేమిటి?


* ఖచ్చితమైన కారణమనేది తెలియదు. ప్రస్తుత సమాచారం మాత్రం సోరియాసిస్ కి సంబంధించి రెండు కారణాలను సూచిస్తుంది.

1. పూర్వీకుల నుండి పొందడం,
2. ఆటోఇమ్యూన్ ప్రతి స్పందన.

* వ్యక్తులలో కొన్ని జన్యు పరమైన ప్రేరేపణ వల్ల తప్పుడు సూచనలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధకు పంపబడతాయి. దీని వల్ల చర్మకణాల పెరుగుదల చక్రం ఎక్కువవుతుంది. ఈ చర్మకణాలు ఒక దానిపై ఒకటి పేరుకుపోతాయి. ఇవి త్వరగా రాలిపోవు. సోరియాసిస్ సంక్రమించిన కొందరు వ్యక్తులు కుటుంబ చరిత్ర కలిగి ఉండరు. కొన్ని జన్యువులు దీనికి సంబంధితమైనవి.

ఎర్రటి మచ్చలు, పొలుసులు రాలడం ఎందుకు జరుగుతుంది ?


* చర్మం మీది పైన పొరలోవున్న చర్మ కణాల సంఖ్య ఎక్కువ అవడం వలన చర్మం పొలుసులుగా రాలడం ఎర్ర మచ్చలు పడటం జరుగుతుంది.* సాధారణంగా చర్మ కణాలు నాలుగు వారాలలో పరిపక్వత చెంది శరీరం మీది ఉపరితలం నుండి రాలిపోతుంటాయి
* సోరియాసిస్ కలిగి ఉన్న వ్యక్తులలో ఈ ప్రక్రియ ప్రతి 3 -4 రోజుల లోపు త్వరగా జరుగుతుంది.* అత్యధికంగా చర్మకణాల ఉత్పత్తి జరగడం వలన సోరియాసిస్ లో చర్మం మీద కణాలు ఏర్పడుతాయి


  • సోరియాసిస్ ను ఎలా గుర్తిస్తారు ?




* చర్మం ఎర్ర బారడం, పొలుసులుగా రాలడం, దురద, గట్టిపడటం, పగుళ్ళు, అరిచేయి, అరికాలు మీద బొబ్బలు ఏర్పడటం మొదలగునవి సోరియాసిస్ లక్షణాలు.
* స్వల్పంగా ఉండచ్చు లేకపోతే ఆకృతి కోల్పోవడం, చేతకాని స్ధితికి రావడం లాంటి తీవ్రమైన స్ధాయికి చేరుకోవచ్చు.


  • సోరియాసిస్ లో వివిధ రకాలు ఏమిటి ?




* చర్మ కణాలు తీరు మరియు చర్మంమీది మచ్చలు ప్రకారంగా సోరియాసిస్ పలు విధాలుగా విభజించబడింది.

1. ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్ చర్మంమీద తీవ్రమైన ఎర్రదనం వాపు వస్తుంది.
2. ప్లేక్ సోరియాసిస్ ఇది సోరియాసిస్ లో అతిసాధారణమైనది.
(80% సోరియాసిస్ ఉన్న ప్రజలకు ఇదే ఉంటుంది.)* ఇది చర్మం మీద ఎర్రగా పొంగిన కనాలను కలుగజేస్తుంది. * ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులను వృద్ధి చేస్తుంది. ఇవి ఎక్కడైనా ఏర్పడినా, మోకాలు, మోచేతులు,తలమీది చర్మం పైన, మొండెము మరియు గోళ్ళమీద ఎక్కువగా ఏర్పడతాయి.

3. ఇన్వర్స్ సోరియాసిస్ ఇది చర్మం ముడతలలో నున్నగా, ఎర్రటి వ్రణాలను
లిగిస్తుంది.
4. గట్టేట్ సోరియాసిస్ ఇది నీటి బొట్లులాంటి చిన్న చర్మ వ్రణాలను కలిగిస్తుంది.
5. పుస్య్టులార్ సోరియాసిస్ ఇది తెల్లటి, చిక్కటి పదార్ధంతో నింపబడిన బొబ్బలను
కలిగిస్తుంది.
6. సోరియాటిక్ ఆర్రైటిక్ ఇది రుమటాయిడ్ ఆర్రైటిక్ లాంటి ఒక రకమైన కీళ్ళకు
సంబందించిన వ్యాధి.


  • సోరియాసిస్ ప్రేరేపించే లేక దుర్భరం చేసే కారణాలు ఏమైనా ఉన్నాయా?




సోరియాసిస్ ఉన్న వ్యక్తులలో కొన్ని కారణాలు గారను వృద్ధి చేస్తాయి. వాటిలో కొన్ని కారణాలు చర్మహాని చేసే రసాయనాలు, ఇన్ఫెక్షన్, గోకటం, రక్కుటం, ఎండకు చర్మం కములుట, మద్యము, హార్మోన్ల (అసమౌతుల్యం), పొగత్రాగడం, కొన్నిమందులు బీటాబ్లాకర్స్,నాన్ స్టీరాయిడల్ ఆంటి-ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్, ఒత్తిడి.

సోరియాసిస్‌ వ్యాధిని ప్రేరేపించే కారకాలు ,Predisposing factors in Psoriasis

చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి, పొట్టు పొట్టుగా రాల్చే సోరియాసిస్‌ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ, తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. కాబట్టి వాటి గురించి తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం.

ఒత్తిడి: ఒత్తిడితో సోరియాసిస్‌ మరింత తీవ్రం అవుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఒత్తిడిని దరిజేరకుండా చూసుకోవటం ఎంతో అవసరం. ఇందుకు గట్టిగా శ్వాస పీల్చుకొని 1 నుంచి 10 వరకు అంకెలు లెక్కబెట్టటం, సానుకూల దృక్పథంతో ఆలోచించటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటి పద్ధతులను పాటించాలి.

అలర్జీలు: సోరియాసిస్‌, అలర్జీలు రెండింటిలోనూ రోగనిరోధకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. అలర్జీని ప్రేరేపించే మాస్ట్‌కణాలు సోరియాసిస్‌ బాధితుల్లోనూ అధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వీరు దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు వంటివి పడనివాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది.

మద్యం: అతిగా మద్యం తాగితే వ్యాధి విజృంభించొచ్చు. పైగా కొన్ని సోరియాసిస్‌ మందులకు మద్యం సరిపడదు. అందువల్ల మద్యం జోలికి వెళ్లకపోవటమే మంచిది. రోజుకు 20 నిమిషాల సేపు ఎండ తగిలేలా చూసుకుంటే సోరియాసిస్‌ తీవ్రతను తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేసినా మంచి ఫలితం ఉంటుంది.

చల్లని/పొడి వాతావరణం: చర్మం పొడిగా ఉంటే పొలుసుల బాధ మరింత పెరగొచ్చు. కాబట్టి స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. లోషన్లు, సబ్బులను వాసన లేనివి వాడితే మంచిది. దీంతో సున్నితమైన చర్మం దురద పెట్టకుండా చూసుకోవచ్చు.

మందులు: మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్‌ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్‌కు చెప్పాలి.

గాయాలు: సాధ్యమైనంతవరకు చర్మానికి గాయాలు కాకుండా చూసుకోవటం మేలు. ఎందుకంటే గాయాలు అయిన చోట చర్మం మీద ఏర్పడే కంతులు సోరియాసిస్‌కు దారి తీసే ప్రమాదముంది. ఇంటిపనులు చేస్తున్నప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవటం.. షేవింగ్‌, గోళ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

పొగ తాగటం: ఈ అలవాటును ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. ఇది సోరియాసిస్‌తో నేరుగా సంబంధం కలిగి ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో రుజువైంది. పొగ మానేస్తే హఠాత్తుగా వ్యాధి విజృంభించటమూ తగ్గుతున్నట్టు తేలింది.

హార్మోన్లు: సోరియాసిస్‌ ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ 20-30 ఏళ్ల వయసులో.. అలాగే 50-60 ఏళ్ల వయసులో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. యవ్వనం ఆరంభంలో, మెనోపాజ్‌ దశలు సోరియాసిస్‌ పొడలను ప్రేరేపిస్తాయి. ఇందుకు హార్మోన్లు దోహదం చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.


  • సోరియాసిస్ ఎలా నిర్ధారించబడుతుంది ?




* వ్యక్తి యొక్క వైద్య చరిత్ర మరియు బాహ్య పరీక్ష ఆధారంతో వైద్య నిపుణులు సోరియాసిస్ నిర్ధారిస్తారు. * ఈ వ్యాధిలోని ప్రత్యేకమైన వ్రణాలను బట్టి ఆ వ్యక్తికి ఏ రకమైన సోరియాసిస్ ఉందో తెలుసుకోవచ్చు. * నీళ్ళలో ఎక్కువగా ఉండకండి. మీ షవర్ స్నానం, స్నానం సమయం తగ్గించండి. ఈత కొట్టడం తగ్గించుకోండి. * చర్మాన్ని గోకటం, రక్కుటం  మానుకోవాలి. * చర్మాన్ని రుద్దకుండా ఉండే వీలైన దుస్తులను ధరించాలి.
* ఇన్ఫెక్షన్, కానీ మరే ఇతర అస్వస్ధతకు గురియైన మీ వైద్యుణ్ణి సంప్రదించండి.


  • సమతుల ఆహారం ముఖ్యమా?




* ఏ ఆహారమైతే వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచుతుందో అదే సమతుల ఆహారం. ఎందుకంటే సోరియాసిస్ తో ఉన్నవ్యక్తులు మిగతా వారికంటే ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఆహారపుటలవాట్ల నుండి లాభం పొందుతారు. * కొన్ని రకాల ఆహార పదార్ధాలు పరిస్ధితిని దుర్బరం కానీ, చర్మ స్ధితిని మెరుగు పరుస్తాయి అని చాలా మంది అంటుంటారు.
* సోరియాసిస్ కలిగి ఉన్నవ్యక్తులు పాటించవలసిన ప్రత్యేకమైన ఆహారం ఏదీ లేదు. అయినప్పటికీ కొన్ని ఆహార పద్ధతులు సూచించబడ్డాయి.


  • సోరియాసిస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి?




సోరియాసిస్ వ్యక్తుల పైన మానసిక మరియు శారీరక ప్రభావం చూపుతుంది.
సోరియాటిక్ కీళ్ళవాపు, ఒక రకమైన కీళ్ళరోగం, ఉన్నకొద్ది మంది వ్యక్తులో వచ్చి వారికి నొప్పిని మరియు చేతకాని స్ధితిని తీసుకువస్తుంది.


  • సోరియాసిస్ అంటు వ్యాధా ?




కాదు సోరియాసిస్, అంటు వ్యాధి కాదు. ఒకరి నుండి ఇంకొకరు పట్టుకోలేరు. ఈ వ్యాధి అదుపులో ఉంచడానికి ఏది సహకరిస్తుంది ? ఈ క్రింది ప్రతిపాదనలను పాటించండి.

* చర్మానికి హాని కలిగించే దెబ్బల నుండి ,గాయాల నుండి, ఎండ తీవ్రతకు కూడ దూరంగా ఉంచండి. * మీ చర్మాన్ని ఎండ తీవ్రతకు కమిలేంతగా బయలు పర్చకండి. * మద్యాన్ని మరియు పొగ త్రాగటం మాని వేయండి. * మీ పరిస్ధితిని దుర్బరం చేసే మందులకు దూరంగా ఉండండి. * ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి


  • వ్యాధి నివారణ:




సోరియాసిస్ తీవ్రతను బట్టి వ్యాధి చికిత్స -సోరియాసిన్ వ్యాధి ఉధ్రుతమైనది,  దీర్ఘకాలికమైనది. కావున ఒక రోగికి , మరో రోగికి వ్యాధి తీవ్రతలో తేడా ఉంటుంది. జబ్బు తీవ్రతను బట్టి చికిస్త చేయవలసిన అవరముంటుంది. తగినంత శరీరకశ్రమ , విశ్రాంతి, సమతుల్య ఆహారము, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మరక్షణకు సంబంధించిన జాగ్రత్తలూ, ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా సుచి-శుబ్రత పాటించడం, పొడి చర్మానికి తేమకోసం ఆయిల్ పూయడం మంచిది.


  • చికిత్స :




ఈ కింద ఆయింట్మెంట్లు వాడితే మంచి ఫలితాలు వస్తాయి .
1. CALDOC Oint.
2, PROPYSALIC Oint.రెండుపూటలా రాయాలి .
చర్మము దురదగా ఉంటే " cetrazine 10 mg "రోజుకి ఒకటి -- అవసరమైనంతకాలము వాడాలి .

Yoga for Computer workers - కంప్యూటర్ వర్కర్స్ కి యోగ

యోగ ఎన్నో విధాలుగా ఆరోగ్య పరిరక్షణలో ఉపయోగపడుతుంది . యోగ అనేది ఒక రకమైన మనసును నిలకడచేసి నిదానము గా చేసే శరీరవ్యామాము .
స్పెసలిస్ట్ వ్రాసిన వ్యాసం చదవండి - > Yoga for Computer workers

Mental Piece with Green fields - పచ్చదనంతో మనోల్లాసం





యాంత్రిక జీవనానికి దూరంగా.. ప్రకృతితో వీలైనంత ఎక్కువ సేపు స్నేహం చేస్తే తీవ్రమైన మానసిక సమస్యల బారిన పడకుండా ఉంటామనేది తాజా అధ్యయనాల్లో తేలిన వాస్తవం. దీని వల్ల ఒత్తిడికి దూరమై.. మనోల్లాసానికి దగ్గరవడం ఖాయం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ రిచర్డ్‌ వైద్యులు. వందల మందిపై జరిపిన పరిశోధన తర్వాత ఈ వాస్తవాన్ని వెల్లడించారు. దినచర్యలో భాగంగా ఎక్కువ సమయం మొక్కల పెంపకం, లాన్‌లో నడవడానికి సమయం కేటాయించగలిగితే మనసు తేలిక పడుతుంది. కొత్త ఆలోచనలు అంకురిస్తాయి. అంతేకాదు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.. ప్రకృతిలో ఉన్న మహత్తే అది అంటారు శాస్త్రవేత్తలు. అందుకే నిపుణులు యోగా, ధ్యానానికి అనువుగా పచ్చని ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తారు. అలానే తోటపని చేయడానికి, మొక్కల పెంపకానికి వీలు కాకపోతే కనీసం పచ్చని చెట్లు ఉన్న చిత్రాలనయినా ఇంటి గదుల్లో అలంకరించుకుంటే హాయిగా ఉంటుంది.

Amniotic Fluid More and less - ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు



 

ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు... హెచ్చరికలే:


అమ్మకడుపులో తొమ్మిదినెలలు.. ఈ సమయంలో గర్భస్థ శిశువులో ఎన్నెన్నో మార్పులు. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనే తల్లులు కొన్ని సందర్భాల్లో కలవరపడుతుంటారు కూడా.

శిశువు ఎదుగుదలలో.. సౌకర్యాన్నందించడంలో కీలకం ఉమ్మనీరు. బిడ్డకు పలువిధాల మేలుచేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయికన్నా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సాధారణంగా అయితే.. గర్భం ధరించినప్పటి నుంచీ ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. రెండున్నర నెలలకు ఇది 30 ఎం.ఎల్‌.. ఆ తరవాత అంటే తొమ్మిదో నెలకు ఇది వెయ్యి ఎం.ఎల్‌వరకు చేరవచ్చు. గర్భస్థశిశువు ఇందులో కదలడమే కాదు అప్పుడప్పుడు స్వీకరించడం.. మళ్లీ మూత్రం ద్వారా వదిలేయడం కూడా బిడ్డ ఎదుగుదలలో భాగమే.

ఉమ్మనీరు చేసే మేలు..:


బిడ్డ గర్భంలో సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బిడ్డ చుట్టూ సమాన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.. వేడి తగ్గినప్పుడు ఉమ్మనీరు రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. బయటి నుంచి శిశువుకు గాయాలు కాకుండా కాపాడే బాధ్యత కూడా ఉమ్మనీరుదే.

తగ్గినా, పెరిగినా ప్రమాదమే...:


అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఎలా తలెత్తుతాయో చూద్దాం..

ఓలిగోహైడ్రామ్నియోస్‌: ఉమ్మనీరు ఉండాల్సిందానికన్నా తక్కువగా ఉండటాన్నే ఇలా పరిగణిస్తారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని మూత్రం ద్వారా విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి బాగా తగ్గిపోతుంది. అలాగే శిశువులో మూత్రం తయారు కాకపోయినా, విసర్జించిన మూత్రం ఉమ్మనీరు ఉన్న సంచిలోకి చేరకపోయినా, మూత్రనాళం ఏర్పడకపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మనీటికి కారణమైన పొరలు రాసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవ్వవచ్చు. బిడ్డకు రక్తసరఫరా సరిగా అందకపోయినా, గర్భస్థ శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలున్నా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్నిరకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు నెలలు నిండినా ప్రసవం కాకపోవడం.. (వైద్యులు చెప్పిన తేదీ దాటి రెండు వారాలు గడిచినా ప్రసవం కాకపోవడం..) వంటి కారణాల వల్ల కూడా ఉమ్మనీరు స్థాయి బాగా తగ్గిపోతుంది.

పాలీహైడ్రామ్నియోస్‌: గర్భంలో బిడ్డ చుట్టూ ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు అధికంగా ఉండటాన్ని పాలిహైడ్రామ్నియోస్‌గా పరిగణిస్తారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అసలు స్వీకరించకపోయినా.. శిశువు ఉదర సంబంధ పేగు (గ్యాస్ట్రోఇంటస్త్టెనల్‌ ట్రాక్‌) మూసుకుపోవడం వల్లకూడా ఇలా జరుగుతుంది. సహజ ప్రక్రియలో శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలేదంటే.. అందుకు ఉదరం, మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటు.. మరికొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు శిశువులు ఉండటం, తల్లికి జెస్టేషినల్‌ డయాబిటీస్‌.. వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో కారణాలు విశ్లేషణకు అందకపోవచ్చు.

ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు, సమస్యలు: నెలలు నిండకుండానే నొప్పులు రావొచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ (ప్లాసెంటా) వేరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా అసాధారణ(మాల్‌ప్రెజెంటేషన్‌) స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధిక రక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా సిజేరియన్‌ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ.

ఇలా తెలుసుకోవచ్చు...:


ఉమ్మనీరు పెరుగుతోందా.. తగ్గుతోందా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చక్కటి పరిష్కారం. అలాగే బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డాప్లర్‌ ఫ్లో స్టడీలతో బిడ్డకు రక్తసరఫరా తీరుతెన్నులు పరీక్షించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. కాస్త అవగాహన, ముందుచూపుతో వ్యవహరిస్తే పండంటి పాపాయిని ఆహ్వానించవచ్చు.

VDRL Test - about - వీడీఅర్ఎల్ పరీక్ష అంటే ఏమిటి?





సిఫిలిస్ వ్యాధి నిర్థారణ కోసం విడీఆర్ఎల్ పరీక్ష చేస్తుంటారు. ఈ పరీక్షలో నూటికి నూరు శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయని మాత్రం చెప్పడం కష్టమే. సిఫిలిస్ వ్యాధి లేకపోయినా కొన్ని సందర్భాలలో వ్యాధి ఉన్నట్లు విడీఅర్ఎల్ పరీక్షలో తేలుతుంటుంది. న్యుమోనియా, మలేరియా వంటి వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని రకాల టీకాలు వేయించుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిద్ర మాత్రలు వాడే వారిలో లెప్రసీ ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన ఫలితం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విడిఆర్ఎల్ పరీక్ష మీద ఆధారపడడం తగదు. అయితే సిఫిలిస్ తో బాధపడుతున్న తల్లి నుంచి శిశువు గర్భస్థ శిశువుకు సోకడానికీ అవకాశముంది. అందుకని అనుమానం ఉంటే విడిఆర్ఎల్ పరీక్ష చేయించుకోవడమే ఉత్తమం. ఎందుకంటే శిశువుకు సిఫిలిస్ సోకితే అనేక అనారోగ్య లక్షణాలతో బాధపడుతుంటుంది.
గర్భస్థ శిశువుకు వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. బిడ్డ జన్మించిన తర్వాత కొద్దికాలానికే చనిపోవచ్చు. శిశువు సిఫిలిస్ తో బాధపడుతున్నప్పటికీ ఆ లక్షణాలు పుట్టిన వెంటనే కొందరిలో కనపడవు. క్రమంగా కొద్దికాలానికి సిఫిలిస్ లక్షణాలు బయతపడతాయి.
శిశువు జన్మించిన కొద్దివారాలకి ఈ లక్షణాలు బయటపడవచ్చు. లింఫ్ గ్రంథులు వాయడం, పాలు త్రాగాకపోవడం, నీరసంగా ఉండడం, ఎర్రటి దద్దుర్లు కనపడడం, జననేంద్రియాల వద్ద పుండ్లు రావడం వంటివి జరగవచ్చు. ఇంకా అనేక లక్షణాలు కనపడతాయి. ఇటువంటప్పుడు వైద్యులను సంప్రదించి, సిఫిలిస్ అని అనుమానం ఉంటే ఆ విషయమూ చెప్పడం మంచిది. సిఫిలిస్ లక్షణాలు మొదటిసారి శిశువులో కనిపించినప్పుడే జాగ్రత్త పడాలి. కొంతమందికి మొదటిసారి ఎటువంటి మందులు వాడకపోయినా తగ్గిపోతుంది. అది పూర్తిగా తగ్గిపోవాడం మాత్రం కాదు. కొద్దికాలానికి వ్యాధి రెండవ దశలోకి అడుగుపెట్టి మరల వ్యాధి లక్షణాలు కనబడతాయి.
తల్లి నుంచి సిఫిలిస్ వ్యాధికారాక క్రిములు సంక్రమించిన శిశువులో అరుదుగా కొందరికి చాలాకాలం వరకు అసలు సిఫిలిస్ లక్షణాలనేవే కనిపించకపోవచ్చు. ఇదేమీ వ్యాధి లేదనడానికి చిహ్నం కాదు. వయసు పెరుగుతున్నప్పుడు ఎప్పుడో మెల్లగా ఆ లక్షణాలు బయటపడతాయి. ఇలాంటి పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే ముందే చికిత్స చేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమం.

Wednesday 27 January 2016

Snake Bite , పాము కాటు





సాదారణం గా పాములు సంతానోత్పత్తి కోసం వేసవి కాలం లో జత కడతాయి . తరువాత వర్షాకాలం లో గుడ్లలను పొదుగుతాయి . ఆయాసమయాల్లో అవి చాలా చిరాకుగా ఉండి తీవ్రం గా స్పందిస్తాయి . ఈ కారణం గానే వేసవి , వర్షాకాలం లో పశువులతో పాటు మనుషులు అధికంగా పాముకాటుకు గురిఅవుతారు .

ప్రపంచం మొత్తం లో 240 జాతులకు చెందిన పాములుండగా .. వీటిలో కేవలం 10 జాతులకు చెందిన 52 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి . పాములన్నిటిలో అత్యంత విషపూరితమైనది " కింగ్ కోబ్రా " దీని కాటుకు ఏనిగు సైతం నిముషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతుంది .

పాములకు చెవులుండవు , భూమిపై ఏర్పడే ప్రకంపనల ద్వారా శబ్దాలను గర్హిస్తాయి . కనుకనే వేడిరక్తం ప్రవహించే మనుషులు , ఇతర జంతువుల ఉనికిని సులువుగా గుర్తిస్తాయి . సాధారణం గా చల్లని ప్రదేశాల్లో ఉండేందుకు పాములు ఇస్టపడతాయి . పంటపొలాలు , కాలువలు , చెట్లు ,పొదలు , గడ్డివాములు , పాడుబడిన భవనాలు , రాళ్ళుగుట్టలు , కట్టెలు పేర్చిఉన్న పరదేశాలు , లలొ స్థిరనివాసము ఏర్పచుకుంటాయి .

Nocternal Enuresis - పిల్లల్లో పక్క తడిపే అలవాటు



పిల్లలో చాలా మందికి పగటిపూట మూత్ర విసర్జన మీద నియంత్రణ రెండు మూడు సంవత్సరాల మధ్య వచ్చే స్తుంది. రాత్రి సమయాల్లో మూత్రాన్ని అదుపు చేసుకోగలిగే శక్తి రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య వస్తుంది.

అయిదో సంవత్సరం వచ్చే సరికల్లా 85 శాతం మందికి, పదవ సంవత్సరం వచ్చేసరికల్లా 95 శాతం మందికీ మూత్ర కోశం మీద నియంత్రణ - ముఖ్యంగా రాత్రి సమయాల్లో - వస్తుంది. దీనికి భిన్నంగా పాపాయి పక్క తడుపుతుంటే, ప్రధానంగా నరాల జబ్బులు, మూత్ర వ్యవస్థకు సంబంధిం చిన సమస్యలేవీ లేకపోయినప్పటికీ పక్కలో మూత్రం పోస్తున్నట్లయితే ఆ స్థితిని శయ్యామూత్రం లేదా నాక్టర్నల్‌ ఎన్యూరిసిస్‌ అంటారు.

కొంతమంది పిల్లలు పక్క తడపటం కొన్ని నెలలపాటు మానేసి తిరిగి మొదలు పెడుతుంటారు. అటువంటి స్థితిని సెకండరీ ఎన్యూరిసిస్‌ అంటారు. సాధారణంగా ఇలాంటి దానికి ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఉండే అవకాశం ఉంది.

శయ్యామూత్రం కొన్ని కుటుంబాలలో ఆనువంశికంగా నడుస్తుంటుంది. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నప్పుడు నిద్రలో పక్క తడిపిన అలవాటు ఉంటే అదే లక్షణం పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.

పిల్లల్లో కనిపించే ఈ పక్క తడిపే అలవాటు ప్రాథమి కమా? ద్వితీయకమా? ఉపేక్షించదగినదా? కాదా? అనేది సమగ్రంగా విశ్లేషించడం అవసరం. దానికి ఈ కింది అంశాలు దోహదపడుతాయి.

ప్రతిరోజూ రాత్రిపూట పక్క తడుపు తూనే ఉన్నారా?


మూత్ర విసర్జన మీద నియంత్రణ నరాల వ్యవస్థ అభివృద్ధి చెందే విధానం లేదా వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతవరకూ అనువంశికత మీద కూడా ఆధారపడి ఉంటుంది.వయస్సు అయిదు సంవత్సరాలు దాటడం, రాత్రిపూట రోజూ పక్క తడుపుతుండటం, ఇతరత్రా ఆరోగ్యంగానే ఉండటం, శారీరక సమస్యలేవీ లేకపోవడం - ఇవన్నీ ఉన్నట్లయితే సమస్య ప్రాథమికమని (ప్రైమరీ ఎన్యూరిసిస్‌) అర్థం. ఈ సమస్య ఎదురైనప్పుడు తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.
పక్క తడిపారనే కారణంగా పిల్లలను కొట్టకూడదు. తిట్ట కూడదు. పక్క తడిపే సమయంలో పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు కనుక వారిని అదిలించినా ప్రయోజనం ఉండదు.
పిల్లలు తమ సమస్య గురించి తామే ఆందోళన చెందు తుంటారు కనుక వారికి వారి అలవాటునుంచి బైటపడేందుకు అవకాశాన్ని, సహకారాన్ని ఇవ్వాలి. సమస్యను అర్థం చేసుకుని వారికి ధైర్యాన్నీ, నమ్మకాన్నీ కలిగించాలి.
పక్క తడపని రోజును గుర్తించి మెచ్చుకోవాలి. వీలైతే స్టార్‌ను ప్రదానం చేయాలి. ఇలా మూడు స్టార్‌లు వచ్చిన తరువాత ప్రోత్సాహపూర్వకమైన బహుమతినివ్వాలి. ఈ పద్ధతిని పిల్లలు ఇష్టపడతారు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను మంచినీళ్లు తాగ కుండా కట్టడి చేస్తుంటారు. దీనిని పిల్లలు ఒక శిక్షగా భావించి మరింత ఒత్తిడికి గురవుతారు. లేదా దప్పికకు, అలవాటుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించలేని విధంగా తయా రవుతారు.

పాపాయి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుందా?


ఇంతకు ముందు పక్క తడపకుండా ప్రస్తుతం పక్క తడు పుతూ, ఇతర సమయాల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మూత్ర విసర్జనకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ గురించి ఆలోచించాలి.
ఇలా మగపిల్లలలో కంటే ఆడపిల్లలలో ఎక్కువగా జరుగు తుంటుంది. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు మూత్రనాళం (యురెత్రా) తక్కువ పొడవు ఉండటమూ, తదనుగుణంగా ఇన్‌ఫెక్షన్లు వేగంగా లోపలకు వ్యాపించడమూ దీనికి కారణం.
ఇతర లక్షణాల విషయానికి వస్తే మూత్రం పోసుకునేట ప్పుడు మంట, నొప్పి వంటివి ఉంటాయి. ఐతే మొట్టమొద టగా కనిపించే లక్షణం మాత్రం శయ్యామూత్రమే. కొన్ని సార్లు తీవ్రమైన జ్వరం, నడుము నొప్పి వంటివి సైతం కని పించే అవకాశం ఉంది. ఈ కారణం చేతనే ఐదు సంవత్స రాల వయస్సు దాటిన పిల్లలలో శయ్యామూత్రం ఉన్నప్పుడు మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల గురించి పరీక్షించాలి.

మలబద్ధకం ఉందా?


మలబద్ధకం ఉండే పిల్లలలో పెద్దప్రేవు చివరనుండే పురీష నాళం (రెక్టం) పూర్తిగా మలంతో నిండిపోయి దాని ముందు భాగంలో ఉండే మూత్రకోశం మీద ఒత్తిడిని కలిగిస్తుంది. దీనితో మూత్రకోశం వాల్వ్‌ వదులై శయ్యామూత్రమ వుతుంది.

ఎప్పుడూ ఆందోళనగా కనిపిస్తారా?


పిల్లలకు ఏ మాత్రం భయం, ఆందోళనలు కలిగినా వెంటనే పక్క తడిపేస్తారు. మానసిక వత్తిడి, భయాల వలన మూత్రకోశపు కండరాలతో సహా శరీరంలోని కండరాలన్నీ అసంకల్పితంగా బిగుసుకుంటాయి. దీనితో పక్కలో మూత్రం పోస్తారు. రాత్రిపూట భయం కలిగించే కథలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలనుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.

ఎప్పుడూ దాహంగా ఉంటుందా? అకారణంగా బరువు తగ్గుతున్నారా?


కొంతమంది పిల్లలలో మధుమేహం (జువనైల్‌ డయాబె టిస్‌) శయ్యామూత్రంతోమొదలవుతుంది. ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపం వలన శారీరక కణజాలాలు రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా గ్రహించలేవు. ఫలితంగా రక్తంలోని చక్కెర రక్తంలోనే పెరిగిపోతుంటుంది.ఇలా పెరగడం ప్రమాదకరం కాబట్టి మూత్రపిండాలు మూత్రాన్ని పెద్ద మొత్తాల్లో తయారు చేస్తూ చక్కెరను విసర్జించే ప్రయత్నం చేస్తాయి. ఈ నేపథ్యంలో మూత్రకోశపు పరిమాణానికి మించి మూత్రం తయారవుతుంది కాబట్టి నిద్రలో అసంకల్పితంగా విడుదలవుతుంది. శరీరంనుంచి బైటకు వెళ్లిపోయిన నీరు తిరిగి భర్తీ కావాలి కనుక అధికంగా దప్పిక అవుతుంది. ఈ స్థితులన్నీ ఒకదానిని అనుసరించి మరొకటిజరుగుతుంటాయి. సరైన వ్యాయామం, సక్రమమైన ఆహారం, సమర్థవంతమైన ఔషధాలతో ఈ స్థితికి చికిత్స చేయాలి.

చికిత్స :



  1. మానషికం గా పిల్లలను తయారు చేయాలి . మంచిగా నచ్చజెప్పి వారి దృక్పదం లో మార్పు తేవాలి .

  2. రాత్రి భోజనకు తొందరగా అంటే 7-8 గంటలకే పెట్టాలి .

  3. రాత్రి పడికునే ముందు నీరుడు పోయించి నిద్రకు వెళ్ళమనాలి .

  4. మంచి పోషకాహారము ఇవ్వాలి .


మందులు :


Tab . Tryptomer (emitryptalin Hel) వయసును బట్టి 10 - 20 మి.గ్రా .రోజూ రాత్రి ఇవ్వాలి .
Anti spasmadics eg. diclomine Hel ( colimex ) తగు మోతాదులో ఇవ్వవచ్చును .
ఆయుర్వేదిక్ -- tab . Neo వయసును బట్టి రోజుకి 2- 3 మాత్రలు 3- 4 మాసాలు ఇస్తే మంచి ఫలితం ఉండును .

యూరినరీ ఇంఫెక్షన్‌ ఉన్నట్లయితే డాకటర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి .

update : 

Nocturnal enuresis (bedwetting),ఇంకా పక్కతడుపుతున్నారా?------

చిన్నపిల్లలలో చాలామంది 3-4 సంవత్సరాలు వయస్సుకు చేరుకునే సరి రాత్రిళ్లు పక్క తడపడం మానేస్తారు. తర్వాత అడపాదడపా ఎప్పుడో గాని తడపరు.

కొంతమంది మాత్రం తర్వాతా పక్క తడుపుతుండొచ్చు. దీనికి ప్రధాన కారణం మూత్రాశయం మూత్రంతో నిండిపోయినా దానినుండి వెలువడిన సంకేతాలు మెదడుకు చేరకపోవటమే. మూత్ర విసర్జనలో కేంద్రీయ నాడీమండలం, స్వయంచాలక నాడీమండలాల నియంత్రణ లోపమే దీనికి మూలం. దీని మూలంగానే పక్క తడపడంలో పిల్లల్లో వ్యత్యాసం కనపడుతుంది.

ఇన్పెక్షన్‌ కావచ్చు, చక్కెర వ్యాధి కావచ్చు, మూత్ర వ్యవస్థలో లోపాలు కావచ్చు... ఇలా కొన్ని వ్యాధుల మూలంగా కూడా పక్కతడిపే అవకాశముంది. కాబట్టి 4-5 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడా పక్కతడుపుతున్నా లేక కొంతకాలంపాటు పక్క తడపడం మాని, తర్వాత తిరిగి పక్క తడపడం మొదలుపెట్టినా వైద్యుని సంప్రదించడం సముచితం.

నిశితంగా పరిశీలించినట్లయితే 3 సంవత్సరాల వయస్సు పిల్లల్లో నూటికి 50 మంది, 4 సంవత్సరాలు వయస్సున్న పిల్లలలో నూటికి 25 మంది, 5 సంవత్సరాలు వయస్సులో గూడా నూటికి ఐదుగురు పక్క తడుపుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఆ వయస్సులో పిల్లలు పక్కతడుపుతుంటే తల్లిదండ్రులు చికాకుపడతారు. పిల్లల్లో కూడా ఆత్మన్యూనతా భావం చోటుచేసుకొంటుంది.

రాత్రిళ్ళు పక్కతడిపే పిల్లల్లో నూటికి పది మంది పగటి పూట కూడా నియంత్రణ లేకుండా మూత్ర విసర్జన చేయడం కద్దు. రాత్రిళ్ళు పక్క తడపకుండా పగలు మాత్రమే కంట్రోలు లేకుండా మూత్రవిసర్జన చేస్తుంటే మూత్రావయవాలలో గాని, నాడీమండలంలోగాని లోపాలున్నట్లు భావించనవసరం లేదు.

కంట్రోలు లేకుండా మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని వ్యాధుల పరంగా విశ్లేషించాల్సివుంటుంది. ఈ సమస్యను 'ఇన్యూరిసిస్‌' అని నిర్థారిస్తారు. మూత్రావయవాల ఇన్ఫెక్షన్‌, నాడీమండల వ్యాధులు, మూర్ఛలు, మానసిక ఎదుగుదల లోపాలు, వెన్నునాడుల లోపాల వంటివీ ఈ సమస్యకు కారణం కావచ్చు.

5 సంవత్సరాల వయస్సు తర్వాత పక్కతడుపుతుంటే మాత్రం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో వారసత్వం, వ్యాధి పరమైన కారణాలూ గుర్తుంచుకోవాల్సిందే.

ఈ పక్క తడిపే సమస్యను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు మూడు. అవి- గాఢ నిద్ర, కలలు, పక్కతడుపుతున్న సమయం. కొంతమంది మొద్దు నిద్రలో మూత్ర విసర్జన చేసేస్తారు. కొంతమంది మూత్రవిసర్జన చేస్తున్నట్లుగా కలలుగంటూ మూత్రవిసర్జన చేస్తారు. కొందరు సమయాన్నిబట్టి, అంటే నిద్రపోవటం మొదలుపెట్టగానే మూత్ర విసర్జన చేయడం, లేదా మరి కొంతమంది వేకువజామున మూత్ర విసర్జనచేయటం కూడా జరుగుతుంటుంది.

Sun Stroke - వడ దెబ్బ



హీట్ స్ట్రొక్ అనగా, శరీరము అధిక ఉష్ణోగ్రత కి గురి అయినప్పుడు, ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరము లో శారీరక పరమైన, నాడీ వ్యవస్త పరమైన వ్యాధి లక్షనాలు కనపడటం..
సాధారణం గా మన శరీరం లో జరుగు రసాయన చర్యల వలన (మెటబాలిజం) హీట్ జెనెరెట్ అవుతుంది.. అలా వుత్పత్తి అయిన “వేడి” మన శరీరం లో ని ఉష్ణ సమతుల్యత ని కాపాడె అవయవాలు అయిన చర్మము ద్వారా చెమట(స్వెట్) వలన గాని బయటకు పంపబడుతుంది..కాని మన శరీరము అధిక ఉష్ణొగ్రత ల కి కాని, డీహైడ్రేషన్ కి కాని గురి ఐనప్పుదు, పైన చెప్పబడిన రక్షణ మార్గాలు(చర్మము , ఊపిరి తిత్తులు) సరిగా పని చెయవు..అందువలన మన శరీరపు ఉష్ణోగ్రత ఒక్కసారి గా 43″ డిగ్రీ సెంటి కి చేరుకుంటుంది.. ఇదే హీట్ స్ట్రోక్ .

సాధారణం గా హీట్ స్ట్రోక్ కి గురి అయ్యె అవకాశం యెక్కువ గా వుండే వాళ్ళు- చిన్న పిల్లలు (2 సం”ల లోపు), బాగా పెద్ద వాళ్ళు, క్రీడాకారులు, ఎక్కువగా ఒపెన్ స్తలాల లో పని చేస్తు ప్రత్యక్షం గా సూర్యరస్మి కి గురి అయ్యె వారు..

వ్యాది లక్షణాలు-:


1. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం,
2. వాంతులు అవ్వడము,
3. నీరసం,
4. దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవడము,
5. కనఫ్యూజన్, చిరాకు, స్థలము-సమయం తెలియక పోవడం,
6. బ్రమల తో కూడుకున్న అలోచనలు కలగడము,
7. చివరి గా స్పృహ కోల్పోవడము. (తెలివి తప్పిపోవడం)…

చికిథ్స-:


వడ దెబ్బ అనేది ఒక మెడికల్ ఎమెర్జెన్సి..అత్యవసరం గా చికిథ్స చేయవలసి వుంటుంది, లేకపోతె ఒక్కొసారి ప్రాణాల కే ప్రమదాం..కాని కొద్ది పాటి జాగ్రత్త లతో కూడుకున్న ప్రధమ -చికిత్సకే చాలా త్వరగా కోలుకుంటారు..
1. మొదటిగా పేషంట్ని చల్లపరచాలి.. బట్టలు తీసి, చల్లని నీటి ఆవిరిని కాని, నీరు కాని మొత్తం శరీరం అంతా సమం గా అప్లై చేయాలి..చల్లని నీరు ఆవిరి రూపం లో ఐతె శరీరం అంతా సమం గా వుంటుంది..
2. చల్లని ఐస్ వాటర్ లో తడిపిన వస్తరాలు కప్పాలి..
3. భుజాలు కింద (ఆక్జిల్ల), గజ్జల్లో ను చల్లని ఐస్ ముక్కలు వుంచాలి..
4. యివి చేస్తూ 108 సర్వీస్ కి కాని, దగ్గర లో వున్న హాస్పిటల్ కి కాని తీసుకు వెల్లాలి..
5. అక్కడ యేమన్న కాంప్లికేషన్స్ వుంటె వారు తగురీతి లో స్పందిస్తారు అవసరాన్ని బట్టి ..


నివారణ మార్గాలు-:



వడ దెబ్బకి గురి కాకుండా తగు నివారణోపయాలు తీసుకుంటె చాలా మంచిది.. అవి ఏమిటి అంటే...
1. తరచుగా చల్లని నీరు త్రాగడం,
2. బయట పని చేసే వళ్ళు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం…
3. సాధ్యమైన వరకు మిట్ట మద్యాహ్నం ఎండలో తిరగ కూడదు .
4. వేసవిలో తెల్లని వదులైన కాటన్క్ష్ దుస్తులు ధరించాలి .
5. మధ్యం సేవించకూడదు .
6. గదుల ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలి .

spots on the Face - ముఖము పై మచ్చలు




ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుంటే... అందంగాను చూసేందుకు బాగుంటుంది. కాని ఏవైనా మచ్చలు ఏర్పడుతుంటే నలుగురిలో తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖముపై మచ్చలు లేనివారంటూ ఉండరు. చంద్రబింబానికైనా మచ్చలు తప్పలేదు. మన ముఖచర్మ రంగుకి భిన్నముగా ఉన్న ఏవిదమైన రంగు అయినా మచ్చగానే కనిపింస్తుంది.

ముఖము మీద తెల్లని మచ్చలకు ఖచ్చితమైన కారణము తెలియదు కాని సున్నిత చర్మము గలవారికి ఇది సహజము .

  • విటమిన్క్ష్ ' ఎ ' లోపమువల్ల ,

  • సూర్యుని కిరణాలు లోని అతినీలలోహిత కిరణాల ఎలర్జీ వలన ,

  • బొల్లి అనే చర్మవ్యాధి వలన ,

  • పిటిరియాసిస్ అల్బా అనే ప్రక్రియ వల్లా ................................... తెల్లని మచ్చలు కలుగవచ్చును.


రకాలు:


మచ్చలు పలురకాలు - నల్లమచ్చలు, తెల్లమచ్చలు, గోధుమరంగులో వున్నసోభి మచ్చలు ముఖ్యమైనవి. పుట్టుకతో వచ్చిన కొన్ని రంగు మచ్చలను పుట్టుమచ్చలు అంటాము - ఇవి చాలా తక్కువగా ముఖముపై ఉంటాయి.

కారణాలు:


* 1. వయసు కురుపులు (మొటిమలు)
* 2. మశూచి ( smallpox & chickenpox)
* 3. నల్లసోభి (melanin pigmentation)
* 4. బొల్లి మచ్చలు (Vitiligo)
* 5. కాలిన మచ్చలు (Burn scars)
* 6. గంట్లు (cuts
* 7. గాయాలు (wounds) మొదలగునవి( etc.)
* 8. కాన్సర్ (Cancer)

ముఖముపై మచ్చలున్నంత మాత్రాన శరీర-ఆరోగ్యానికి నష్టము లేకపోయినా అందముగా లేమేమోనన్న మానషిక బాధ ఉంటుంది. వైద్య నిర్వచనములో ఇది కూడా ఒక రుగ్మత కిందే లెక్క. -- తీసికోవలసిన జాగ్రత్తలు, ట్రీట్మెంటు కారణాన్ని బట్టి ఉంటుంది. ఆయా కారణాలు చూడండి.

చికిత్స :



  • పడ్కునే సమయం లో తెల్ల మచ్చలపై ' హైడ్రో కార్టిసన్ ' 1% ఉండే క్రీము రాయండి ,

  • పగటి వేళ " ఎం.పి.ఎఫ్-30 " సన్ స్క్రీన్ ప్రతి మూదు గంటలకు ఒకసారి రాయండి .

  • విటమిం ' ఎ ' ఎక్కువ ఉన్న ఆకుకూరలు , క్యారెట్ , పాలు , గ్రుడ్లు , ఆహారముతో తీసుకోవాలి .

Filaria - ఫైలేరియా



ఫైలేరియాసిస్- హెల్మెంత్ వర్గానికి చెందిన సన్నని పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ వ్యాధి మానవుని మరణానికి దారితీయకపోయినప్పటికీ, దీని వలన కలిగే దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను సరిగా అంచనా వేయడం, ప్రాథమిక దశలో గుర్తించడం కష్ట సాధ్యం. ఈ వ్యాధి నుండి పూర్తి విముక్తికి మార్గం లేదు. రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఈ వ్యాధి సోకిన వారి వ్యాధినిరోధక శక్తి లోపించి యితర వ్యాధులకు గురి కావడానికి అవకాశం ఎక్కువ అవుతాయి. వాపుల వలన సాధారణమైన పనులు చేసుకోలేకపోవడం, అంగవైకల్యం, శారీరక, మానసిక వ్యధ యీ వ్యాధి వలన కలిగే దుష్పరిణామాలు.

బోదకాలు : కాళ్ళు చేతులలోని శోషరస నాళాల్లో శోషరస గ్రంథుల్లో చేరిన క్రిములు పెద్ద సంఖ్యలో పెరిగిపోతాయి దీనితో ఆ భాగాలు ఉబ్బి పరిమాణం కూడా పెరుగుతుంది. దీనినే బోదవ్యాధి-ఫైలేరియా లేక ఏనుగుకాలు (ఎలిఫెంటియాసిస్‌) వ్యాధి అని అంటారు.

కాలానుగుణంగా దోమల వలన వచ్చే సీజనల్‌ వ్యాధులు : మెదడు వాపు వ్యాధి -(జపనీస్‌ ఎన్‌సెఫలైటీస్‌), బోదకాలు వ్యాధి -(ఏనుగుకాలు), డెంగ్యూ జ్వరం , ''మలేరియా జ్వరం'', చికున్‌ గున్యా జ్వరం ... మున్నగునవి .


  • బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌):




ఫైలేరియా లేక బోదకాలు వ్యాప్తి : ముఖ్యంగా బోద వ్యాధి ''ఉచిరీరియా బాంక్రాప్టై'' అను సన్నని దారం లాంటి పరాన్నజీవి (క్రిమి) వలన కలుగుతుంది. ఈ క్రిమి ''క్యూలెక్స్‌'' దోమకాటు ద్వారా మన శరీరంలో ప్రవేశించి లింఫ్‌ నాళాలను పాడుచేస్తుంది. నిజానికి మన శరీరంలో లింఫ్‌ నాళాలు కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒక రకంగా ఇవి సమర్థంగా పనిచేసే డ్రైనేజి గొట్టాలాంటివి. రక్తనాళాల్లాగానే ఈ లింఫ్‌ నాళాలు కూడా ఒళ్లంతా ఉంటాయి. రక్త నాళాల నుండి లీక్‌ అవుతుండే స్రావాలను, కణవ్యర్థాలను తిరిగి గుండె దగ్గరికి తీసుకువెళ్తుంటాయి. ఫైలేరియా క్రిములు ప్రధానంగా ఈ లింఫ్‌ నాళాల్లోచేరి వీటిని పాడుచేస్తాయి, కాబట్టి సరైన డ్రైనేజి వ్యవస్థ లేక కణాల మధ్య లింఫ్‌ స్రావాలు ఎక్కడివక్కడే ఉండిపోయి ముందుగా కాలు ఉబ్బడం ఆరంభమవుతుంది. ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. చిన్నతనంలో సోకిన ఈ వ్యాధి పెద్దయ్యాక రోగ లక్షణాలు బయటపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సుమారు 12 కోట్ల మంది ప్రజలు లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌కు గురౌతున్నారు. ప్రపంచంలో 80 దేశాల్లోకెల్లా భారతదేశంలోనే అత్యధికంగా కేసులు ఉన్నాయి. భారత్‌లో 28 రాష్ట్రాల్లో ఫైలేరియా కేసులు నమోదౌతున్నాయి. మన ఇంట్లో గాని, వీధిలో గాని, ఊరులో గాని ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉంటే చుట్టుపక్కల వారికి వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బోద వ్యాధి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఫైలేరియా వ్యాధి లక్షణాలు : 1. శరీరంలో ఫైలేరియా క్రిములు ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనబడడానికి 8 నుండి 16 నెలలు పట్టవచ్చు. 2. తొలిదశలో కొద్దిపాటి జ్వరం, ఆయాసం రావడం, తలనొప్పి వణుకు, 3. శోషనాళాలు పాడైపోయి, లింఫ్‌ ప్రసరణ ఆగిపోయి కాళ్లు, చేతులు వాయడం, 4. వాచిన చోట నొక్కితే సొట్ట పడడం, 5. చర్మంపై మచ్చలు, పుండ్లు, కాయలు, దురద పెట్టడం, రసి కారడం, 6. వరి బీజము (బుడ్డ) మర్మావయాలు పాడవడం, 7. గజ్జల్లో, చంకల్లో బిళ్లలు కట్టడం మొదలైనవి.

వ్యాధి సంక్రమించే ఇతర శరీర భాగాలు : శరీరంలో ఏ భాగానికైనా ఫైలేరియా వ్యాధి రావచ్చును. ఈ బోద సమస్య ముఖ్యంగా కాళ్లు, చేతులు, జననాంగాలకు ఎక్కువ. పురుషులలో వృషణాల తిత్తికి (హైడ్రోసిల్‌), పురుషాంగానికి, స్త్రీలలో రొమ్ము యోని పెదవులకు రావచ్చు కానీ మొత్తం మీద ఈ సమస్య కాళ్లకే ఎక్కువ.

వ్యాధి నిర్ధారణ : ఈ వ్యాధి నిర్ధారణకు రాత్రిపూట రక్తపరీక్ష చేయించుకొని ఫైలేరియా క్రిములు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలి. వీలైతే రోగిని అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న సమయంలో లేపి రక్తపరీక్ష చేయించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ రక్త పరీక్షలో ఫైలేరియా క్రిములు కనబడకపోతే కాలువాపు వస్తే దానికి ఇతరత్రా కిడ్నీ వ్యాధులు, గుండె వైఫల్యం, లివర్‌ వైఫల్యం, థైరాయిడ్‌ సమస్యల వంటివి ఏమీ లేవని నిర్ధారించుకొని లక్షణాల ఆధారంగా చికిత్స ఆరంభించవలసి ఉంటుంది.

చికిత్స : ఫైలేరియా వ్యాధి ప్రాణాంతకమైంది కానప్పటికీ ఈ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే పద్ధతులు లేనప్పటికీ ఈ వ్యాధి తీవ్రత పెరగకుండా నియంత్రించడానికి మందుల్లో ఫైలేరియా సూక్ష్మక్రిములను నాశనం చేసేందుకు ఆల్బెండజోల్‌, ఐవర్‌ మెక్టిన్‌, డైఇథైల్‌ కార్బమజైన్‌ (DEC) -(హెట్రజన్‌), ఫ్లోరాసిడ్‌ మొదలైనవి ప్రసరణ మెరుగు పరిచేందుకు ''కౌమరిన్‌ డెరివేటివ్స్‌'' వంటి మందులను తొలిదశలో క్రమం తప్పకుండా తగిన మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం తీసుకోవడం చాలా అవసరం. ఈ మందులతో పాటు నిత్యం కాళ్లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలాకాలం పాటు సైజు పెరగకుండా చూసుకోవచ్చు. మరీ కొండలా పెరిగితే మాత్రం సర్జరీ చేసి సైజును తగ్గించవచ్చును. ఈ సర్జరీ పద్ధతుల్లో మాత్రం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతి వచ్చింది. సైజు తగ్గించే విషయంలో ఒకప్పటికంటే ఇప్పుడు ఫలితాలు చాలామెరుగ్గా ఉంటున్నాయి. బోద సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో '' డిఇసి '' మాత్రలు ఉచితంగా - మింగు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్‌ రెండవ వారంలో పెద్ద ఎత్తున అమలు పరచుచున్నారు. వయస్సుబట్టి 100 మి.గ్రా. నుండి 300 మి.గ్రాముల మోతాదు మాత్రలు మింగవలసి ఉంటుంది. మనిషికి మరియు దోమకు మధ్యగల జీవిత చక్రాన్ని తెంచుట ద్వారా వ్యాధి సంక్రమణను నిలుపుదల చేయుటయే డిఇసి చికిత్స ప్రధాన లక్ష్యం. ఈ డిఇసి మాత్రలు సంవత్సరానికి ఒకసారి ''ఎమ్‌డిఎ'' కార్యక్రమంలో తప్పకుండా 5 -7 సంవత్సరాలపాటు అర్హులైన వారందరూ మింగడం ఎంతో శ్రేయస్కరం. ఈ డిఇసి మాత్రలు రెండేళ్లలోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి ఇవ్వరాదు. ఖాళీ కడుపుతో డిఇసి మాత్రలు మింగరాదు. మరియు ప్రతి సంవత్సరం తేది 11 నవంబర్‌ జాతీయ ఫైలేరియా నివారణా దినంగా పాటిస్తున్నారు. (-జాతీయ బోదవ్యాధి నివారణ కార్యక్రమం)


  • ఫైలేరియా వ్యాధి ఉన్నవారు నిత్య జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :




ఈ వ్యాధిగ్రస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. స్వచ్ఛమైన నీటిని ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా వ్యాధి సోకిన భాగాలను కాళ్లను తరచుగా మంచినీటితో శుభ్రంగా సబ్బుతో కడుక్కొని, పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకొని ఏదైనా యాంటీసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ పూయాలి. రోజూ క్రమం తప్పకుండా కాళ్లకు సంబంధించిన వ్యాయామం చేయాలి. కాలిని గోకడం, గీరటం వంటివేవీ చేయకూడదు. గోళ్ళను శరీరానికి సమంగా కత్తిరించాలి. పాదాలను పైకిఎత్తడం, దింపడం చేస్తూ ఉండాలి. రోజులో ఎక్కువ భాగం నిలబడకుండా కాళ్ళను పైకి పెట్టుకొని కూర్చోవాలి. కింద బాగా బిగువుగా పైన కొంత వదులుగా ఉండేలా కాళ్లకు రెండుపూటలా క్రేప్‌ బ్యాండేజ్‌ కడుతుండాలి. రాత్రిపూట బ్యాండేజ్‌ తీసేసి కాలిని ఎత్తులో పెట్టుకొని పడుకోవాలి. ఇటువంటి వ్యాయామాలు చేసేవారికి జ్వరం ఉండకూడదు. గుండె జబ్బులు ఉన్నవారు ఇటువంటి వ్యాయామాలు చేసేటప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. కాళ్లకు సరైన చెప్పులు వాడాలి.

అన్నిరకాల దోమలను కింది చర్యల ద్వారా అరికట్టవచ్చు :



  • మానవ నివాసాలకు పందులను ఊరికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి.

  • దోమ గుడ్లను తినివేయి గప్పీ, గంబుషియా చేపలను బావులు, కొలనులు, పెద్ద పెద్ద నీటి గుంటల లోనికి వదలడం, పెంచడం,

  • దోమతెరలు వాడాలి.

  • ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు, తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి.

  • సంపూర్ణ వస్త్రధారణ,

  • ఓడామాస్‌ లాంటి ఆయింట్‌మెంట్లను, వేపనూనెను శరీరానికి పూసుకొని నిద్రించాలి.

  • ఇంట్లో జెట్‌, ఆల్‌ అవుట్‌, మస్కిటో కాయిల్‌ గాని ఉపయోగించాలి. సాయంత్రం వేళ కుంపట్లో గుప్పెడు వేపాకు పొగ వేసుకోవాలి,

  • సెప్టిక్‌ ట్యాంక్‌ గొట్టాలకు ఇనుప జాలీ బిగించడం.

  • ఇంటిలోపల, బయట పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడడం, ఫ్లవర్‌వాజ్‌లో నీటిని ఎప్పటికప్పుడు మార్చడం, నీటి తొట్టెలను వారానికి ఒకసారి ఖాళీ చేసి మరలా నింపుకోవడం, (వారానికి ఒకరోజు డ్రై దినంగా పాటించాలి).

  • ఇంటిపైన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు మొదలగు వాటిపై మూతలు ఉంచడం,

  • ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉన్నట్లయితే ఆ నీటిలో ఆబేటు, బేటెక్స్‌, ''లార్విసైడ్‌'' మందులను స్ప్రే చేయాలి. లేదా కిరోసిన్‌, వేస్ట్‌ ఇంజన్‌ ఆయిల్‌ వేయాలి.

  • ఇళ్లలోని ఎయిర్‌ కూలర్స్‌, డ్రమ్ములు, కుండలు, రోళ్ళు, పూల కుండీలు, అలంకరణకై ఉపయోగించే మొక్కల కుండీలలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలి.

  • పక్షులు స్నానం కోసం వాడే నీటి పళ్ళాలు ఎప్పటికప్పుడు ఖాళీచేసి ఆరబెట్టడం,

  • త్రాగి పారవేసిన కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పలు, ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు, పగిలిన సీసాలు, వాడి పడవేసిన పాత టైర్లు చెత్త కుండీలలో వేయాలి.

  • ఇళ్ళలో గోడలపై డిడిటి, మలాథియాన్‌, సింథటిక్‌ పైరత్రాయిడ్‌ పిచికారి (స్ప్రే) చేయించడం,

  • సాయంత్రంపూట పైరథ్రమ్‌ ఫాగింగ్‌ (పొగవదలడం) చేయాలి.

  • అన్నిటికంటే పరిసరాల పారిశుధ్యాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఈ పారిశుద్ధ్యం విషయంలో చెత్త నివారణ, మురికి నీరు, డ్రైనేజీ, పరిసరాల పరిశుభ్రత పాటించడంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలను చేపట్టాలి. పై మందులు చాలాప్రమాదకరమైనవి. ఆహార పదార్థాలపై ఈ మందులు పడకుండా జాగ్రత్త వహించాలి. చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా భద్రపరచాలి. తాగునీటిలో ఈ మందులు చల్లరాదు. ఈ మందులు కలిపేటప్పుడు, చల్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Exercises to increage height- ఎత్తు ఎదిగేందుకు వ్యాయామము





ఎత్తుగా ఉంటే అందం గా ఉంటామన్న విషయం లో ఏ సందేహాలు అవసరం లేదు . ఎత్తువల్ల అందమే కాదు , మానసికం గా ప్రయోజనము లేకపోలేదు . పర్సనాలిటీ అందించే ఆత్మవిశ్వాసం తో విజయాలు సాధించే అవకాశం ఏర్పడుతుంది . ముఖ్యం గా ఎత్తుపెరగడం అనేది వంశపారంపర్యం గా వస్తుంది . మనిషి సాధన , వ్యాయామము , ఆసనాలు వేయడం వలన కొంత వరకు ఎత్తుపెరిగే అవకాసము లేకపోలేదు .

Walking as Exercise - నడక వ్యాయామము



వ్యాయామంలో భాగంగా నడక.. శరీరానికెంతో మేలు చేస్తుంది. అయితే.. యథాలాపంగా కాకుండా.. నడకపైనే దృష్టి కేంద్రీకరించగలిగితే... మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు అధ్యయనకర్తలు.

ఉదయం పూట చాలామంది మార్నింగ్ వాక్ అంటూ తమదైన శైలిలో తిరిగేస్తుంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయడం ఎంతో లాభదాయకం, కాని కొన్ని నియమాలు పాటిస్తుంటే మరింత ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిపుణుల ప్రకారం, ఆరోగ్యం కోసం నడక అత్యంత సులువైన వ్యాయామ మార్గం. కెలొరీలు ఖర్చవడమే కాదు.. మానసిక సాంత్వనా లభిస్తుంది. ఇదంతా మామూలుగా రోజూ కాసేపు నడవడం వల్ల కలిగే లాభం. ఇదే నడకకు... ధ్యానాన్ని జత చేయగలిగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఒత్తిడి దూరం అవుతుంది. శరీరానికి సాంత్వన లభిస్తుంది. 'విపాసన నడకగా' పరిగణించే ఈ విధానం వందల ఏళ్లుగా ఆచరణలో ఉన్నదే. తలకాస్త పైకెత్తి... కళ్లు మాత్రం నేలపైనే ఉంచి... ఒక్కో అడుగును గమనించుకుంటూ సాగడమే 'విపాసన నడక' .

ప్రస్తుత యాంత్రిక జీవన విధానం గమనిస్తే.. పూర్తిగా హడావుడే. ఒకే సమయంలో ఎన్నోరకాల పనులు. దాని వల్ల చెప్పలేనంత ఒత్తిడి. ప్రశాంతతతో పాటు.. ఆరోగ్యం సొంతం కావాలంటే.. ఈ తరహా విధానం సరైన ఆలోచన. దీనిపై హార్వర్డ్‌కు చెందిన మైండ్‌బాడీ మెడికల్‌ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన అధ్యయనమూ ఇంచుమించు ఈ విషయాలనే తెలిపింది.

ధ్యానంతో కూడిన నడకతో ఒత్తిడి, కంగారు దూరమవుతాయి. మనసుకి లభించే సాంత్వన దీర్ఘకాలం ఉంటుంది. అధిక రక్తపోటు అదుపులో ఉండటం... శ్వాస సంబంధిత సమస్యలు, దీర్ఘకాల నొప్పులుతగ్గడం... సంతాన సాఫల్యం వృద్ధి చెందడం.. లాంటి మరిన్ని ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. చేస్తున్న పనిపై ఏకాగ్రతా పెరుగుతుంది. నిటారైన ఆకృతి... కండరాల దృఢత్వం... భుజాలు, కాళ్లకు విశ్రాంతి.. లభిస్తాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైంది, సులభతరమైనదీను. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నడక ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఉదయంపూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయపు నులివెచ్చటి కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది.

లాభాలుః


* ప్రతి రోజు క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తుంటే శరీరంలోని కండరాలు బలిష్టంగా తయారవుతాయి. శరీరంలో పేరుకుపోయిన పనికిరాని కొవ్వు కరిగిపోతుంది. ఎంత ఎక్కువగా నడక సాగిస్తుంటే అంత ఎక్కువగా శరీరంలోని క్యాలరీలు కరిగి, ఊబకాయం తగ్గుతుంది.




* ప్రాతఃకాలంలో వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడుతుంది. దీంతో శరీరంలో ఆక్సీహిమోగ్లోబిన్ తయారవుతుంది. శరీరంలో ఆక్సీహిమోగ్లోబిన్ తయారవ్వడం వలన రక్తనాళాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది.

* గుండె, రక్తపోటు, మధుమేహం తదితర రోగులు ఉదయంపూట నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

* ఉదయంపూట నడవడం వలన ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.

* మార్నింగ్ వాక్ చేయడం వలన శారీరక, మానసకిపరమైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

* ప్రతి రోజు కనీసం మూడు కిలోమీటర్ల మేరకు నడవాలి. వారానికి ఐదు రోజులపాటు ఖచ్చితంగా నడిస్తే మరీ బాగుంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలుః


* మార్నింగ్ వాక్ చేసే సమయంలో సౌకర్యవంతమైన చెప్పులు ధరించండి.

* ప్రశాంతమైన వాతావరణంలో నడవండి. చుట్టూ తోట, ఉద్యానవనం లేదా ఖాళీ స్థలం ఉన్న ప్రాంతాల్లో నడిచేందుకు ప్రయత్నించండి.

* నడిచే సమయంలో తేలికపాటి శ్వాస దీర్ఘంగా తీసుకునేందుకు ప్రయత్నించండి. మనసులో ఎలాంటి ఆలోచనలకు తావీయకండి.

* శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకునేందుకు తగు మోతాదులో నీటిని సేవిస్తుండండి. మార్నింగ్ వాక్ చేసే ముందు, తర్వాత ఒక గ్లాసు నీటిని తప్పకుండా సేవించండి.

* మార్నింగ్ వాక్ చేసే సందర్భంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకండి.

* నడిచే సమయంలో మీ చేతులను చక్కగా నిటారుగా ఉంచి క్రమంగా వెనకకు, ముందుకు కదిలిస్తూ నడవండి. దీంతో చేతులకు మంచి వ్యాయామం కలుగుతుంది.

* గుండె జబ్బులున్నవారు, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు లేదా ఇతర జబ్బులతో సతమతమౌతున్నవారు వాకింగ్ చేయాలంటే వైద్యుల సలహా తీసుకోవాల్సివుంటుంది.

* ప్రతి వ్యక్తి తమ తమ వయసుకు తగ్గట్టు, వారి సామర్థ్యం మేరకు నడవాల్సివుంటుంది.

* నడకసాగించే ముందు, నడక ముగించే ముందు మీ నడక వేగాన్ని నియంత్రించుకోండి. అలాగే ఉదయం అల్పాహారం తీసుకోవడం మరవవద్దు.

ప్రస్తుతం ఉరుకులపరుగులమయమైన జీవితంలో కనీసం 20-25 నిమిషాలను మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. కాలుష్య రహిత వాతావరణంలో ఉదయంపూట స్వచ్ఛమైన గాలిని మీ శరీరానికి అందించండి.

విశిష్ట వ్యాయామం నడక,Power walking:


ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటానికి చేపట్టే వ్యాయామ ప్రక్రియల్లో నడక ఒక విశిష్టమైన ప్రక్రియ. దీనిని మన శరీర స్థితిగతులనుబట్టి అనేక విధాలుగా నిర్వహించి, ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నడకకు చెందిన ప్రక్రియల్లో పవర్‌ వాకింగ్‌ అనే పద్ధతిని ఒక ప్రత్యేక ప్రక్రియగా పేర్కొనవచ్చు. పవర్‌ వాకింగ్‌ వలన శరీరంలో నడుము పైభాగంలోని కండర సముదాయాలకు ఎయిరోబిక్‌ ప్రక్రియల సౌలభ్యం కలుగుతుంది.




ఒక వ్యక్తి పరుగు పెట్టే ప్రక్రియలు నిర్వహించిన ప్పుడు వినిమయమయ్యే కేలరీల శక్తికి సమానంగా పవర్‌ వాకింగ్‌లో శక్తి వినియోగమవుతుంది. మరొక ముఖ్యమైన అంశమేమిటంటే పవర్‌ వాకింగ్‌ను పరుగు ప్రక్రియ కంటే తేలికగా నిర్వహించవచ్చు.
అతిజోరుగాసాగే నడక కంటే పవర్‌ వాకింగ్‌లో అత్యధిక పరిమాణంలో కండరాలు వ్యాయామ ప్రక్రియలకు గురవుతాయి. తద్వారా కేలరీల వినిమయ శక్తి కూడా అధికంగానే ఉంటుంది.

పవర్‌ వాకింగ్‌ చేసే వ్యక్తులు 12 నిముషాల్లో ఒక మైలు దూరాన్ని అంటే 1.6 కిలోమీటర్ల దూరాన్ని నడ వగల సామర్థ్యం కలిగి ఉంటారు. సాధారణంగా ఈ సామర్థ్యాన్ని ఒక వారం రోజుల్లో సాధించవచ్చు.

పవర్‌ వాకింగ్‌కు సూచనలు:


నడిచేప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. నడు స్తున్నప్పుడు సూటిగా 20 అడుగుల దూరం వరకూ చూస్తూ నడక కొనసాగించాలి. అంతేకాని, కిందకు, ప్రక్కలకు చూస్తూనడువరాదు. గడ్డం భాగం నిటారుగా ఉండటం, తల నిటారుగా ఉండటం అవసరం. భుజాలు రెండూ సరి సమానంగా ఎగుడు దిగుడు లేకుండా ఉండాలి. వీపు భాగం నిటారుగా, వదులుగా ఉండాలి. వీపు భాగంలోని కండరాలను బిగబట్టి నడువకూడదు.

ఛాతి భాగం నిటారుగా సాగి ఉండాలి. పిరుదులు, నడుముభాగం బిగబట్టి గట్టిగా ఉంచుతూ నడక కొనసాగించాలి. వెనుక నడుము భాగాన్ని సమంగా ఉంచి, పొత్తి కడుపు చుట్టూ ఉండే కండరాలను కొంచెం ముందుకు వంచి నడకను సాగించాలి. నడిచేప్పుడు భూమి మీద ఒక గీతను ఊహించుకుని, ఆ గీతపై తిన్నగా నడుస్తున్నట్లు ఉండాలి.

చేతులను 90 డిగ్రీల కంటే తక్కువగా వంచుతూ, వదులుగా పిడికిలి బిగించి నడవాలి. చేతులను ముందుకు వెనుకకు నిటారుగా ఊపుతూ నడవాలి. మోచేయి ఛెస్ట్‌ బోన్‌ను దాటి పైకి రాకూడదు. నడిచే ప్పుడు చేతులనుముందుకు, వెనుకకు వేగంగా ఊపడం వలన పాదాలు దానికి అనుగుణంగా సాగుతాయి.

అడుగులు వేసేప్పుడు ముందు కాలి మడమను భూమిని తాకించి, తరువాత పాదం ముందు భాగం భూమిని తాకేలా వేయాలి.
అడుగులను దూరదూరంగా వేస్తూ నడక సాగించి, త్వరగా ముగించాలనే ఆలోచనను మనస్సులోనికి రానీయకూడదు. వేగంగా నడకను కొనసాగించడానికి చిన్న చిన్న అడుగులను ఎక్కువగా వేయడం మంచిది.

ఊపిరిని మామూలు స్థాయిలోనే తీసుకోవాలి. బాగా అలసిపోయేంత తీవ్రస్థాయిలో వ్యాయామం చేయకూ డదు. ఈ ప్రక్రియ చేపట్టే సమయంలో చేతుల్లో ఎలాంటి బరువులు ఉండకూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే పవర్‌ వాకింగ్‌ వలన ఆశించిన ఫలితాలను సాధించడం ఎంతో సులభమవుతుంది.

నడక మెలకువలు :


ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వ్యాయమం ఎంతో చక్కని మార్గం. ఇందుకు పెద్దగా ఖర్చు కూడా కాదు. ముఖ్యంగా నడక అందరూ చేయదగిన మంచి వ్యాయామం. దీంతో ఎన్నో లాభాలున్నాయి. దీనికి కావలసిందల్లా..
1. పొద్దున్నే నడవాలనే దృఢ నిశ్చయం. ఇది చాలా ముఖ్యమైంది.
2. తేలికపాటి కాన్వాస్‌ బూట్లు
3. టీ షర్టు, పొట్టి నిక్కరు. మామూలు దుస్తులతోనూ చేయొచ్చు.

ఆరంభించేముందు..:


నడక ఆరంభించటానికి ముందు 45 ఏళ్లు పైబడినవారిలో.. నడిస్తే ఆయాసం రావటం, ఛాతీనొప్పి వంటివి ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవటం మంచిది. ఇక 45 లోపు వారికి ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండా నడక ఆరంభించొచ్చు.

 

లాభాలేంటి?


1. గుండె సమర్థవంతంగా పనిచేస్తుంది.
2. గుండెపోటు బారినపడకుండా చూస్తుంది.
3. రక్తపోటు తగ్గుతుంది.
4. రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది.
5. రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. వ్యాధి తేలికగా అదుపులోకి వస్తుంది.
6. శరీర బరువు తగ్గుతుంది.
7. కుంగుబాటు (డిప్రెషన్‌), ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
8. హాయిగా నిద్రపడుతుంది.
9. వ్యాయామం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ వంటివి వచ్చే అవకాశాలు తక్కువని శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది.
10. అన్నింటికన్నా ముఖ్యంగా ఆత్మ విశ్వాసం, శారీరక సామర్థ్యం పెరుగుతుంది.
11. కీళ్లనొప్పులు లేకుండా, ఎముకలు దృఢంగా ఉంటాయి.
12. నీరసం, అలసట, నిస్సత్తువ, నిస్పృహ తగ్గుతాయి.

కొన్ని జాగ్రత్తలు:


50 ఏళ్ల వ్యక్తి గుండె ఒక నిమిషంలో 170 సార్ల వరకు శ్రమ లేకుండా కొట్టుకోగలదు .

2. లక్షిత గుండె వేగం
గరిష్ఠ గుండె వేగంలో 50% నుంచి 75% వరకు గుండె కొట్టుకునేలా వ్యాయామం చేయాలి. ఉదాహరణకు 50 ఏళ్ల వ్యక్తి గరిష్ఠ గుండె వేగం 170 కాబట్టి అందులో 50-75 శాతం అంటే.. 85 నుంచి 125 సార్ల వరకు గుండె కొట్టుకునేలా వ్యాయామం చేయాలన్నమాట.

3. ఎలా చూడాలి?
మణికట్టు వద్ద బొటనవేలు దిగువన వేళ్లతో నొక్కి పట్టి చూస్తే నాడీ ద్వారా గుండె కొట్టుకునే వేగం తెలుస్తుంది.
* నడిచేటప్పుడు పక్కవారితో సునాయాసంగా మాట్లాడగలుగుతుంటే మనం అంత తీవ్రంగా వ్యాయామం చేయటం లేదని, వేగం మరికాస్త పెంచవచ్చని గుర్తించాలి.

అతి ముఖ్యమైన విషయం:


* ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొద్దునే నడవటం వల్ల ఎంతో లాభం ఉంటుంది. చాలామంది కొద్దిరోజులు నడక సాగించి మానేస్తుంటారు. మరికొందరు రెండు మూడు రోజులు నడిచి తర్వాత విరామం తీసుకుంటూ ఉంటారు. కొందరు బరువు తగ్గాలనే ఆలోచనతో కొద్దిరోజుల పాటు వేగంగా నడుస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రెండు మూడు రోజులు హడావిడిగా చాలా ఎక్కువ శ్రమపడి మానివేయటం కన్నా కొంచెం సేపైనా రోజూ నడవటం మంచిది.

ఎలా నడవాలి?
* ముందు 5 నిమిషాల సేపు నెమ్మదిగా నడవాలి. దీంతో శరీరం నడకకు అనుకూలంగా సిద్ధమవుతుంది. అనంతరం 30 నిమిషాల సేపు వేగంగా నడవాలి. నడకలో వేగం వల్ల ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. వేగంగా నడచిన తర్వాత వెంటనే ఒకేసారి ముగించకూడదు. నెమ్మదిగా వేగం తగ్గించుకుంటూ రావాలి. అలా 5 నిమిషాల సేపు నడిచిన తర్వాత నడకను ఆపేయాలి.

హెచ్చరికలు:


* నడుస్తున్నప్పుడు గుండెలో నొప్పి, ఆయాసం, అతిగా చెమట పట్టటం, అతి నీరసం, అలసట, కళ్లు తిరగటం, తూలి పోవటం, పక్కల్లో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వ్యాయామాన్ని ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి. అశ్రద్ధ పనికిరాదు.

రోజూ వ్యాయామం చేయాలనుకునే వారు పరుగెత్తడమో, ట్రెడ్‌మిల్‌ మీద నడవడమో చేస్తారు. అయితే దానికి ముందూ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.

పరుగెత్తడాన్ని వ్యాయామంగా ఎంచుకోవాలనుకునే వారు ముందుగా వైద్యుల్ని సంప్రదించాలి. నలభై ఏళ్లు దాటిన వారూ, స్థూలకాయులూ, కొన్ని రకాల అనారోగ్యాలతో కొన్నేళ్లపాటు వ్యాయామం చేయని వారూ ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకేసారి వేగంగా పరుగెత్తకూడదు. ముందు శరీరాన్నంతా వేగంగా కదిలిస్తూ కనీసం అరగంట నడవాలి. అలా ఒకటి రెండు నెలలు గడిచాక నెమ్మదిగా పరుగెత్తాలి. అప్పుడు కూడా మధ్యమధ్య నడవడం చాలా అవసరం. పరుగెత్తే ముందు తప్పనిసరిగా వార్మప్‌, స్ట్రెచింగ్‌ వ్యాయామాల్లాంటివి అవసరం. పరుగెత్తి వచ్చాక కూడా కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుని తరవాత ఒకసారి స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేసి అప్పుడు మిగిలిన పనుల్లో పడాలి.

వెంట ఓ మంచినీళ్ల సీసా తీసుకెళ్లడం తప్పనిసరి. దాహం వేసినప్పుడల్లా మరీ ఎక్కువగా కాదు కానీ కొద్దిగా నీళ్లు తాగితే మంచిది. వారంలో కనీసం రెండు రోజులు ఎలాంటి పరుగు లేదా నడక లేకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల అలసట అనేది ఉండదు. రోడ్లపై కాకుండా ఖాళీగా ఉన్న మైదానాల్లో పరుగెత్తాలి. దానివల్ల వాహనాల కాలుష్యం బారిన పడకుండా ఉండొచ్చు. ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా మరీ పొద్దున, లేదంటే సాయంత్రం చల్లబడ్డాక పరుగెత్తడం మంచిది. సాధ్యమైనంత వరకూ వదులుగా ఉన్న దుస్తుల్ని ఎంచుకోవాలి. దానివల్ల చెమట పట్టినా ఎలాంటి అసౌకర్యం ఉండదు. సౌకర్యంగా ఉన్న బూట్లను ఎంచుకోవడం కూడా చాలా అవసరం.

నంజుపోక్కులు , Aphthus Ulcers,నోటిలో పొక్కులు



నంజు అంతే ... భోజనము చేసేటపుడు తినే రుచికరమైన కూర పదార్ధము ... సాధారణము గా కారము , మసాల తో తయారుచేసిన పదార్ధము . మరియొక అర్ధము ... ఒకరకమైన పౌష్టికాహార లోపమువల్ల కలిగే వ్యాధి ... ఉబ్బునంజు , కట్టే నంజు అని రెండురకాలు . ఇక్కడ నేను నన్జుపోక్కులగురించే వివరించడం జరిగినది .

నంజుపోక్కులు (OphthusUlcers) :- మనశరీరము లో చర్మము , మ్యూకస్ పొర కలిసేచోట , మ్యూకస్ పోరాపైనా ఏర్పడే పొక్కులు లాంటి పుండ్లు . ఇవి చాలా నొప్పిని కలుగజేస్తాయి . కారము , మసాలా , వగరు , పులుపు కూరలను తినడానికి చాలా భాధగా ఉటుంది . ఈ పోక్కులతో నోటిపూత (Stomatitis)కుడా ఒక్కొక్క సారి ఉండవచ్చును . ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి . జనాభా లో సుమారు 10% వరకు దీని బారిన పడుతుంటారు . పురుషులు కంటే స్త్రీలలో ఎక్కువ . ఈ వ్యాధి ఉన్నవారు 30% - 40% కుటుంబ చరిత్ర (FamilyHistory) కలిగిఉంటారు .


  • రకాలు :




చిన్న రకము(MinorUlceratio) - వీటిలో పొక్కులు పరిమాణము ౩ మిల్లీమీటర్లు నుండి ౧౦ మి.మీ. వరకు ఉంటాయి. మ్యూకస్ పొర పైన పసుపు , బూడిద రంగులో ఉండి ఎక్కువగా పెదాలపైన ఉంటాయి .

పెద్ద రకము (MajorUlceration) - ఈ పొక్కులు ౧౦ మి.మీ కంటే ఎక్కువ పరిమాణము(Size) కలిఉంది కోపముగా ఉన్నట్లు ఎరుపు , బూడిద రానుగులలో ఉంటాయి . నొప్పి ఎక్కువ నోటిలో బుక్కలలోపల , పెదాలపైన ఉండి పెదాలు వాపును కలిగిస్తాయి . చిన్నపాటి జ్వరము వస్తుంది . ఉమ్మిని మిన్గాదానికు కుడా కష్టం గా ఉంటుంది . రోజువారి పనులు చేసుకోవడానికి చిరాకుగా ఉంటుంది .

మహమ్మారి నంజుపోక్కులు (HerpetiformUlceration)- ఇవి బాగా బాధ పెట్టే నంజుపోక్కులు . చిన్న చిన్న చాలా ఎక్కువ పొక్కులు , అల్సర్లు సుమారు 1 నుండి 3 మి.మీ. పరిమాణము కలిగి ఉంటాయి , ఇవి కొన్ని వైరల్ ఇంఫెక్సన్ అనగా హీర్పీస్ సిమ్ప్లెక్ష్ ని పోలిఉంటుంది .


  • నంజుపోక్కుల వ్యాధి లక్షణాలు :




ఇవి మొదట నోటిలో మంట , దురద ఉన్న చిన్న ప్రదేశం గా మొదలై ...పొక్కు గా తయారై పుండు గా మారుతోంది. పసుపు , ఎరుపు పోక్కుగా నొప్పు పెట్టే అల్సర్ గా మారి భాద పెడుతుంది . దవడ కింద గడవ బిళ్ళలు (LymphNodes) వాపు , నొప్పి ఉండును . ఏదీ తినడానికి వీలుపడదు ... మంట నొప్పి ఉండును . సుమారు ఒక నెల రోజులలో తగ్గిపోవును ... ఇవే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి .
వీటి పుట్టుకకు సరియైన కారణము తెలియదు .

ఈ కింద కొన్ని కారణాలు ఈ వ్యాది రావడానికి దోహదపడతాయి.

  • నిమ్మ జాతికి చెందినా కొన్ని పండ్లు --- నిమ్మ , నారింజ మున్నగునవి ,



  • ఎక్కువ రోజులు చాలినంత నిద్ర లేకపోవడము ,



  • మ్యుకస్ పొరకు రఫ్ గా గాయము తగలడము ... బ్రష్ చేయడం లో ను , గట్టి పదార్దములు తినడంలోను ,



  • హార్మోనుల మార్పుల వలన ,



  • కొన్ని ఆహారపదార్ధాల వల్ల కలిగే అలెర్జీ ,



  • వ్యాదినిరోధక వ్యవస్థ లో కలిగే కొన్ని అవాంచిత మార్పులు (ImmuneSystemReactions),



  • విటమిన్ b12 , ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ లోపము వల్ల ,



  • ఆవుపాల అలెర్జీ రియాక్షన్ వల్ల ,



  • మలబద్దకం , ఆహారపదార్ధాల లోపము , ఎలార్గీ ల వల్లా రావచును ,


చికిత్స(Treatment) :



  • నోటిలో పొక్కులు ఉన్నాపుడు వాటి ఏవిధమైన రాపిడి , వత్తిడి , దెబ్బలు తగలకుండా చూసుకోవాలి ,



  • ఏమైనా కట్టుడు పళ్ళు , దేన్చార్లు ఉన్నచో వాటిని తీసివేయాలి ,



  • ఏదైనా మంచి మౌత్ వాష్ .. ఉదా - TANTUM mouth wash , betaadin mouth wash , తో పుక్కలించాలి ,



  • బ12 , ఫోలిక్ ఆసిడ్ తో కూడుకున్న మల్తివిటమిన్లు వాడాలి ,(SupradynTab)రోజు ఒకటి , Folera 5 యం.జి. రోజు ఒకట తీసుకోవాలి ,



  • TESS mouth ఆయింట్మెంట్ పుల్లు పై రాయాలి ,



  • Sensodyne tooth paste తో బ్రుష్ చేసుకోవాలి ,



  • తేనే లేదా ఆవునేయ్యిని ఆ పొక్కుల మీద రాస్తే తగ్గుతాయి .



  • ఉసిరి ,చెక్క వేసిన తాంబూలము నమిలిన ఉపసయనం కలుగును ,

ice theraphy - ఐస్‌ థెరపీ





మేని సౌందర్యాన్ని పెంపొందించడానికి... వేధించే మొటిమలను తొలగించడానికి... 'ఐస్‌ థెరపీ' మంచిదంటున్నారు సౌందర్యనిపుణులు.. అదెలానో చూద్దాం..

ఒక్కోసారి మొటిమలు, వాటి తాలూకు మచ్చలు అమ్మాయిలను తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సమస్యకు ఐస్‌ ముక్కలతో చెక్‌ పెట్టవచ్చు. మొదట ఐస్‌ను శుభ్రమైన వస్త్రంలో తీసుకోవాలి. చుబుకం మీద వలయాకారంలో మెల్లిగా రుద్దుతూ పోవాలి. మద్యమధ్యలో కాసేపు విరామమిస్తూ నెమ్మదిగా ముఖమంతా అప్త్లె చేయాలి. మొటిమలున్న ప్రాంతంలో నెమ్మదిగా ఒత్తిపెడుతూ ఐస్‌ ఉంచాలి. ఇలా ఓ క్రమపద్ధతిలో చేస్తే కొన్ని రోజులకు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతే కాదండోయ్‌ చర్మానికి ఇది మంచి యాంటీఏజింగ్‌ కారకంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు సౌందర్యనిపుణులు. ఐస్‌ను రుద్దడం వల్ల ముఖం శుభ్రపడి... కాంతిమంతంగా కనిపిస్తుంది.

ఒత్తిడికి ఉపశమనం.. ఒత్తిడితో తలనొప్పిగా ఉంటే ఐస్‌ను ముక్కలుగా చేసి వస్త్రంలో వేసి నుదురుమీద ఉంచాలి. కనురెప్పల మీదా కాసేపు ఉంచితే శరీరం, మనసు ఉత్తేజితమవుతాయి. ఈ ప్రక్రియనే 'ఐస్‌ థెరపీ' అంటారు. అయితే పదిహేను నిమిషాలకంటే ఎక్కువ సేపు ఈ థెరపీని చేయకూడదు. ముఖం పొడి బారాక తడి తువాలుతో సున్నితంగా తుడవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రుతుక్రమము లో కడుపు నొప్పి తగ్గదానికి ఐస్ తో పొత్తికడుపు ఒత్తాలి . నివారణ అవుతుంది .

ఐస్‌ సిద్ధమిలా.. సౌందర్య పోషణలో వాడే ఐస్‌ను ప్రత్యేకంగా తయారుచేసుకుంటే మేలు. ఇందుకోసం శుభ్రమైన ఓ మోస్తరు స్టీలుగిన్నె తీసుకోవాలి. దాన్నిండా నీరు నింపి ఫ్రిజ్‌లో పెట్టండి. స్టీలుపాత్రలో తీసిన ఐస్‌ పెద్దగా ఉంటుంది కాబట్టి తొందరగా కరిగిపోయే సమస్య ఉండదు. గిన్నెలో ఉన్న ఐస్‌ను ట్యాప్‌కింద పెట్టి తొలగించి ఓ సారి శుభ్రం చేసిన తర్వాత ఉపయోగించడం మేలు. ఇలా శుభ్రపరిచిన ఐస్‌ను చిన్న ముక్కలుగా వాడాలి. ఐస్‌ను నేరుగా ముఖం మీద రుద్దితే చర్మం కంది ఎర్రగా అయ్యే ప్రమాదం ఉంది. దూదిలోగానీ, మెత్తని వస్త్రంలోగానీ ఉంచి రుద్దాలి.

Habits and ill-health , అలవాట్లు -అనారోగ్యం



గుట్కా , ఖైనీ . పాం మసాలా తిండం , గంజాయి , సిగరెట్లు కాల్చడం , సరదా అనుకుంటే పొరపాటే .ఇవి అలవాటుకా మారితే ఎంతో ప్రమాదము .అనారోగ్య బారిన పడి చలామంది భవిష్యత్తు పాడుచేసుకుంటున్నారు . ఈ మధ్య కాలములో ఇలాంటి వాటికి అలవాటు పడిన వారి సంఖ్య గణనీయం గా పెరుగుతు వస్తోంది .తమ బంగారు భవిష్యత్తు కోసం యువత ఇలాంటి వ్యసనాలకు దూరం గా ఉండదం మంచిది .
మా శ్రీకాకుళం జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం 8.1 లక్షల మంది యువత ఉండగా వారిలో 3.9 లక్షల మంది ఖైనీ , గుట్కా వంటి వాటికి అలవాటు పడ్డారు . వీరిలో 60 వేల మంది వరకూ వివిధ రోగాల బారిన పడి చికిత్సలు తీసుకుంటున్నారు . జీవితాన్ని నరకక ప్రాయం చేసుకుంటున్నారు . ఒక రోజు సుమారు 20 పాకెట్లు వరుకు తినేవారు ఉన్నారు .
ముఖ్యమయినవి .->

  • ఖైనీ ,

  • పాంపరాగ్ ,,

  • 500 ,

  • గుట్కా ,


వచ్చే అనర్ధాలు : ->



  • నొటిలోని ఎర్రని మ్రుదు కణ జాలము దెబ్బతిని నోటి పుతకు దారితీస్తుంది .

  • నాలుక పొక్కుతుంది , నాలుక కాన్సర్ కి దారితీసుంది ,

  • ఉదర , ఊపిరితిత్తుల కాన్్సర్ వ్యాదులకు అంకురాపణ అవుతుంది .

  • గుండె పొటు , పక్షపాతం వచ్చే ప్రమాధం ఉంటుంది .

  • వీర్య కణాలు తగ్గి సంతానము కలుగక పోవచ్చును ,

  • కాళ్ళ బాగాలలో రక్తప్రసరణ తగ్గి .. నరాలు చచ్చు బడిపోవును . గాంగ్రీన్ వంటి జాబులు వస్తాయి .

Electronic Waste Health hezards - ఎలక్ట్రానిక్ వ్యర్ధపదార్ధాలు ఆరోగ్య సమస్యలు

b5731-computerwaste2



 

భారత దేశం లొ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం బాగా పెరిగింది . సెల్ ఫొన్ల వినియోగం చాలా ఎక్కువయినది . ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు , కంప్యూటర్లు , ల్యాప్ టాప్లు , డివిడి ప్లేయర్లు , ఎంపీ3 ప్లేయర్లు ... వినియోగము హద్దులు దాటుతుంది . వీటి జీవిత కాలము పూర్తయితే ... అవి ఎలక్ట్రానిక్ వ్యర్ధ పదార్దాలుగా మారుతాయి . ప్రపంచ వ్యాప్తం గా వ్యర్ధాల పెరుగుదల రేటు ఎక్కువవుతూనే ఉన్నది . 4 కోట్ల టన్నుల మేర ఉంటుందని అంచనా . వీటివలన ఆరోగ్యానికి , పర్యావరణానికి హాని కలుగుతుంది . భారతదేశం లొ 2005 లో 1.47 లక్షల టన్నులు కాగా .. ఇది 2012 నాటికి 8 లక్షల టన్నులు కు చేరుతుందని నిపుణుల ఊహా .

ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సరిగా శుద్ధిచేస్తే విలువైన ముడిపదార్హాలను పొందవచ్చును . పర్యావరణానికీ మేళుజరుగుతుంది . అయితే భారత వంటి పలు దేశాలలో ఈ పక్రియ సరిగా జరగదం లేదు . ఎలక్ట్రానిక్ పరికరాలను భాగాలుగా విడదీసి పనికొచ్చే భాగాలను రోడ్ల వెంబడి అమ్మే వస్తువుల కోసం విక్రయిస్తున్నారు . మిగతా భాగాలను తగల బెట్టడమో , పాతిపెట్టడమో చేస్తున్నరు .ఈ రెండు విధానాల వల్ల ఆరోగ్యానికి , పర్యావరణానికి హానిజరుగుతుంది .

  • భూమిలో పాతిపెట్టినప్పుడు విషతుల్యమైన రసాయనాలు భూగర్భజలాల్లో కలుస్తాయి . నీరు కలుషితమై రోగాలను కలుగజేసుంది .

  • ఎలాంటి రక్షణ లేకుండానే మహిళలు , పిల్లలు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు . సుమారు 80 శాతం రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు .

  • ఈ ఎలక్టానిక్ వ్యర్ధాల్లో హానికరమైన పాదరసం , సీసం , పీవీసీ పూతపూసిన రాగి తీగలు ఉంటాయి . వీటివల్ల మొదట ఈ రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారికే హానికరము .


 

హానికర వ్యర్ధపదా్ర్ధాలు ->


సీసమం : టీవీలు , కంప్యూటర్ మోనిటర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది . అధిక మోతాదులో సీసం ప్రభావానికి గురైతే ... వాంతులు ,విరేచనాలు , మూర్చ రావడం , కోమా లోనికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది .

క్యాడ్మియం : సెమీ కండక్టర్ చిప్ లు , క్యఠోడ్ రే ట్యూబ్ ల్లో దీన్ని వినియోగిస్తారు . క్యాడ్మియం ను పీల్చితే ఊపిరితిత్తులు , మూత్రపిండాలు దెబ్బతింటాయి . కొన్ని కేసుల్లో మరణాలూ సంభవిస్తాయి.

పాదరసం : ప్రపంచవ్యాప్తం గా ఉత్పత్తి అయ్యే పాదరసం లో 22 శాతం ఎలక్ట్రానిక్ పరిశ్రమే వినియోగిస్తోంది . ఇది మెదడు , మూత్రపిండాలు వంటి అవయవాలను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తుంది .

బేరియం : సీ అర్ టీ స్క్రీన్ ప్యానెళ్ళ లో రేడియోధార్మికత నుంచి ప్రజలను రక్షించేందుకు బేరియం ను వాడతారు . గుండె , కాలేయము వంటి అవయవాలను పాడుచేస్తుంది .

బెరీలియం : ఈ లోహం తేలిగా , దృఢం గాను ఉంతుంది .విద్యుత్ ను బాగా గ్రహించే దీన్ని పరిశ్రమలొ వివిగా వాడతారు . ఇది ఊపిరితిత్తుల కేన్సర్ ను కలుగజేస్తుంది .

పాలీ వినైల్ క్లోరైడ్ (పి.వి.సి) : ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే ప్లాస్టిక్ లో పివిసె నే ఎక్కువగా ఉంటుంది . వీటిని మండించడం వల్ల వెలువడే "డైఆక్షిన్లు " రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి .

Computer Vision Syndrome - కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్





కాలం మారింది. తినే తిండిలో, కట్టే బట్టలో ఇలా వేసే ప్రతి అడుగులోనూ మార్పులు వచ్చాయి. ఇక పిల్లల పరిస్థితి వేరే చెప్పక్కరలేదు. వీరి ప్రతి కదలికలోను వైవిధ్యం ఉంటోంది. నూటికి ఎనభై శాతం మంది హైపర్‌ ఆక్టివ్‌ పిల్లలు ఉంటున్నారు. రోజులో దాదాపు 10 గంటలు కంప్యూటర్స్‌, టివీల ముందు గడుపుతున్నారు. వీరిలో ఎంతమంది టివీ చూసేముందు, కంప్యూటర్‌ వాడేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారు? అంటే దాదాపు ఎవ్వరూ పాటించట్లేదనే చెప్పాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు పూర్తిగా కంప్యూటర్లతోనే పనిచేస్తున్నారు. వీరు ఎంతసేపూ పని ఎప్పుడు త్వరగా అవ్ఞతుందా అని చూస్తున్నారు తప్పితే, పనిచేసేటపుపడు జాగ్రత్తలు పాటించడం లేదు. ఇలా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మనిషికి కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ వస్తుంది. ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ వాడకం ఒక నిత్యకృత్యమైపోయింది. దానితోపాటే వివిధ రకాల జీవనశైలికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ రకమైన వ్యాధుల్లో కళ్లు తడి ఆరిపోవడం, కంటి నొప్పి, తల, మెడ కండరాల నొప్పులు మొదలైనవి ముఖ్యమైనవి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా సుమారు 10 మిలియన్ల మంది కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ (సివిఎస్‌)కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్‌పై పని చేసే వారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

సివిఎస్‌ సమస్య ఉత్పన్నమవడానికి కంప్యూటర్‌ స్క్రీన్‌నుంచి వెలువడే రేడియేషన్‌ ఒక ప్రధాన కారణం. అలాగే పరిసరాలలోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కంప్యూటర్‌ ముందు కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌ మీద పని చేయడం వంటి కారణాలతోపాటు, దృష్టి లోపాలు కూడా సివిఎస్‌ కలగడానికి కారణమవుతాయి.

కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఈ కింద పేర్కొన్న సూచనలు సహాయకారిగా ఉంటాయి.అర్హత కలిగిన నేత్ర వైద్యులతో పరీక్షలు చేయించుకుని, తడి ఆరిపోయిన కళ్లకు, దృష్టిలోపాలకు సకాలంలో సరైన చికిత్స చేయించుకోవాలి. యాంటిగ్లేర్‌ అద్దాలను వాడాలి.కంప్యూటర్‌పై పని చేస్తున్నప్పుడు ప్రతి మూడు గంటలకు ఒకసారి కనీసం 10 నిముషాలపాటు విశ్రాంతి తీసుకోవాలి. చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

కంప్యూటర్‌పై పని చేస్తున్న సమయంలో కను రెప్పలు కొట్టు కోవడం తగ్గు తుంది. కనుక ఎక్కువసార్లు కంటి రెప్పలు మూసి తెరుస్తూ ఉండాలి.
సవ్య, అపసవ్య దిశలలో ఐదుసార్లు కనుగుడ్లు తిప్పడం వల్ల ఇబ్బంది తగ్గుతుంది.కండి తడి ఆరి పోయిన వారు (డ్రై ఐస్‌ సమస్యతో బాధపడేవారు) వైద్య సలహా మేరకు లూబ్రికెంట్‌ మందులను వాడాలి.

కంటిని నీటితో కడగడం, అశాస్త్రీయ పద్ధతుల్లో కంటి చుక్కల మందులను వాడటం వల్ల కంటి దృష్టి మరింత మందగించే ప్రమాదం ఉంది.కళ్లు లాగుతున్నా, తరచుగా తలనొప్పి, మెడనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స పొందాలి.

‘‘సివిఎస్’’ నివారించాలంటే....ఈ క్రింది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి :


1. కాంట్రాస్ట్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసిన పరిసర ప్రాంతాలలో, అదే విదంగా, స్ర్కీన్ పైన ఎక్కువ కాంతి ఉండే విధంగా చూడకూడదు. స్ర్కీన్ పైన కూడా డార్క్ నెస్ ఎక్కువ ఉంచకూడదు. దీనివలన లెటర్స్ కన్పించే అవకాశం తక్కువ....అంటే...స్ర్కీన్ బ్రైట్ నెస్ ను తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
2. యాంటీ గ్లేర్ : మానిటర్ నుంచి వచ్చే కాంతి నేరుగా కళ్ళపై పడకుండా, నిరోధించటానికి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. దీన్ని మానిటర్ కు అమర్చుకోవటం వలన కళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుంది.
3. కలర్ : కలర్స్ ను కూడా సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి.
4. వర్క్ స్టేషన్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసుకున్న పరిసర ప్రాంతాలలో వాతావరణం చక్కగా ఉండేటట్లు చూడాలి. అంటే ఎర్గానమిక్ చైర్స్ ను ఉపయోగించటం...కంప్యూటర్ ను ఒక పద్ధతి ప్రకారం సెటప్ చేసుకోవం వంటివి చేయాలి. ఉదాహరణకు : కీ-బోర్డ్, మౌస్ ను సులువుగా, ఉపయోగించే విధంగా, అదే విధంగా మన చేతులకు కంటే కింద ఉంటే విధంగా సెటప్ చేయాలి. తరుచుగా ఉపయోగించే ఆబ్జెక్టులను కూడా మానిటర్ కు దగ్గరగా ఉంచటం వలన వాటికోసం వెతకనవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.
5. మోనిటర్ : సాదారణంగా మానిటర్ మధ్య భాగం, కళ్ళతో పోల్చినప్పుడు 4 నుంచి 6 అంగుళాలు కిందకు ఉండాలి. దీనివలన కంటి రెప్పలు, కల్ళను కొంత వరకూ కప్పి ఉంచుతాయి. దీనితో కళ్ళు ఎండిపోవటానికి అవకాశం ఉండదు. అదే విధంగా కంటికి స్క్రీన్ కు మధ్య దూరం 55 నుంచి 75 సెంటీ మీటర్స్ వరకూ ఉండాలి.

Back Ach (Lumbago) -నడుము నొప్పి




జీవితం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం లో నడుము నొప్పిని అనుభవించే ఉంటారు . దానికి ఎన్నో కారణాలు . కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది .

ఈ రోజుల్లో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలి విధానమే. ఒక ప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, నేటి ఆధునిక యుగంలో యుక్తవయస్కులను సైతం బాధిస్తుంది. 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని జాగ్రత్తలతో దీనిని తప్పించుకోవటం గానీ.. తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయొచ్చు.

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లే సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగడం వల్ల, నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.

కారణాలు:


నడుము నొప్పి రావటానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యన ఉన్న కార్టిలేజ్‌ లో వచ్చేమార్పు. (కార్టిలేజ్‌ వెన్నుపూసలు సులువుగా కదలడానికి తోడ్పడుతుంది) కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్లనొప్పి వస్తుంది. నడుము నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే. ఇంతేకాకుండా టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీంతో నడుము నొప్పి ఏర్పడుతుంది. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య నడుము నొప్పి..... ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే కొన్ని పనులకు... ముఖ్యంగా స్త్రీలు వంట పనులు చేస్తున్నప్పుడు వస్తువులకోసం వంగి లేస్తున్నప్పుడు ఇది కలుగుతుంది.



- స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉప యాగించిన కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం .
- పడక సరిగా కుదరనప్పుడు, ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.
- కంప్యూటర్స్‌ ముందు ఎక్కువ సేపు కదలకుండా విధులు నిర్వర్తించటం.
- తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం,
- ప్రమాదాలలో వెన్ను పూసలు దెబ్బ తినటం లేదా ప్రక్కకు తొలగటం వలన నడుము నొప్పివస్తుంది.
- ఉద్యోగంలోని అసంతృప్తి అనారోగ్యాన్ని పెంచిపోషిస్తుందంటున్నాయి అధ్యయనాలు. వెన్నునొప్పికీ ఉద్యోగంలో ఎదుర్కునే అసంతృప్తులకు సంబంధం ఉందంటున్నాయి క్వీన్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు. తక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటున్న తోటి ఉద్యోగస్తులతో పోల్చుకుంటే వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నవారిలో వెన్నునొప్పి తగ్గడానికి చాలాకాలం పడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది.

లక్షణాలు:


నడుము నొప్పి తీవ్రంగా ఉండి వంగటం, లేవటం, కూర్చోవటం, కష్టంగా మారుతుంది, కదలికల వలన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నాడులు ఒత్తిడికి గురికావడం వలన, నొప్పి ఎడమకాలు లేదా కుడికాలుకు వ్యాపించి బాధిస్తుంది. హఠాత్తుగా నడుము వంచినా బరువులు ఎత్తినా నొప్పితీవ్రత భరించ రాకుండా ఉంటుంది.

జాగ్రత్తలు:


- సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
- నడుము నొప్పి నివారణకు ప్రతిరోజు వ్యాయా మం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయాలి.
- ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చు న్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి.
- వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి.
- సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
- నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
- శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
- శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వాళ్లు హఠాత్తుగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలను పట్టిఉంచే కండరాలు అందుకు తగినట్టుగా స్పందించవు. ఇలాంటి వాళ్లు కాస్త పెద్ద బరువులు ఎత్తకపోవటమే మేలు. ఎత్తేటప్పుడు కూడా నడుము మీద భారం పడకుండా.. మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
- స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు అసలు ఎత్తు మడమల చెప్పులు ధరించకపోవటమే మేలు.
- పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయం తగ్గించుకోవాలి.

నడుం నొప్పికి చిన్న చిన్న జాగ్రత్తలు:



  • * కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.

  • * వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.

  • * మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి.

  • * మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.

  • * ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.

  • * కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.

  • * అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.

  • * ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


చికిత్స :


బుటాల్జిన్ అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున వాడినట్లయితే ఈ నడుము నొప్పి తగ్గుతుంది. అంటే వీటిని ప్రతి 8 గంటలకు ఒకసారి మాత్రమే వాడాలి. ఇవి కాకపోతే బెరిన్ టాబ్లెట్లను రోజుకు రెండు చొప్పున వాడినా నడుము నొప్పి బాధ తగ్గతుంది.

దీనికి కొన్ని రకాల పైపూత మందులు(Dolorub, Zobid gel , Nobel gel etc.) కూడా వచ్చాయి. అయితే ఇటువంటి వాటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒకవేళ ఈ మందులు వాడినప్పటికీ నడుము నొప్పి తగ్గకపోయినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

నడుము నొప్పికి ఆయుర్వేదం :


కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు,
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల చేయాలి 10 సార్లు రోజు,

దాంపత్యము :


వేసవి కాలం: 3 లేక 4 రోజులకు,
వాన కాలం : 7 లేక 15 రోజులకు,
చలికాలం : రోజు,

1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి...పాత బెల్లం పావు కేజి...ఆవు లేక గేద నెయ్యి పావు కేజి...అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి ,వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా 40 రోజులు చేయలి .
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద అతికించాలి, అది వుడిపోదు..
3.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి
4.వెల్లుల్లి గారెలు :మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు...అల్లం 3 గ్రాములు...ఇంగువ 3 చిటికెలు...సైంధవలవణం పావు స్పూను...అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి,
5.బాదం పప్పు పావు కేజి,మునిగేటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి..పటిక బెల్లం పావు కేజి...అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి...ఇది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి,జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది

మధుమేహం - నడుము నొప్పి:


మధుమేహుల్ని వేధించే ఇబ్బందుల చిట్టా చేంతాడంత పెద్దది. ఆ వరసలో నడుము నొప్పీ ఉంటుందని చాలామందికి తెలియదు. వీరిలో ఇది.. ప్రత్యేకించి కూర్చున్నప్పుడు తగ్గుతూ, నడిచేటప్పుడు విజృంభిస్తుంటుంది. నడవటం మొదలుపెట్టగానే.. నొప్పి తీవ్రత పెరుగుతుంది. నడక ఆపితే, ఒక్కసారిగా తగ్గి, క్రమేపీ మాయమవుతుంది. అదే దీని ప్రత్యేకత.



మధుమేహులు ఈ తరహా నడుము నొప్పి విషయంలో పొరపాటు పడుతూ, లంబార్‌ స్పాండిలోసిస్‌, సయాటికా నొప్పి వంటివాటిని అనుమానిస్తారు. చాలా రోజులపాటు అలాగే తోసేసుకు తిరిగి, ఎట్టకేలకు ఎముకల వైద్యుల్ని సంప్రదిస్తారు. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ తదితర పరీక్షలన్నింటినీ వరసపెట్టి చేయించి, చివరికి క్యాల్షియం, నొప్పి నివారిణి మాత్రలు, వ్యాయామ సూచనలతో ఇంటిముఖం పడతారు. వీటన్నింటినీ పాటించినా సరైన ఉపశమనం కనిపించదు. ప్రతి నెలా డాక్టర్ల చుట్టూ తిరగటం, మందుల్ని మార్చటం, నొప్పితో బాధపడటం.. ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది.

నడుము నొప్పా? యాంజైనా?


మధుమేహం లేని సాధారణ ఆరోగ్యవంతుల్లో నడుము నొప్పి వేధించటానికి మామూలుగా రెండు కారణాలు తోడవుతాయి. ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్‌ తాలూకు పాతనొప్పి తిరగదోడటం ఒకటైతే, అధిక బరువు, నడక తగ్గిపోవటం వంటివి రెండో కారణం. ఏ మాత్రం వ్యాయామం, వాకింగ్‌ చేయకుండా, గంటల తరబడి కూర్చోవటానికి అలవాటు పడితే.. నడుములో వెన్నుపూసలకు అనుసంధానంగా ఉండే కండరాలు, లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోతాయి. బిగుతుగా, బిరుసుగా మారతాయి. ఫలితంగా.. ఇలాంటి వారు వాకింగ్‌, శారీరక శ్రమ చేసినప్పుడు నడుము నొప్పి వేధిస్తుంది.

మరోవైపు.. మధుమేహ బాధితులకు నడుము, తొడల్లో నొప్పిగా ఉందంటే ఇతరత్రా కారణాల్ని అనుమానించాల్సిందే. వీరిలో సమస్యకు కారణం లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోవటం మాత్రం కాదు. నడుము, తొడల ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గిపోవటం కూడా మధుమేహ బాధితుల్లో ఇలాంటి సమస్యలకు కారణమవుతుంది. ఇలా రక్తప్రసరణ చాలీచాలకుండా జరగటాన్ని వైద్య పరిభాషలో 'యాంజైనా' అంటారు. గుండె గోడలకు రక్త ప్రసరణ సక్రమంగా అందకపోతే 'ఛెస్ట్‌ యాంజైనా' తలెత్తినట్లే.. నడుము కండరాలకు చాలీచాలని రక్తప్రసరణ జరుగుతున్నప్పుడు 'వెయిస్ట్‌ యాంజైనా', 'నడుము నొప్పి' రూపంలో సమస్య బయటపడుతుంది. ఛెస్ట్‌ యాంజైనాను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు తలెత్తినట్లే, నడుము యాంజైనాకు సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పాదాలకు రక్తసరఫరా తగ్గి గ్యాంగ్రీన్‌ సమస్య తలెత్తవచ్చు.

నొప్పెందుకు?


గుండె నుంచి కిందికి వచ్చే పెద్ద రక్తనాళం పొట్ట దాకా వెళ్లి అక్కడ కాలేయం, పేగులు వంటి అవయవాలకు శుద్ధమైన ఆక్సిజన్‌ను అందజేస్తుంది. ఇదే నాళం నడుము భాగంలోని కండరాలు, అవయవాలకు కూడా ఆక్సిజన్‌ అందజేస్తుంది. ఆ తర్వాత అది రెండుగా విడిపోయి ఎడమ, కుడి తొడలవైపు ఒక్కో నాళం వెళ్లి, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఈ నాళాల ద్వారా రక్తం పాదాల వరకూ చేరుతుంది.

సాధారణంగా రక్తనాళాల గోడలకు కొవ్వు, కొలెస్ట్రాల్‌, క్యాల్షియం వంటివి పేరుకు పోతూంటే, రక్తనాళాలలో రక్తప్రసరణ మార్గం కుచించుకుపోతుందన్న సంగతి తెలిసిందే. దీనివల్ల అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. మధుమేహ బాధితుల్లో వ్యాయామం, క్రమశిక్షణ కొరవడితే రక్తంలో గ్లూకోజ్‌ పెరిగి పోతుంది. కొవ్వు, క్యాల్షియం పేరుకుపోవటంతో రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడతాయి. మధుమేహుల్లో.. ఈ రక్తనాళం రెండుగా విడిపడే నడుము భాగంలో అవరోధం ఏర్పడవచ్చు. దాంతో తొడలు, పాదాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా నడుము నొప్పి వేధిస్తుంది. ఈ పరిస్థితిని 'లెరిచ్‌ సిండ్రోమ్‌'గా వ్యవహరిస్తారు.

నిర్లక్ష్యానికి మూల్యమెక్కువ:


నడుము యాంజైనాకు సరైన చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే.. పురుషాంగానికి రక్తప్రసరణ మందగించి, సామర్థ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండో సమస్య- పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవటం. దీనివల్ల పాదాల్లో తీవ్రమైన నొప్పితోపాటు కండ నల్లబారటం, గ్యాంగ్రీన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. సెక్సు సామర్థ్యాన్ని పదిల పరచుకోవటానికీ, పాదాల్ని పరిరక్షించుకోవటానికి మధుమేహులు నడుము యాంజైనా విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే.

పెయిన్‌ కిల్లర్లు వద్దు:


నడుము నొప్పితో బాధపడేవారు.. తరచూ డాక్టర్లను మార్చేస్తుంటారు. దీనితో వారు వాడే నొప్పినివారిణ మాత్రల (పెయిన్‌ కిల్లర్లు) బ్రాండ్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కొంతమంది డాక్టర్ని సంప్రదించటానికి బదులుగా, తమకు తామే నేరుగా మందుల దుకాణానికి వెళ్లి పలురకాల మాత్రల్ని తెచ్చుకుని వాడేస్తుంటారు. ఏ కొంచెం నొప్పిగా, నలతగా ఉన్నా వెంటనే మాత్ర వేసేసుకుంటారు. ఇలా పెయిన్‌ కిల్లర్లను ఏళ్ల తరబడి విచ్చలవిడిగా వాడటం వల్ల రెండురకాలుగా నష్టం వాటిల్లుతుంది. ఎలాగంటే.. నొప్పి నివారిణి మాత్రలతో నొప్పినుంచి ఉపశమనం పొందుతూ, నడుము యాంజైనాకు సరైన వైద్య చికిత్స తీసుకోకపోవటం వల్ల పాదం కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. రెండోవైపు- మూత్రపిండాల వైఫల్యం తెలెత్తే అవకాశం పెరుగుతుంది. పెయిన్‌ కిల్లర్లను ఎక్కువెక్కువగా వాడటమే ఇలాంటి సమస్యకు కారణం. ప్రత్యేకించి మధుమేహుల్లో పెయిన్‌ కిల్లర్లు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తాయి. కొంతలోకొంత ప్యారసెటమాల్‌ వంటివే కిడ్నీలకు సురక్షితమైన మాత్రలుగా తేలాయి.

నడుము నొప్పి.. ఏం చేయాలి?


నడుము నొప్పి సమస్య వేధిస్తుంటే.. పెయిన్‌ కిల్లర్లు వేసేసుకుని నొప్పి నుంచి ఉపశమనం పొందటం శాశ్వతమైన పరిష్కారం కాదన్న సంగతి గుర్తించాలి. మీరు మధుమేహులై, నడుము నొప్పితో కూడా బాధ పడుతున్నట్లయితే వెంటనే నడుము దగ్గర రక్తనాళాల పూడికలను కూడా అనుమానించటం మంచిది. తొడలు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల పరిస్థితి ఎలా ఉంది?రక్త సరఫరా సజావుగానే జరుగుతోందా అనేది నిర్ధారించుకోవాలి.

నడుము నొప్పితో బాధపడే మధుమేహులకు... వ్యాస్కులర్‌, కార్డియో థొరాసిక్‌ సర్జన్లు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. డాప్లర్‌, సీటీ యాంజియోగ్రఫీ, ఎంఆర్‌ యాంజియోగ్రఫీ వంటి రోగనిర్ధారణ సౌకర్యాలతోపాటు, లింబ్‌ బైపాస్‌ సర్జరీ, స్పైనల్‌ సర్జరీ వంటి శస్త్రచికిత్సలు చేసే అవకాశాలుండే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం.

పొగ వద్దేవద్దు:
మధుమేహులకూ, పొగకూ ఆమడ దూరం. పొగాకుగానీ, పొగనుగానీ చేరదీస్తే రెండుకాళ్లకీ ముప్పు కొనితెచ్చుకోవటం ఖాయమన్న సంగతి మరవద్దు. మధుమేహుల విషయంలో.. ధూమపానం అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది. మధుమేహుల్లో కాళ్లు, పాదాలకు రక్తసరఫరా తగ్గుతుంది, దీనికి తోడు పొగాకు నమలటం, సిగరెట్‌ తాగటం వంటి అలవాట్లవల్ల సమస్య మరింత తీవ్రమై పాదాల్లో గ్యాంగ్రీన్‌ ఏర్పడి, కాళ్లు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇవేకాదు.. పొగాకు వినియోగం వల్ల లింబ్‌ బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు చేసిన తర్వాత కోలుకోవటం కూడా కష్టతరమవుతుంది. ఇలాంటి చికిత్సల తర్వాత కూడా పొగతాగటం మాననట్లయితే.. కృత్రిమంగా అమర్చిన స్టెంట్‌ నాళాలు సైతం కుంచించుకుని సమస్యలకు దారితీస్తాయి. సిగరెట్లు తాగే సంఖ్యను నెమ్మదిగా తగ్గించటం వల్ల వైద్యపరంగా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. మొత్తంగా మానేస్తేనే చికిత్స పనిచేస్తుంది.

చికిత్స సౌకర్యాలేమిటి?


యాంజియోగ్రఫీ చేయటం ద్వారా.. కాళ్లూ, పాదాలకు రక్తసరఫరా చేసే రక్తనాళం ఎక్కడ, ఎంతమేర మూసుకుపోయిందనేది తెలుస్తుంది. దీంతో ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయించవచ్చు. మెజారిటీ కేసుల్లో ఆర్టీరియల్‌ బైపాస్‌ సర్జరీ అవసరమవుతుంటుంది. ఇందులో కృత్రిమ రక్తనాళాల్ని అమర్చుతారు. మరికొంతమందిలో స్టెంట్లు అమర్చటం ద్వారా మూసుకుపోయిన నాళాల్ని తెరుచుకునేలా చేస్తారు. అయితే.. ఇలాంటి చికిత్సల తర్వాత రోగి ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగవ్వాలంటే.. క్రమం తప్పకుండా నడవటం, వ్యాయామం తప్పనిసరి.

నడుము నొప్పికి ఆసనాలు -Back Ach Exercises

నడుము నొప్పి అపోహలు ,Backach and false belief

మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు నడుము నొప్పి బాధను అనుభవించినవారే. ప్రతి 10 మందిలో కనీసం 8 మంది ఏదో సమయంలో దీని బారినపడుతున్నట్టు అంచనా. ఈ నడుము నొప్పిపై అపోహలూ ఎక్కువే. వ్యాయామం చేస్తేనో, బరువులు ఎత్తితేనో నడుము నొప్పి వస్తుందని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఇది వస్తే పూర్తిగా మంచంపై విశ్రాంతి తీసుకోవాల్సిందేనని భావిస్తుంటారు. అసలు ఇలాంటి అపోహల్లో నిజమెంత?

అపోహ: ఎప్పుడూ నిటారుగానే కూచోవాలి.
* ముందుకు వంగి కూచోవటం వల్ల వెన్నెముకకు హాని కలుగుతుందన్నది నిజమే. కానీ పూర్తి నిటారుగా, చాలాసేపు అలాగే కూచున్నా వెన్నెముక త్వరగా అలసిపోతుంది. కాబట్టి ఎక్కువ సమయం కూచోవాల్సి వస్తే.. కుర్చీ వెనక భాగానికి వెన్ను ఆనించి, కొద్దిగా ముందుకు వంగి కూచోవాలి. కాళ్లు నేలను తాకుతుండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూచునే ఉండకుండా.. గంటకోసారి లేచి కాస్త అటూఇటూ నడవటం.. ఫోనులో మాట్లాడటం వంటి పనులను నిలబడే చేస్తుండటం మంచిది.

అపోహ: మరీ బరువైన వస్తువులను ఎత్తరాదు.
* ఎవరికైనా శక్తికి మించిన బరువులను ఎత్తటం శ్రేయస్కరం కాదు. అయితే నడుమునొప్పి విషయంలో ఎంత బరువు ఎత్తుతున్నామన్న దానికన్నా ఎలా పైకి లేపుతున్నామన్నదే కీలకం. ఆయా వస్తువులను దూరం నుంచి వంగి ఎత్తటం కాకుండా.. వాటికి దగ్గరగా వచ్చి మోకాళ్ల మీద కూర్చుని పైకెత్తాలి. వెన్ను నిటారుగా ఉండేలా, శరీరం బరువు కాళ్లపై సమంగా పడేలా చూసుకోవాలి. ఈ సమయంలో శరీరం పక్కలకు తిరిగినా, వంగినా వెన్నెముకను దెబ్బతీస్తుంది.

అపోహ: పూర్తి విశ్రాంతి తీసుకోవటమే మంచి చికిత్స.
* చిన్న చిన్న గాయాలు, బెణుకుల వంటి కారణంగా హఠాత్తుగా నొప్పి వస్తే విశ్రాంతి తీసుకోవటం మంచిదే. అయితే పూర్తిగా మంచం మీదే పడుకోవాలనేది మాత్రం అపోహ. ఒకట్రెండు రోజులు కదలకుండా పూర్తిగా మంచం మీదే ఉండిపోతే నడుము నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.

అపోహ: గాయాల వల్లనే నొప్పి కలుగుతుంది.
* ఒక్క గాయాలే కాదు.. వయసుతో పాటు వచ్చే వెన్నుపూసల అరుగుదల, రకరకాల కండరాల సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, జన్యు పరమైన కారణాల వంటివి కూడా నడుము నొప్పికి కారణమవుతాయి.

అపోహ: బక్క పలుచని వారికి నొప్పి రాదు.
* బరువు ఎక్కువ ఉన్న వారికి నడుమునొప్పి బాధలు ఎక్కువన్న మాట నిజమేగానీ అలాగని బక్కగా ఉండే వారికి నడుము నొప్పి రాదనుకోవటానికి లేదు. నడుము నొప్పి ఎవరికైనా రావొచ్చు. నిజానికి ఆహారం సరిగా తీసుకోకుండా చాలా సన్నగా ఉండేవారికి ఎముక క్షీణత ముప్పూ ఎక్కువే. ఇలాంటి వారికి నొప్పులే కాదు, వెన్నెముక విరిగే ప్రమాదమూ ఉంటుంది.

అపోహ: వ్యాయామం వెన్నెముకకు హాని చేస్తుంది.
* ఇది చాలా పెద్ద అపోహ. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెన్నునొప్పి రాకుండా నివారించుకునే వీలుంది. తీవ్ర గాయాల కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్నవారికి వైద్యులు ప్రత్యేక వ్యాయామాలు సూచిస్తారు. ఇక నొప్పి తగ్గిన తర్వాత తగు వ్యాయామాలు చేయటం ద్వారా మున్ముందు మళ్లీ నడుము నొప్పి బారినపడకుండా చూసుకోవచ్చు.